విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ తీస్తున్న ‘ఖుషి’ ఏ ముహూర్తన మొదలైందో కానీ ఈ సినిమాకి సమంత రూపంలో పెద్ద బ్రేక్ పడింది. కాశ్మీర్ లో ఒక షెడ్యూల్ పూర్తవ్వగానే వెంటనే వైజాగ్ లో మరో షెడ్యూల్ చేశారు. ఆ ఘాట్ తర్వాత సమంత ఊహించని విధంగా అనారోగ్యానికి గురైంది. మైయోసైటీస్ అనే వ్యాదితో బాధ పడుతున్న సమంత ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోవడంతో ఖుషి షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ఈ నెలాఖరున హైదరాబాద్ లో మొదలుకాబోతుంది.
ఫిబ్రవరి 26 లేదా 28 నుండి షూటింగ్ మొదలు పెట్టే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సమంత ముంబైలో ఉంటూ ఓ వెబ్ సిరీస్ ఘాట్ చేస్తుంది. ఈ నెలాఖరుతో సిరీస్ ఘాట్ కంప్లీట్ కానుండటంతో సమంత ఖుషి కి డేట్స్ ఇచ్చేసింది. ప్రస్తుతం శివ నిర్వాణ షెడ్యూల్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు. మిగతా ఆర్టిస్టుల డేట్స్ ను బట్టి సీన్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ కోసం సెట్ వర్క్ జరుగుతుంది. అలాగే కొన్ని నేచురల్ లొకేషన్స్ లో సీన్స్ తీయబోతున్నారు. ఈ సినిమా కోసమే విజయ్ కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. ఈ సినిమా సెట్ లో అడుగుపెట్టే రోజు కోసం ఎదురుచూస్తున్నాడు. ‘ఖుషి’ ను వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేసి గౌతం తిన్ననూరితో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. దాని తర్వాత పరశురామ్ తో సినిమా ఉండబోతుంది.
This post was last modified on February 21, 2023 4:56 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…