Movie News

నిర్మాత‌ల మండ‌లిలో దిల్ రాజు పాగా


తెలుగు నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు ఎన్న‌డూ లేనంత‌గా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి ఈసారి. అందుక్కార‌ణం.. మండ‌లి నుంచి వేరు ప‌డి.. ప్ర‌స్తుతం సినిమాలు తీస్తూ యాక్టివ్‌గా ఉన్న నిర్మాత‌ల‌తో క‌లిసి యాక్టివ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అని కొత్త సంస్థ ఏర్పాటు చేసుకుని కార్య‌క‌లాపాలు న‌డిపిస్తున్న దిల్ రాజు వర్గం.. సి.క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలోని ప్యానెల్ మీద పోటీకి దిగ‌డ‌మే.

నిర్మాత‌ల మండ‌లిలో ఎప్ప‌ట్నుంచో క‌ళ్యాణ్ వ‌ర్గానిదే ఆధిప‌త్యం కాగా.. ఈసారి రాజు వ‌ర్గం ఆయ‌న్ని స‌వాల్ చేసింది. క‌ళ్యాణ్ వ‌ర్గాన్ని ఢీకొట్టి గెల‌వ‌డం రాజు టీంకు అంత తేలిక కాద‌నే అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌య్యాయి ఎన్నిక‌ల ముందు. కానీ ఆదివారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాజు వ‌ర్గందే పైచేయి కావ‌డం విశేషం.

రాజు వ‌ర్గం నుంచి అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసిన దామోద‌ర్ ప్ర‌సాద్.. క‌ళ్యాణ్ వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచిన పి.కిర‌ణ్ మీద 14 ఓట్ల స్వ‌ల్ప తేడాతో విజ‌యం సాధించారు. ప్ర‌సాద్‌కు 339 ఓట్లు రాగా.. కిర‌ణ్ 315 ఓట్ల‌కు ప‌రిమితం అయ్యారు. దిల్ రాజు స్వ‌యంగా ఈసీ స‌భ్యుడిగా ఎన్నిక కాగా.. ఆయ‌న వ‌ర్గానికి చెందిన మ‌రో తొమ్మిది మంది ఈ ప‌ద‌వుల‌ను ద‌క్కించుకున్నారు. క‌ళ్యాణ్ వ‌ర్గం నుంచి అయిదుగురే ఈసీ స‌భ్యులు అయ్యారు.

ఇద్ద‌రు ఉపాధ్య‌క్షులు (భ‌ర‌త్ చౌద‌రి, న‌ట్టికుమార్) రాజు వ‌ర్గం నుంచే ఎన్నిక కాగా.. కార్య‌ద‌ర్శులు (వైవీఎస్ చౌద‌రి, ప్ర‌స‌న్న‌కుమార్) క‌ళ్యాణ్ వ‌ర్గం నుంచి అవ‌కాశం ద‌క్కించుకున్నారు. కోశాధికారిగా క‌ళ్యాణ్ వ‌ర్గానికి చెందిన రామ‌స‌త్య‌నారాయ‌ణ ఎన్నిక‌య్యారు. ఈసీ మెంబ‌ర్లుగా దిల్ రాజుతో పాటు దానయ్య, స్ర‌వంతి రవి కిషోర్, యలమంచిలి రవి, పద్మిని, బెక్కం వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, గోపీనాథ్ ఆచంట, మధుసూదన్ రెడ్డి, కేశవరావు, శ్రీనివాద్ వజ్జ, అభిషేక్ అగర్వాల్, కృష్ణ తోట, రామకృష్ణ గౌడ్, కిషోర్ పూసలు ఎన్నిక‌య్యారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

6 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

6 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

8 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

8 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

8 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

8 hours ago