Movie News

హాట్ టాపిక్‌గా మారిన ఆలియా పోస్టు

ఈ సోషల్ మీడియా కాలంలో.. ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ఈ రోజుల్లో.. సెలబ్రెటీల ప్రైవసీ అనేది పెద్ద సమస్యగా మారిపోతోంది. వాళ్లు ఇంటి నుంచి బయట అడుగు పెట్టడం ఆలస్యం.. కెమెరాలు వెంటాడేస్తుంటాయి. వాళ్లు ఏ స్థితిలో ఉన్నారు.. ఏ పనిలో ఉన్నారు అని చూడకుండా కెమెరాలు క్లిక్‌మనిపించేస్తుంటారు జనాలు. ఐతే బయటికి వచ్చినపుడు ఈ సమస్య ఎప్పుడూ ఉండేదే కానీ.. కనీసం ఇంట్లో ఉన్నపుడు కూడా వారి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించకపోవడం దారుణమైన విషయం.

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సమస్యతోనే ఇబ్బంది పడింది. తాను ఇంట్లో ఉండగా దగ్గర్లో ఉన్న ఒక ఇంటి డాబా నుంచి ఇద్దరు వ్యక్తులు ఫొటోలు తీయడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు హాట్ టాపిక్‌గా మారింది.

‘‘మీరు నాతో ఆడుకుంటున్నారా? నేను ప్రశాంతంగా నా ఇంట్లో కుటుంబంతో గడుపుతున్నాను. ఎవరో నాపై నిఘా పెట్టినట్లు అనిపించింది. పక్కకు చూస్తే ఇద్దరు వ్యక్తులు మా పక్కింటి డాబా మీది నుంచి నన్ను కెమెరాతో వీడియో తీస్తున్నారు. ఇది సరైందేనా? ఒకరి ప్రైవసీని గౌరవించరా? ఎలాంటి వాళ్ల మధ్య అయినా దాటకూడని ఒక గీత ఉంటుంది. మీరు హద్దులు దాటి ప్రవర్తించారు’’ అంటూ సదరు వ్యక్తుల మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబయి పోలీసులను ఈ పోస్టులో ఆమె ట్యాగ్ చేసింది. జాన్వి కపూర్ పలువురు సెలబ్రెటీలు ఈ పోస్టు మీద స్పందించారు.

సెలబ్రెటీల వ్యక్తిగత స్వేచ్ఛను జనాలు ఏమాత్రం గౌరవించడం లేదని.. మరీ హద్దులు దాటిపోతున్నారని.. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడాలని.. ఆలియాను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా ఆలియాకు మద్దతుగా నిలుస్తున్నారు.

This post was last modified on February 22, 2023 2:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

1 hour ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

2 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

3 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

3 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

3 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

4 hours ago