టాలీవుడ్ హీరోలే కాదు.. నిర్మాతలు సైతం పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలని చూస్తున్నారు ఈ మధ్య. అందుకోసం ఓవైపు పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకుంటూనే ఇతర భాషల్లోకి వెళ్లి సినిమాలు నిర్మించే ప్రయత్నమూ చేస్తున్నారు. ఈ ఏడాది ‘వారిసు’ చిత్రంతో దిల్ రాజు, ‘వాత్తి’ మూవీతో సితార నాగవంశీ కోలీవుడ్లో అడుగు పెట్టారు. వారికి మంచి ఫలితమే దక్కింది.
కానీ ఇండియాలో అతి పెద్ద ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్లో జయకేతనం వేయాలని చూస్తున్న టాలీవుడ్ నిర్మాతలకు మాత్రం చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి మన ప్రొడ్యూసర్లు నిర్మిస్తున్న చిత్రాలకు దారుణమైన ఫలితాలు ఎదురవుతున్నాయి. వాళ్లు ప్రధానంగా రీమేక్ సినిమాలతోనే బాలీవుడ్లో హిట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. అవి వర్కవుట్ కావట్లేదు.
దిల్ రాజుకు గత ఏడాది హిందీలో రెండు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. తెలుగు హిట్ ‘హిట్’ను రాజ్ కుమార్ రావు హీరోగా హిందీలో నిర్మించిన ప్రొడ్యూసర్లలో రాజు ఒకడు. అది కనీస ప్రభావం కూడా చూపలేకపోయింది. ఇక ‘జెర్సీ’ సినిమాను తెలుగు వెర్షన్ నిర్మాత నాగవంశీతో కలిసి హిందీలో పునర్నిర్మించాడు రాజు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లాగే సంచలనం రేపుతుందనుకుంటే.. ఇది చతికిలపడింది.
ఇక గతంలో ‘గజిని’ సినిమాతో బాలీవుడ్లో భారీ విజయాన్నందుకున్న అల్లు అరవింద్.. తెలుగులో తన కొడుకు హీరోగా తెరకెక్కిన నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ను ‘షెజాదా’ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో ఒరిజినల్ ప్రొడ్యూసర్లలో ఒకరైన ఎస్.రాధాకృష్ణ నిర్మాణ భాగస్వామే. కానీ వీళ్లిద్దరికీ చేదు అనుభవాన్ని మిగులుస్తూ ఈ రీమేక్ డిజాస్టర్గా నిలిచింది. మన నిర్మాతలు హిందీలో సినిమాలు చేయడం బాగానే ఉంది కానీ.. రీమేక్ల కంటే ఒరిజినల్ స్టోరీల మీద దృష్టిపెడితే మంచిదని ఈ చిత్రాల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
This post was last modified on February 22, 2023 3:55 pm
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
టాలీవుడ్లో అత్యంత నిరాశాజనకంగా సాగిన వేసవి సీజన్లలో 2025 ఒకటి. ఆ సంవత్సరం ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా…
టాలీవుడ్లో హీరోగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే పెద్ద రేంజికి చేరుకుని.. ఆ తర్వాత సుదీర్ఘమైన ఫ్లాప్…
టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తలపెట్టి రామాయల నిర్మాణానికి సంబంధించిన ఇక్కట్లు దాదాపు తొలిగిపోయాయి. ఆయన సొంత…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అసామాన్యులు విజయం దక్కించుకోవడం.. వారసులు గెలుపు గుర్రాలు ఎక్కడం.. వరుస విజయాలు దక్కించుకున్న హేమాహేమీలు…