వరస సినిమాలు చేస్తున్న ఆనందం తప్ప వాటి ఫలితాలను కనీస స్థాయిలో ఆస్వాదించలేకపోతున్న కుర్ర హీరో సంతోష్ శోభన్ కు మరో షాక్ తగిలింది. అనవసరమైన పోటీ మధ్య తగుదునమ్మా అంటూ అతని నిర్మాతలు తీసుకుంటున్న రిస్క్ కనీస ఓపెనింగ్స్ తేలేకపోతున్నాయి.
చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన శ్రీదేవి శోభన్ బాబు నిన్న రిలీజయ్యింది. ఒకపక్క సార్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇంకోవైపు వినరో భాగ్యము విష్ణుకథకు ప్రమోషన్లు జోరుగా ఉన్నాయి. వీటి మధ్యలో సంతోష్ వచ్చాడు.
కథగా చెప్పడానికి ఇందులో వీసమెత్తు కొత్తదనం లేదు. డైరెక్టర్ మీద నిన్నే పెళ్లాడతా, నువ్వే కావాలి లాంటి నిన్నటి తరం బ్లాక్ బస్టర్స్ ప్రభావం బలంగా ఉంది. క్లాసిక్స్ ని స్ఫూర్తిగా తీసుకోవడానికి బదులు వాటిలో నుంచే ఒక్కో పాయింట్ తీసుకుని ఈ లవ్ స్టోరీని కుట్టేశాడు.
ఓ అన్నయ్య(నాగబాబు) ఓ చెల్లెలు(రోహిణి)విడిపోతారు. వీళ్ళ పిల్లలకు పెళ్ళైతేనే ఆస్తి దక్కుతుందనే కండీషన్ తో తాత వీలునామా రాసి పోయుంటాడు. కానీ మన శ్రీదేవి(గౌరీ కిషన్) శోభన్ బాబు(సంతోష్ శోభన్)లకేమో ఒకళ్ళంటే మరొకరికి పడదు. దానికి అద్భుతమైన కారణం ఉంటుంది. తర్వాత జరిగేది ఈజీగా ఊహించుకోవచ్చు.
వైవిధ్యం మచ్చుకు కూడా కనిపించకుండా స్టోరీ రాసుకున్న ప్రశాంత్ కుమార్ దిమ్మల ఇప్పటికే కొన్ని వందలసార్లు వచ్చిన సీన్లను వాడేసి వాటినే తిరగమోత వేసుకుని ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. అక్కడక్కడా కామెడీతో పాటు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినప్పటికీ అవేవీ కనీస స్థాయిలో కాపాడలేకపోయాయి. మంచి క్యాస్టింగ్ ఉన్నా వృథా అయిపోయింది.
అవసరం లేని సీన్లు వస్తూనే ఉంటాయి. స్టోరీ ఎంత రొటీన్ గా ఉన్న రాతలో కొంతైనా ఫ్రెష్ నెస్ ఉంటేనే జనం చూస్తారు. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని పేరున్న సుస్మిత ఇంత బ్లైండ్ గా దీన్ని ఎలా ఓకే చేశారో మరి
This post was last modified on February 19, 2023 7:15 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…