Movie News

నిర్మాత‌ల మండ‌లిలో దిల్ రాజు పాగా


తెలుగు నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు ఎన్న‌డూ లేనంత‌గా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి ఈసారి. అందుక్కార‌ణం.. మండ‌లి నుంచి వేరు ప‌డి.. ప్ర‌స్తుతం సినిమాలు తీస్తూ యాక్టివ్‌గా ఉన్న నిర్మాత‌ల‌తో క‌లిసి యాక్టివ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అని కొత్త సంస్థ ఏర్పాటు చేసుకుని కార్య‌క‌లాపాలు న‌డిపిస్తున్న దిల్ రాజు వర్గం.. సి.క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలోని ప్యానెల్ మీద పోటీకి దిగ‌డ‌మే.

నిర్మాత‌ల మండ‌లిలో ఎప్ప‌ట్నుంచో క‌ళ్యాణ్ వ‌ర్గానిదే ఆధిప‌త్యం కాగా.. ఈసారి రాజు వ‌ర్గం ఆయ‌న్ని స‌వాల్ చేసింది. క‌ళ్యాణ్ వ‌ర్గాన్ని ఢీకొట్టి గెల‌వ‌డం రాజు టీంకు అంత తేలిక కాద‌నే అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌య్యాయి ఎన్నిక‌ల ముందు. కానీ ఆదివారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాజు వ‌ర్గందే పైచేయి కావ‌డం విశేషం.

రాజు వ‌ర్గం నుంచి అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసిన దామోద‌ర్ ప్ర‌సాద్.. క‌ళ్యాణ్ వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచిన పి.కిర‌ణ్ మీద 14 ఓట్ల స్వ‌ల్ప తేడాతో విజ‌యం సాధించారు. ప్ర‌సాద్‌కు 339 ఓట్లు రాగా.. కిర‌ణ్ 315 ఓట్ల‌కు ప‌రిమితం అయ్యారు. దిల్ రాజు స్వ‌యంగా ఈసీ స‌భ్యుడిగా ఎన్నిక కాగా.. ఆయ‌న వ‌ర్గానికి చెందిన మ‌రో తొమ్మిది మంది ఈ ప‌ద‌వుల‌ను ద‌క్కించుకున్నారు. క‌ళ్యాణ్ వ‌ర్గం నుంచి అయిదుగురే ఈసీ స‌భ్యులు అయ్యారు.

ఇద్ద‌రు ఉపాధ్య‌క్షులు (భ‌ర‌త్ చౌద‌రి, న‌ట్టికుమార్) రాజు వ‌ర్గం నుంచే ఎన్నిక కాగా.. కార్య‌ద‌ర్శులు (వైవీఎస్ చౌద‌రి, ప్ర‌స‌న్న‌కుమార్) క‌ళ్యాణ్ వ‌ర్గం నుంచి అవ‌కాశం ద‌క్కించుకున్నారు. కోశాధికారిగా క‌ళ్యాణ్ వ‌ర్గానికి చెందిన రామ‌స‌త్య‌నారాయ‌ణ ఎన్నిక‌య్యారు. ఈసీ మెంబ‌ర్లుగా దిల్ రాజుతో పాటు దానయ్య, స్ర‌వంతి రవి కిషోర్, యలమంచిలి రవి, పద్మిని, బెక్కం వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, గోపీనాథ్ ఆచంట, మధుసూదన్ రెడ్డి, కేశవరావు, శ్రీనివాద్ వజ్జ, అభిషేక్ అగర్వాల్, కృష్ణ తోట, రామకృష్ణ గౌడ్, కిషోర్ పూసలు ఎన్నిక‌య్యారు.

This post was last modified on February 20, 2023 6:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago