రజతోత్సవాలు దశాబ్దాల కిందటే చరిత్రలో కలిసిపోయాయి. శతదినోత్సవాల కథ మరిచిపోయి కూడా చాలా ఏళ్లయిపోయింది. సినిమాలు ఎంత పెద్ద హిట్ అనేది 50, 100 రోజుల సెంటర్లను బట్టి లెక్కలు వేసే రోజులు కావివి. ఇప్పుడంతా వసూళ్లను బట్టే సినిమా ఫలితాన్ని అంచనా వేస్తున్నారు. కొన్ని సెంటర్లలో కూడా ఓ సినిమా 50 రోజులు ఆడడం గగనం అయిపోతోంది. సినిమాల మేకర్స్ కూడా ఆ లెక్కల్ని అస్సలు పట్టించుకోవడం లేదు.
ఇలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ లాంగ్ రన్తో ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రం పెద్ద సంఖ్యలోనే థియేటర్లలో 50 రోజుల వేడుకలను జరుపుకోబోతోంది. మార్చి 3తో ‘వాల్తేరు వీరయ్య’ అర్ధశత దినోత్సవం పూర్తి చేసుకోనుండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో థియేటర్లు ఈ వేడుకకు సిద్ధమవుతున్నాయి.
ఒక్క నైజాం ఏరియాలో మాత్రమే దాదాపు 40 సెంటర్లలో ‘వాల్తేరు వీరయ్య’ అర్ధశతకం జరుపుకోనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 15 సెంటర్లు డైరెక్ట్ కాగా.. 25 సెంటర్ల దాకా షిఫ్ట్తో 50 రోజులు పూర్తి చేసుకోనున్నాయి. ఆంధ్రా ఏరియాలో కూడా దాదాపు ఇదే సంఖ్యలో 50 రోజుల సెంటర్లు పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ప్రతి పేరున్న సెంటర్లో ఈ సినిమా 50 రోజులు ఆడుతోంది. రాయలసీమలో కూడా చెప్పుకోదగ్గ సెంటర్లలో 50 రోజుల పోస్టర్ పడనుంది. దగ్గర దగ్గర 100 సెంటర్లలో ‘వాల్తేరు వీరయ్య’ 50 రోజులు ఆడొచ్చని అంటున్నారు. ఆ టైంకి పూర్తి వివరాలు బయటికి రావచ్చు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు కూడా ఇన్ని సెంటర్లలో 50 రోజులు ఆడింది లేదు. ఈ రోజుల్లో ఓ సినిమా ఇన్ని సెంటర్లలో అర్ధశత దినోత్సవం జరుపుకోవడం అంటే అరుదైన విషయమే. సంక్రాంతి సినిమాల్లో లాంగ్ రన్తో నిలబడింది ‘వాల్తేరు వీరయ్య’ మాత్రమే. తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా రెండు వీకెండ్లకు మించి నిలవలేకపోయింది.
This post was last modified on February 22, 2023 3:44 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…