కొత్త సినిమాల్లో సార్, వినరో భాగ్యము విష్ణుకథలు పూర్తి చేసినవాళ్లకు ఈ శుక్రవారం అట్టే ఆప్షన్లు లేవు. మిస్టర్ కింగ్, కోనసీమ థగ్స్ తప్ప చెప్పుకోదగ్గ రిలీజులేవీ ప్లాన్ చేసుకోలేదు. ఇవి కూడా టాక్ బాగుందని బయటికి వస్తే తప్ప కనీస ఓపెనింగ్స్ తెచ్చుకునే పరిస్థితిలో లేవు. మరి థియేటర్ కు వెళ్లనిదే ఎంటర్ టైన్ మెంట్ ఎలాగబ్బా అనుకునేవాళ్లకు నాని, రవితేజలు రీ రిలీజుల రూపంలో వెల్కమ్ చెబుతున్నారు. మాస్ మహారాజా మిరపకాయ్ ని రేపు ఏపీ తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. స్క్రీన్ కౌంట్ కూడా గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది.
ధమాకా, వాల్తేరు వీరయ్య వరస హిట్లతో ఊపుమీదున్న ఫ్యాన్స్ నుంచి నిర్మాతలు భారీ స్పందన ఆశిస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్ కి మొదటి బ్రేక్ ఇది. దీన్ని చూశాకే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రీమేక్ కోసం ఇతనికి కబురు పెడితే నూటికి నూరు శాతం నమ్మకాన్ని నిలిబెట్టుకున్నాడు. ఇక న్యాచురల్ స్టార్ అలా మొదలైంది సైతం మరోసారి పలకరించేందుకు రెడీ అయ్యింది. నాని పుట్టినరోజు సందర్భంగా హఠాత్తుగా దీన్ని తెరపైకి తెచ్చారు. కూల్ ఎంటర్ టైనరైనా నానిని స్టార్ లీగ్ లోకి తెచ్చింది ఈ మూవీనే. సోషల్ మీడియాలో కల్ట్ స్టేటస్ దీనిది.
క్లీన్ కామెడీ, హిట్ మ్యూజిక్ తో పాటు తనలో బెస్ట్ టైమింగ్ పరిచయమయ్యింది దీంతోనే. తాగుబోతు రమేష్, దర్శకురాలు నందినిరెడ్డిలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత జోరుగా లేవు కానీ కరెంట్ సేల్స్ మీద డిస్ట్రిబ్యూటర్లు నమ్మకం పెట్టుకున్నారు. గత ఆరు నెలలుగా నిత్య ప్రవాహంగా సాగుతున్న ఈ రీ రిలీజులు దగ్గరి భవిష్యత్తులో ఆగే సూచనలు కనిపించడం లేదు పైపెచ్చు వెతికి మరీ ఏవి విడుదల చేద్దామాని చూస్తున్న ప్రొడ్యూసర్లు ఎక్కువైపోయారు. మరి ఈ మిరపకాయ్ ఘాటు, అలా మొదలైంది స్వీటు జనాన్ని మరోసారి మెప్పిస్తాయో లేదో చూడాలి.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…