Movie News

నాగ్ సినిమా… ఇంకా అడ్వాన్స్ తీసుకోలేదు

ప్రతీ హీరోకి ఓ ఫేవరెట్ హీరో ఉంటారు. అల్లరి నరేష్ కి కూడా ఓ ఫేవరెట్ హీరో ఉన్నారు. చిన్నతనం నుండి నరేష్ కి నాగార్జున అంటే ఇష్టం. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పుకున్నాడు అల్లరోడు. అయితే ఇంత వరకూ ఈ కాంబోలో సినిమా రాలేదు. త్వరలో ప్రసన్న కుమార్ ఈ కాంబోను స్క్రీన్ పైకి తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే నరేష్ కి స్క్రిప్ట్ చెప్పడం ఓకే అనేయడం జరిగిపోయింది. ఈ నెలలోనే సినిమా ఓపెనింగ్ అనుకుంటున్నారు.

అయితే తాజాగా అల్లరి నరేష్ కి ఈ సినిమా అప్ డేట్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. నాగార్జున గారికి మీరు పెద్ద ఫ్యాన్ కదా ఆయనతో సినిమా ఉంటుందా ? అని అడగ్గా మీరు దేని గురించి అడుగుతున్నారో నాకర్థమైంది. కానీ ఇంకా సైన్ చేయలేదు. ప్రొడక్షన్ హౌజ్ నుండి త్వరలోనే అప్ డేట్ వస్తుందంటూ చెప్పుకున్నాడు. ఇంకా సినిమాకు డబ్బులు తీసుకోలేదని అడ్వాన్స్ తీసుకున్నాకే ప్రొడక్షన్ హౌజ్ ఎనౌన్స్ చేసేది అంటూ నవ్వుతూ చెప్పాడు నరేష్.

నాగార్జున సినిమాలో అల్లరి నరేష్ తో పాటు మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నాడు. నాగార్జున కోసం హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు ప్రసన్న. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజీలో ఉన్న ఈ సినిమా వచ్చే నెల నుండి అమలాపురంలో షూటింగ్ మొదలు కానుంది. మలయాళంలో సూపర్ హిట్టయిన పొరింజు మరియమ్ జోస్ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నాడు.

This post was last modified on February 22, 2023 10:53 pm

Share

Recent Posts

పీవీఆర్‌లో 175 రూపాయల సినిమా

టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…

2 minutes ago

పోలీసు దెబ్బ: వైసీపీలో `ర‌ప్పా-ర‌ప్పా` పోయిందే

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా ఇటీవల కాలంలో `ర‌ప్పా-ర‌ప్పా` డైలాగులు త‌ర‌చుగా వినిపించేవి. రప్పా-ర‌ప్పా అని రాసున్న బ్యాన‌ర్లు,…

7 minutes ago

కనకరాజు కొట్టులో బోణీ బాగుంది

వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…

15 minutes ago

రామాయ‌ణం.. ర‌ణ‌బీర్… ర‌బ్బ‌ర్ చెప్పులు

పురాణ గాథ‌ల‌ను తెర‌కెక్కించేట‌పుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని తెర‌పైకి తీసుకురావ‌డం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విష‌యం…

1 hour ago

జ‌గ‌న్ భద్రతపై వైసీపీ నేతల ఆందోళన

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా బుధ‌వారం తూర్పుగోదావ‌రి జిల్లా దేవ‌ర‌ప‌ల్లిలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి పొగాకు రైతుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. తొలుత…

2 hours ago

ఆన్ లైన్లో తండ్రి అంత్యక్రియలకు హాజరు

రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…

2 hours ago