వీక్ డేస్ లో ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి నిర్మాతలకు కొత్త కొత్త కసరత్తులు తప్పడం లేదు. అందులోనూ ఫిబ్రవరి లాంటి డ్రై పీరియడ్ లో థియేటర్లకు జనం రావాలంటే ఆషామాషీ కంటెంట్ ఉంటే సరిపోదు. ఒకవేళ పర్వాలేదనే మాట బయటికి వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. మొన్న శుక్రవారం రిలీజైన వాటిలో ధనుష్ సార్ యునానిమస్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వినరో భాగ్యము విష్ణుకథ మాత్రం దాని స్థాయిలో టాక్ తెచ్చుకోలేక సోమవారం నుంచి భారీ డ్రాప్ నే చవిచూస్తోంది.
అందుకే గీత ఆర్ట్స్ 2 కొత్త ఎత్తుగడ తీసుకుంది. ఈ బుధ గురువారాల్లో వినరో భాగ్యము విష్ణుకథకు సింగల్ స్క్రీన్లలో ఒక టికెట్ కొంటె మరొకటి ఫ్రీ ఆఫర్ ని అమలు పరచబోతున్నారు. అంటే యావరేజ్ గా 110 నుంచి 150 రూపాయలకు ఇద్దరు చూసేయొచ్చు. ఈ లెక్కన బాల్కనీ ధర ఒకరికి కేవలం 75 రూపాయలలోపే పడుతుంది. ఇది నిజంగా తెలివైన స్ట్రాటజీ. ముఖ్యంగా స్నేహితులు లవర్స్ తో చూడాలనుకునే యూత్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. మొదటి వారం అయిదో రోజునే ఇలాంటి స్కీం పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం.
మాములుగా అయితే ఓ రెండు వారాల తర్వాత ఇలాంటి ట్రై చేస్తారు. ఇటీవలే బాలీవుడ్ మూవీ షెహజాదాకు ఫస్ట్ డేనే వన్ ప్లస్ వన్ పెడితే పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అల వైకుంఠపురములో రీమేక్ అక్కడి జనాలకు కనెక్ట్ కాలేదు. దీనికన్నా శాటిలైట్ ఛానల్ లో చూసిన అల్లు అర్జున్ డబ్బింగ్ వెర్షనే మెరుగ్గా అనిపించడంతో తిరస్కారం తప్పలేదు. ఒకవేళ ఇప్పుడీ కిరణ్ అబ్బవరం బొమ్మకు కనక ఈ ఆఫర్ వర్కౌట్ అయితే ఇతర ప్రొడ్యూసర్లు సైతం ఫాలో అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి సార్ లాంటి వాటికి అవసరం లేదు కానీ చిన్న నిర్మాతలు ఇలాంటివి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…