Movie News

అవార్డులపై కన్నేసిన దిల్ రాజు

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నుండి ఎన్ని సినిమాలొచ్చినా అందులో ‘శతమానం భవతి’ కి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. కమర్షియల్ గా ఎన్ని విజయాలు అందుకున్నా , ఎంత మంచి పేరు తెచ్చుకున్నా దిల్ రాజు కి నేషనల్ అవార్డు తో గౌరవం తీసుకొచ్చింది మాత్రం ‘శతమానం భవతినే’. అందుకే బొమ్మరిల్లు తర్వాత రాజు గారు తనకి స్పెషల్ మూవీగా ఈ సినిమానే చెప్పుకుంటారు.

ఇప్పుడు మరో అవార్డు ఫిలిమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దిల్ రాజు. కమెడియన్ వేణును దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘బలగం’ అనే చిన్న సినిమా నిర్మించాడు. ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ లోగా కొందరికి స్పెషల్ షోస్ వేస్తూ వారి చేత మెప్పు పొందే ప్రయత్నంలో ఉన్నారు.

తెలంగాణా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ తనకి నేషనల్ అవార్డు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నాడు దిల్ రాజు. పదే పదే అందరితో అదే చెప్పుకుంటున్నారు కూడా. ఒక ముసలి వ్యక్తి మరణం తర్వాత జరిగే డ్రామాతో ఈ సినిమా తెరకెక్కింది. కన్నడ లో వచ్చిన ‘తిథి’ కి కాస్త దగ్గరగా ఉండబోతుందని అంటున్నారు. తిథి కి బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ కన్నడ కేటగిరీలో నేషనల్ అవార్డు దక్కింది. ఇప్పుడు అదే కోవలోకి చెందిన ‘బలగం’ కి కూడా అవార్డు వస్తుందని భావిస్తున్నాడు దిల్ రాజు. ఒక్క నేషనల్ అవార్డు మాత్రమే కాకుండా బలగం తన బేనర్ కి మరిన్ని అవార్డులు తెచ్చిపెడుతుందని చాలా నమ్మకంతో ఉన్నారు. మరి బలగం దిల్ రాజు నమ్మకాన్ని నిలబెడుతుందా ? చూడాలి.

This post was last modified on February 21, 2023 5:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

8 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

48 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago