Movie News

అవార్డులపై కన్నేసిన దిల్ రాజు

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నుండి ఎన్ని సినిమాలొచ్చినా అందులో ‘శతమానం భవతి’ కి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. కమర్షియల్ గా ఎన్ని విజయాలు అందుకున్నా , ఎంత మంచి పేరు తెచ్చుకున్నా దిల్ రాజు కి నేషనల్ అవార్డు తో గౌరవం తీసుకొచ్చింది మాత్రం ‘శతమానం భవతినే’. అందుకే బొమ్మరిల్లు తర్వాత రాజు గారు తనకి స్పెషల్ మూవీగా ఈ సినిమానే చెప్పుకుంటారు.

ఇప్పుడు మరో అవార్డు ఫిలిమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దిల్ రాజు. కమెడియన్ వేణును దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘బలగం’ అనే చిన్న సినిమా నిర్మించాడు. ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ లోగా కొందరికి స్పెషల్ షోస్ వేస్తూ వారి చేత మెప్పు పొందే ప్రయత్నంలో ఉన్నారు.

తెలంగాణా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ తనకి నేషనల్ అవార్డు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నాడు దిల్ రాజు. పదే పదే అందరితో అదే చెప్పుకుంటున్నారు కూడా. ఒక ముసలి వ్యక్తి మరణం తర్వాత జరిగే డ్రామాతో ఈ సినిమా తెరకెక్కింది. కన్నడ లో వచ్చిన ‘తిథి’ కి కాస్త దగ్గరగా ఉండబోతుందని అంటున్నారు. తిథి కి బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ కన్నడ కేటగిరీలో నేషనల్ అవార్డు దక్కింది. ఇప్పుడు అదే కోవలోకి చెందిన ‘బలగం’ కి కూడా అవార్డు వస్తుందని భావిస్తున్నాడు దిల్ రాజు. ఒక్క నేషనల్ అవార్డు మాత్రమే కాకుండా బలగం తన బేనర్ కి మరిన్ని అవార్డులు తెచ్చిపెడుతుందని చాలా నమ్మకంతో ఉన్నారు. మరి బలగం దిల్ రాజు నమ్మకాన్ని నిలబెడుతుందా ? చూడాలి.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

52 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

58 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago