ఒక పెద్ద సినిమా విడుదల తేదీని ప్రకటించినంత మాత్రాన ఖచ్చితంగా ఆ డేట్ కే కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ లేని పరిస్థితులు పరిశ్రమలో నెలకొన్నాయి. గత మూడు నాలుగేళ్లలో ఏ ఒక్క స్టార్ హీరో చిత్రం చెప్పిన టైంకి వచ్చిన దాఖలాలు లేవు.
తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు 28 ఆగస్ట్ పదకొండున రిలీజ్ అవుతుందని బుట్టబొమ్మ ప్రమోషన్ ఇంటర్వ్యూలలో నిర్మాత నాగ వంశీ చెప్పిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ దానికి బలంగా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది వాయిదా పడొచ్చని తెలిసింది.
చిరంజీవి భోళాశంకర్ ని ఏప్రిల్ రేస్ నుంచి తప్పించి దాని స్థానంలో అఖిల్ ఏజెంట్ ని తేవడం ఇటీవలే జరిగిన సరికొత్త డెవలప్ మెంట్. రెండింటి నిర్మాత ఒకరే కాబట్టి ఈ సౌలభ్యం కుదిరింది.
అయితే మెగా మూవీ ఎప్పుడనే ప్రశ్నకు సమాధానంగా ఆగస్ట్ 11 అనుకుంటున్నారట. అదేంటి అప్పుడు మహేష్ ఆల్రెడీ లాక్ చేసుకున్నాడుగా అంటే అప్పటికి షూటింగ్ అవ్వదనే మాట వినిపిస్తోంది. కేవలం అయిదు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ తో సహా మొత్తం పూర్తి చేయాలంటే హడావిడిగా పరుగులు పెట్టాల్సి ఉంటుంది. ఇది త్రివిక్రమ్ స్టైల్ కి విరుద్ధం.
అందుకే దాని బదులు అక్టోబర్ లో దసరా పండగను టార్గెట్ గా పెట్టుకుందామని సితార టీమ్ ప్రాధమికంగా ఫిక్స్ అయినట్టు తెలిసింది. అఫీషియల్ గా ఇంకా ఏదీ ఖరారు కాలేదు. ఇదంతా తెలిసే భోళా శంకర్ కి ఆ డేట్ కి వదిలే ప్రతిపాదనతో ఫ్రెష్ గా ముందుకొచ్చింది.
ఇండిపెండెన్స్ డేతో కలిపి పెద్ద వీకెండ్ ఆ వారంలో వచ్చే సినిమాలకు కలిసి వస్తుంది. అందుకే మహేష్ 28కి దాన్ని అందుకున్నారు. ప్రస్తుతం టర్కీలో ఉన్న మహేష్ తిరిగి రాగానే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతూ వచ్చిన ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ ఎప్పుడు వచ్చినా రికార్డుల ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు
This post was last modified on February 20, 2023 6:05 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…