Movie News

నిర్మాత‌ల మండ‌లిలో దిల్ రాజు పాగా


తెలుగు నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు ఎన్న‌డూ లేనంత‌గా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి ఈసారి. అందుక్కార‌ణం.. మండ‌లి నుంచి వేరు ప‌డి.. ప్ర‌స్తుతం సినిమాలు తీస్తూ యాక్టివ్‌గా ఉన్న నిర్మాత‌ల‌తో క‌లిసి యాక్టివ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అని కొత్త సంస్థ ఏర్పాటు చేసుకుని కార్య‌క‌లాపాలు న‌డిపిస్తున్న దిల్ రాజు వర్గం.. సి.క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలోని ప్యానెల్ మీద పోటీకి దిగ‌డ‌మే.

నిర్మాత‌ల మండ‌లిలో ఎప్ప‌ట్నుంచో క‌ళ్యాణ్ వ‌ర్గానిదే ఆధిప‌త్యం కాగా.. ఈసారి రాజు వ‌ర్గం ఆయ‌న్ని స‌వాల్ చేసింది. క‌ళ్యాణ్ వ‌ర్గాన్ని ఢీకొట్టి గెల‌వ‌డం రాజు టీంకు అంత తేలిక కాద‌నే అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌య్యాయి ఎన్నిక‌ల ముందు. కానీ ఆదివారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాజు వ‌ర్గందే పైచేయి కావ‌డం విశేషం.

రాజు వ‌ర్గం నుంచి అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేసిన దామోద‌ర్ ప్ర‌సాద్.. క‌ళ్యాణ్ వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచిన పి.కిర‌ణ్ మీద 14 ఓట్ల స్వ‌ల్ప తేడాతో విజ‌యం సాధించారు. ప్ర‌సాద్‌కు 339 ఓట్లు రాగా.. కిర‌ణ్ 315 ఓట్ల‌కు ప‌రిమితం అయ్యారు. దిల్ రాజు స్వ‌యంగా ఈసీ స‌భ్యుడిగా ఎన్నిక కాగా.. ఆయ‌న వ‌ర్గానికి చెందిన మ‌రో తొమ్మిది మంది ఈ ప‌ద‌వుల‌ను ద‌క్కించుకున్నారు. క‌ళ్యాణ్ వ‌ర్గం నుంచి అయిదుగురే ఈసీ స‌భ్యులు అయ్యారు.

ఇద్ద‌రు ఉపాధ్య‌క్షులు (భ‌ర‌త్ చౌద‌రి, న‌ట్టికుమార్) రాజు వ‌ర్గం నుంచే ఎన్నిక కాగా.. కార్య‌ద‌ర్శులు (వైవీఎస్ చౌద‌రి, ప్ర‌స‌న్న‌కుమార్) క‌ళ్యాణ్ వ‌ర్గం నుంచి అవ‌కాశం ద‌క్కించుకున్నారు. కోశాధికారిగా క‌ళ్యాణ్ వ‌ర్గానికి చెందిన రామ‌స‌త్య‌నారాయ‌ణ ఎన్నిక‌య్యారు. ఈసీ మెంబ‌ర్లుగా దిల్ రాజుతో పాటు దానయ్య, స్ర‌వంతి రవి కిషోర్, యలమంచిలి రవి, పద్మిని, బెక్కం వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, గోపీనాథ్ ఆచంట, మధుసూదన్ రెడ్డి, కేశవరావు, శ్రీనివాద్ వజ్జ, అభిషేక్ అగర్వాల్, కృష్ణ తోట, రామకృష్ణ గౌడ్, కిషోర్ పూసలు ఎన్నిక‌య్యారు.

This post was last modified on February 20, 2023 6:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

48 minutes ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

2 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

2 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

4 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

4 hours ago

‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…

4 hours ago