ఇరవై మూడు రోజులు ఆసుపత్రిలో జబ్బుతో పోరాటం చేసి కన్నుమూసిన తారకరత్న భౌతికంగా లేకపోయినా తన జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెడితే ఇండస్ట్రీకి సంబంధించి అతను ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు.
అందులో ప్రధానమైంది డెబ్యూని అంగరంగవైభవంగా ఒకే రోజు 9 సినిమాలతో ప్రారంభోత్సవం జరుపుకోవడం. ఇది వరల్డ్ రికార్డు. ఇప్పటిదాకా ఏ భాషలో ఏ హీరో తన మొదటి లాంచ్ ఇంత గ్రాండ్ గా జరుపుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులోనూ ఇది సాధ్యం కాదు.
2002 సంవత్సరం. రామకృష్ణ స్టూడియోస్ ప్రాంగణం. మార్చి 22న పరిశ్రమ చాలా అరుదుగా చూసే కోలాహలం నెలకొంది. నందమూరి మోహనకృష్ణ తనయుడు తారకరత్నను తొమ్మిది సినిమాలతో పరిచయం చేయబోతున్నట్టు మీడియాలో ఇచ్చిన ప్రకటన సంచలనంగా మారింది.
ఆ చిత్రాల దర్శకులు యు నారాయణరావు, బాలసుబ్రమణ్యం, సురేష్ కృష్ణ, సాయికృష్ణ, రామచంద్రరావు, సత్యానంద్, సాగర్, వైవిఎస్ చౌదరిలు. ఉప్పలపాటి సూర్యనారాయణబాబు నిర్మాతగా సెట్ చేసిన ప్రాజెక్టుకి మాత్రమే ఆ రోజుకి డైరెక్టర్ డిసైడ్ కాలేదు. వీళ్లంతా ఓపెనింగ్ కి వచ్చారు.
ఊహించని ట్విస్టు ఏంటంటే మొదట రిలీజైన ఒకటో నెంబర్ కుర్రాడు మాత్రం పైన చెప్పిన లిస్టులో లేదు. ఇది తర్వాత ఓకే అయిపోయి శరవేగంగా నిర్మాణం జరుపుకుని ముందు విడుదలయ్యింది. కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా మరికొన్ని సెట్స్ పైకి వెళ్లకుండానే దర్శక నిర్మాతలు మారినవి ఉన్నాయి.
నందమూరి, నారా కుటుంబాలు ఆ రోజు జరిగిన వేడుకకు హాజరయ్యారు. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా వచ్చారు. బాలకృష్ణే స్వయంగా ఈ కాంబినేషన్లకు ప్రొడ్యూసర్లకు సంబంధించిన వ్యవహారాలు దగ్గరుండి చూసుకున్నారు.
This post was last modified on February 19, 2023 5:44 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…