కెజిఎఫ్ తర్వాతే మనకు కన్నడ స్టార్లు మెల్లగా అలవాటు పడుతున్నారు. దీని పుణ్యమాని బడ్జెట్ లు పెంచేసి ఓ మాదిరి మార్కెట్ ఉన్న హీరోలు కూడా ప్యాన్ ఇండియా అంటూ మల్టీ లాంగ్వేజ్ రిలీజులు డిమాండ్ చేస్తున్నారు. ధృవ సర్జ మనకు పెద్దగా పరిచయం లేని పేరు. ఆ మధ్య పొగరు అనే సినిమా వచ్చింది గుర్తుందా. రష్మిక మందన్న హీరోయిన్. కండలు తిరిగిన ఐరావతం లాంటి దేహంతో అందులో ధృవ ఓవర్ మాస్ గా కనిపించిన తీరు బిసి సెంటర్స్ లో పర్వాలేదనిపించుకుంది. గొప్పగా ఆడకపోయినా శరీరమే ఆకర్షణగా శాండల్ వుడ్ లో నెగ్గుకొస్తున్నాడు ధృవ.
ఇతని కొత్త సినిమా మార్టిన్. నిన్న బెంగళూరులో టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు. తెలుగు మీడియాని ప్రత్యేకంగా విమానంలో తీసుకెళ్లి మరీ అతిథులుగా మర్యాదలు చేశారు. అంత బిల్డప్ ఎందుకయ్యా అంటే వీడియో చూస్తే కానీ అర్థం కాలేదు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇందులో మాములు మేకింగ్ లేదు. పాకిస్థాన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిన మార్టిన్ అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులను, చూస్తేనే గుండాగిపోయే భీకర ఆకారాల మనుషులను ఎదురుకునే పరిస్థితి వస్తుంది. మాన్స్ టర్ గా చెప్పుకునే మార్టిన్ ఎందుకా వలయంలోకి వెళ్లాడనేది స్టోరీ.
విజువల్స్ నిజంగానే వామ్మో అనిపించేలా ఉన్నాయి. హీరోయిజం ఓవర్ ది బోర్డ్ వెళ్లినట్టు అనిపించినా పఠాన్ ఫలితం చూశాక సరైన రీతీలో చూపిస్తే జనం ఆదరిస్తారని అర్థమైపోయింది కాబట్టి మొత్తానికి సినిమా చూశాక ఎందుకింత ఖర్చు పెట్టారో అర్థమవుతుంది. వేసవి విడుదలని టార్గెట్ చేసుకున్న మార్టిన్ తో తెలుగు తమిళ మార్కెట్ ని ధృవ సర్జ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇతను ఎవరో కాదు. సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కు స్వయానా మేనల్లుడు. దీనికి కథను సమకూర్చింది కూడా ఆయనే. ఏపి అర్జున్ దర్శకుడు. కెజిఎఫ్ సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
This post was last modified on February 24, 2023 10:32 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…