Movie News

1000 కోట్లు వచ్చినా వదలమంటున్నారు

షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల సుదీర్ఘమైన గ్యాప్ కి న్యాయం చేస్తూ పఠాన్ సాధించిన బ్లాక్ బస్టర్ రన్ ఏకంగా 1000 కోట్ల గ్రాస్ ని బాక్సాఫీస్ ఖాతాలో జమ చేసింది. అన్ని వెర్షన్లు కలిపి ఈ రోజుతో మైలురాయిని అందుకుంది. దీనికన్నా ముందున్న అమీర్ ఖాన్ దంగల్ ని అతి త్వరలో ఓవర్ టేక్ చేయడం లాంఛనమే. మొదటి రెండు వారాలు విపరీతమైన దూకుడు చూపించిన బాద్షా వీలైనంత వసూళ్లు ఆ టైంలోనే పిండేశాడు. కొత్త రిలీజులు యాంట్ మ్యాన్ 3, షెహజాదా వల్ల డ్రాప్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ భయపడితే ఆబ్బె అదేం లేదంటూ వాటి నెగటివ్ టాక్ ని తనకనూలంగా మార్చుకున్నాడు.

సరే సహస్రం వచ్చాయి కానీ ఇంక వదిలేస్తారేమో అనుకుంటే యష్ రాజ్ ఫిలింస్ మాత్రం మెషీన్ లో జ్యూస్ కోసం చెరుకు గడలను వేసి పిప్పి చేసి చివరి బొట్టు వరకు పిండినట్టుగా పఠాన్ నుంచి రావాల్సిన చివరి రూపాయి దాకా వదలే ప్రస్తకే లేదంటున్నారు. అందులో భాగం మొన్న ఫ్రైడే ఒక్క రోజు ఐనాక్స్ పివిఆర్ సినీ పోలీస్ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర కేవలం 112 రూపాయలు పెడితే ప్లాన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు దాన్ని పొడిగిస్తూ తిరిగి సోమవారం నుంచి గురువారం దాకా మళ్ళీ 110 రూపాయిలకే చూడొచ్చని ప్రకటించారు.

ఈ ఎత్తుగడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో కానీ ఆల్రెడీ విపరీతమైన లాభాల్లోకి వెళ్లిపోయిన పఠాన్ ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదు. పైగా నార్త్ లో ఇది తప్ప ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. కాబట్టి సహజంగా మళ్ళీ దీన్నే చూడటమో, లేదా ఓటిటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు థియేటర్ వైపు లుక్ వేయడమో జరుగుతుంది. పెద్ద హీరోల సినిమాలకు ఇలా రెండు వారాల తర్వాత స్పెషల్ ఆఫర్లు ఇవ్వడం మంచి పని. మనదగ్గరా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలాంటి వాటికి ఇలా చేసి ఉంటే ఇంకొన్నాళ్ళు హౌస్ ఫుల్స్ పడేవి. తర్వాత వచ్చే వాటికైనా ఆలోచన చేయడం మంచిదే.

This post was last modified on February 20, 2023 11:39 pm

Share

Recent Posts

యాదాద్రి బోర్డు మెంబర్ గా చిరంజీవి భార్య, తీసేయాలంటున్న కవిత

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలిలో సీనియర్‌ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు కల్పించడంపై మాజీ ఎంపీ…

1 hour ago

ఏపీ లిక్కర్ స్కాం… ఈడీ తరువాత ఐటీ!

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలన రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ 3500…

2 hours ago

చిరంజీవి రెండు ట్రీట్లు ఇవ్వడం సాధ్యమేనా

ఏళ్లకేళ్లు ఎదురు చూస్తున్న విశ్వంభర అక్టోబర్ లో వచ్చే అవకాశాలు దాదాపు సున్నా. ఇది తెలిసే మైత్రి సంస్థ రణబాలిని…

2 hours ago

డ్రైవర్ నిద్రపోతే సీటు లేపుతుంది

అర్ధరాత్రి దాటింది.. రహదారిపై వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. కళ్లపై నిద్రమత్తు.. దృష్టి రహదారిపైనే ఉన్నా.. మెదడు మాత్రం నెమ్మదిగా స్పందించడం…

2 hours ago

జోగికి ఇది రాజకీయ సమాధిగా మారుతుందా?

మాజీ మంత్రి జోగి రమేష్ కు సన్ స్ట్రోక్ గట్టిగానే తగిలేలా వుంది. కొడుకు రాజీవ్ వివాహం విషయంలో ఏర్పడ్డ…

3 hours ago

పుష్ప 2 తర్వాత.. మైత్రికి మళ్లీ పెద్ద హిట్ ఇదేనా…

పుష్ప 2తో మైత్రి మూవీ మేకర్స్ 2024 చివర్లో భారీ సక్సెస్ అందుకుంది. ఆ సినిమా తర్వాత కూడా సంస్థ…

3 hours ago