Movie News

1000 కోట్లు వచ్చినా వదలమంటున్నారు

షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల సుదీర్ఘమైన గ్యాప్ కి న్యాయం చేస్తూ పఠాన్ సాధించిన బ్లాక్ బస్టర్ రన్ ఏకంగా 1000 కోట్ల గ్రాస్ ని బాక్సాఫీస్ ఖాతాలో జమ చేసింది. అన్ని వెర్షన్లు కలిపి ఈ రోజుతో మైలురాయిని అందుకుంది. దీనికన్నా ముందున్న అమీర్ ఖాన్ దంగల్ ని అతి త్వరలో ఓవర్ టేక్ చేయడం లాంఛనమే. మొదటి రెండు వారాలు విపరీతమైన దూకుడు చూపించిన బాద్షా వీలైనంత వసూళ్లు ఆ టైంలోనే పిండేశాడు. కొత్త రిలీజులు యాంట్ మ్యాన్ 3, షెహజాదా వల్ల డ్రాప్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ భయపడితే ఆబ్బె అదేం లేదంటూ వాటి నెగటివ్ టాక్ ని తనకనూలంగా మార్చుకున్నాడు.

సరే సహస్రం వచ్చాయి కానీ ఇంక వదిలేస్తారేమో అనుకుంటే యష్ రాజ్ ఫిలింస్ మాత్రం మెషీన్ లో జ్యూస్ కోసం చెరుకు గడలను వేసి పిప్పి చేసి చివరి బొట్టు వరకు పిండినట్టుగా పఠాన్ నుంచి రావాల్సిన చివరి రూపాయి దాకా వదలే ప్రస్తకే లేదంటున్నారు. అందులో భాగం మొన్న ఫ్రైడే ఒక్క రోజు ఐనాక్స్ పివిఆర్ సినీ పోలీస్ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర కేవలం 112 రూపాయలు పెడితే ప్లాన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు దాన్ని పొడిగిస్తూ తిరిగి సోమవారం నుంచి గురువారం దాకా మళ్ళీ 110 రూపాయిలకే చూడొచ్చని ప్రకటించారు.

ఈ ఎత్తుగడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో కానీ ఆల్రెడీ విపరీతమైన లాభాల్లోకి వెళ్లిపోయిన పఠాన్ ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదు. పైగా నార్త్ లో ఇది తప్ప ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. కాబట్టి సహజంగా మళ్ళీ దీన్నే చూడటమో, లేదా ఓటిటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు థియేటర్ వైపు లుక్ వేయడమో జరుగుతుంది. పెద్ద హీరోల సినిమాలకు ఇలా రెండు వారాల తర్వాత స్పెషల్ ఆఫర్లు ఇవ్వడం మంచి పని. మనదగ్గరా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలాంటి వాటికి ఇలా చేసి ఉంటే ఇంకొన్నాళ్ళు హౌస్ ఫుల్స్ పడేవి. తర్వాత వచ్చే వాటికైనా ఆలోచన చేయడం మంచిదే.

This post was last modified on February 20, 2023 11:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

6 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago