గత కొన్నేళ్లలో దక్షిణాదిన తక్కువ అంచనాలతో రిలీజై పెద్ద హిట్టయిన సినిమాల్లో ‘ఖైదీ’ ఒకటి. కార్తి హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రం అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం కేరళ, కర్ణాటకల్లో కూడా బాగా ఆడింది. తెలుగులో లో బజ్తో రిలీజైనప్పటికీ.. మంచి టాక్ రావడంతో అంతకంతకూ కలెక్షన్లు పెంచుకుంటూ సూపర్ హిట్ రేంజిని అందుకుంది.
‘ఖైదీ’ రిలీజైన కొన్ని నెలలకే హిందీలో రీమేక్ కోసం నటుడు, దర్శకుడు అజయ్ దేవగణ్ రీమేక్ హక్కులు తీసుకున్నాడు. తనే ప్రధాన పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించాడు అజయ్. మార్చి నెలాఖర్లో ‘భూలా’ పేరుతో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేశారు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
‘ఖైదీ’లో ఎక్కడా కూడా హీరోయిన్ కనిపించదు. తన భార్య గురించి కార్తి ఊరికే మాటల్లో మాత్రమే చెబుతాడు. దృశ్య పరంగా అతడి గతాన్ని ఏమీ చూపించరు. అతడి బ్యాక్ స్టోరీ అంటూ ఏమీ తెరపై కనిపించదు. ఐతే అతడి పూర్వ కథతో ‘ఖైదీ ప్రీక్వెల్’ తీయాలని దర్శకుడు లోకేష్ భావిస్తున్నాడు. భవిష్యత్తులో ఆ కథతో సినిమా ఉండొచ్చు. ఐతే ఈలోపే అజయ్ హీరో పూర్వ కథను ‘భూలా’లో చూపించేసినట్లున్నాడు.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అజయ్ పక్కన కథానాయిక కనిపించింది. ఆ పాత్రను అమలా పాల్ పోషించడం విశేషం. వీళ్లిద్దరి మీద ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. పాట చివర్లో హీరోయిన్ కోసం వస్తున్న రౌడీలను హీరో ఎదుర్కోవడానికి సిద్ధపడ్డ దృశ్యం చూపించారు. లోకేష్ భవిష్యత్తులో ఒక సినిమాగా తీయాలనుకున్న పాయింట్ను అజయ్ ఈ సినిమాలో చిన్న ఫ్లాష్ బ్యాక్ రూపంలో చూపించేసినట్లున్నాడు. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు అతను ఇంకా మార్పులేవో చేసినట్లున్నాడు. ఈ చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కించడం విశేషం.
This post was last modified on February 21, 2023 8:16 pm
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…