ఒక పెద్ద సినిమా విడుదల తేదీని ప్రకటించినంత మాత్రాన ఖచ్చితంగా ఆ డేట్ కే కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ లేని పరిస్థితులు పరిశ్రమలో నెలకొన్నాయి. గత మూడు నాలుగేళ్లలో ఏ ఒక్క స్టార్ హీరో చిత్రం చెప్పిన టైంకి వచ్చిన దాఖలాలు లేవు.
తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు 28 ఆగస్ట్ పదకొండున రిలీజ్ అవుతుందని బుట్టబొమ్మ ప్రమోషన్ ఇంటర్వ్యూలలో నిర్మాత నాగ వంశీ చెప్పిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ దానికి బలంగా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది వాయిదా పడొచ్చని తెలిసింది.
చిరంజీవి భోళాశంకర్ ని ఏప్రిల్ రేస్ నుంచి తప్పించి దాని స్థానంలో అఖిల్ ఏజెంట్ ని తేవడం ఇటీవలే జరిగిన సరికొత్త డెవలప్ మెంట్. రెండింటి నిర్మాత ఒకరే కాబట్టి ఈ సౌలభ్యం కుదిరింది.
అయితే మెగా మూవీ ఎప్పుడనే ప్రశ్నకు సమాధానంగా ఆగస్ట్ 11 అనుకుంటున్నారట. అదేంటి అప్పుడు మహేష్ ఆల్రెడీ లాక్ చేసుకున్నాడుగా అంటే అప్పటికి షూటింగ్ అవ్వదనే మాట వినిపిస్తోంది. కేవలం అయిదు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ తో సహా మొత్తం పూర్తి చేయాలంటే హడావిడిగా పరుగులు పెట్టాల్సి ఉంటుంది. ఇది త్రివిక్రమ్ స్టైల్ కి విరుద్ధం.
అందుకే దాని బదులు అక్టోబర్ లో దసరా పండగను టార్గెట్ గా పెట్టుకుందామని సితార టీమ్ ప్రాధమికంగా ఫిక్స్ అయినట్టు తెలిసింది. అఫీషియల్ గా ఇంకా ఏదీ ఖరారు కాలేదు. ఇదంతా తెలిసే భోళా శంకర్ కి ఆ డేట్ కి వదిలే ప్రతిపాదనతో ఫ్రెష్ గా ముందుకొచ్చింది.
ఇండిపెండెన్స్ డేతో కలిపి పెద్ద వీకెండ్ ఆ వారంలో వచ్చే సినిమాలకు కలిసి వస్తుంది. అందుకే మహేష్ 28కి దాన్ని అందుకున్నారు. ప్రస్తుతం టర్కీలో ఉన్న మహేష్ తిరిగి రాగానే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతూ వచ్చిన ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ ఎప్పుడు వచ్చినా రికార్డుల ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు
This post was last modified on February 20, 2023 6:05 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…