సంక్రాంతి సినిమాల సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయింది. ఇది ప్రతి ఏడాదీ జరిగే విషయమే. పండుగ సినిమాలు రెండు వారాలు సందడి చేశాక ఒక రకమైన స్తబ్దత నెలకొని తర్వాత వచ్చే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడుతుంటాయి. ఈసారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. ఒక్క ‘రైటర్ పద్మభూషణ్’ అనే చిన్న సినిమా మినహాయించి గత నెల రోజుల్లో ఇంకే చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేదు.
చాలా సినిమాలు రిలీజైన సంగతి కూడా తెలియనట్లుగా వచ్చి వెళ్లిపోయాయి. ఇలాంటి టైంలో మహా శివరాత్రి పండుగ వీకెండ్ మీద ప్రేక్షకుల దృష్టి నిలిచింది. ఈ వారాంతంలో ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’తో పాటు గీతా ఆర్ట్స్ బేనర్లో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’.. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మాణంలో సంతోష్ శోభన్ హీరోగా చేసిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ రిలీజయ్యాయి.
ఐతే వీటిలో ‘శ్రీదేవి శోభన్ బాబు’ను ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ మిగతా రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ‘సార్’ ప్రేక్షకుల మనసు దోచినట్లే కనిపిస్తోంది. ‘తొలి ప్రేమ’ తర్వాత ఈ చిత్రంతో యువ దర్శకుడు వెంకీ అట్లూరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
హిందీ సినిమా ‘సూపర్ 30’ స్ఫూర్తితో అతను ఈ చిత్రాన్ని రూపొందించినట్లు కనిపిస్తోంది. ఐతే కథ మరీ కొత్తగా లేకపోయినా.. కథనంలో కూడా సర్ప్రైజులేమీ లేకపోయినా.. సిన్సియర్గా ఈ కథను చెప్పిన విధానం.. ఎమోషన్లను పండించిన తీరు.. అన్నింటికీ మించి ధనుష్ సూపర్ పెర్ఫామెన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఒక స్ట్రెయిట్ మూవీ తరహాలో ‘సార్’ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
రెండు రోజుల్లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందంటే సినిమా మంచి విజయం దిశగా వెళ్తోందని అర్థం చేసుకోవచ్చు. శుక్రవాం రిలీజైన ఈ చిత్రం ఆ రోజు సాయంత్రం నుంచి హౌస్ ఫుల్స్తో రన్ అయింది. ఇక శనివారం రిలీజైన ‘వినరో భాగ్యము విష్ణు కథ’కు టాక్ అంత గొప్పగా లేదు కానీ.. ఇది తీసిపడేయదగ్గ సినిమా అయితే కాదు. ఇందులో కొన్ని ఆకర్షణలు ఉన్నాయి. కొన్ని లూప్ హోల్స్ ఉన్నప్పటికీ.. ట్విస్టులు పేలడం, సినిమా బోర్ కొట్టించకపోవడంతో ప్రేక్షకులేమీ రిగ్రెట్ కావట్లేదు. ఈ చిత్రానికి తొలి రోజు ఈవెనింగ్, నైట్ షోలకు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. చూస్తుంటే ఇది కూడా సక్సెస్ ఫుల్ సినిమానే అయ్యేలా ఉంది. మొత్తానికి సంక్రాంతి తర్వాత థియేటర్లు మళ్లీ కళకళలాడుతుండడం టాలీవుడ్లో ఉత్సాహం నింపుతోంది.
This post was last modified on February 19, 2023 4:40 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…