Movie News

ప్ర‌భాస్ ఫ్యాన్స్ త‌ట్టుకోగ‌ల‌రా?


2013లో మిర్చి సినిమా రిలీజ‌య్యాక దాదాపు ప‌దేళ్ల వ్య‌వ‌ధిలో ప్ర‌భాస్ నుంచి రిలీజైన‌వి మూడు సినిమాలు మాత్ర‌మే. బాహుబ‌లి రెండు భాగాల‌ను క‌లిపి రెండు సినిమాలు అనుకున్నా.. అత‌ను చేసింది నాలుగు చిత్రాలే. బాహుబ‌లి లాంటి సినిమా కోసం ఎన్నేళ్లు ఎదురు చూసినా ఓకే కానీ.. సాహో, రాధేశ్యామ్ లాంటి డిజాస్ట‌ర్ల కోసం ఏళ్ల‌కు ఏళ్లు ఎదురు చూసి చివ‌రికి నిరాశ చెందారు ఫ్యాన్స్.

ఐతే ప్ర‌భాస్ ఈ రెండు చిత్రాల త‌ర్వాత స్పీడు పెంచాడు. చ‌క‌చ‌కా సినిమాలు కానిచ్చేస్తున్నాడు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి రిలీజ్ డేట్లు కూడా ఖ‌రారు చేసుకుంటున్నాయి. ప్ర‌స్తుతం అనౌన్స్ చేసిన ప్ర‌కారం అయితే కేవ‌లం ఏడు నెల‌ల వ్య‌వ‌ధిలో మూడు భారీ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు ప్ర‌భాస్. ఇన్నాళ్లూ అనావృష్టిలా సాగిన వ్య‌వ‌హారం ఇప్పుడు అతివృష్టి అయ్యేలా ఉంది.

సంక్రాంతికి రావాల్సిన ప్ర‌భాస్ కొత్త సినిమా ఆదిపురుష్ జూన్ 16కు వాయిదా ప‌డ్డ సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతానికి చిత్ర బృందం ఆ తేదీకే క‌ట్టుబ‌డి ఉంది. ఇక స‌లార్ మూవీని ఈ ఏడాది సెప్టెంబ‌రు 28కి షెడ్యూల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప్రాజెక్ట్ కే 2024 జ‌న‌వ‌రి 12కు షెడ్యూల్ అయింది. అంటే ఏడు నెల‌ల వ్య‌వ‌ధిలో ప్ర‌భాస్ సినిమాలు మూడు రిలీజ్ కాబోతున్నాయ‌న్న‌మాట‌.

ప్ర‌భాస్ లాంటి సూప‌ర్ స్టార్ నుంచి ఇంత త‌క్కువ గ్యాప్‌లో మూడు సినిమాలు రావ‌డం, అవి మూడూ భారీ చిత్రాలే కావ‌డం అసాధార‌ణ విష‌యం. అనుకున్న ప్ర‌కారం ఈ మూడు చిత్రాలూ ఆయా తేదీల్లో వ‌స్తే ప్ర‌భాస్ అభిమానులు అంత ఆనందాన్ని త‌ట్టుకోగ‌ల‌రా అన్న‌ది డౌట్. ప్ర‌భాస్ సినిమాల కోసం ఏళ్ల‌కు ఏళ్లు ఎదురు చూడ‌డ‌మే అల‌వాటైన వారికి ఇది అప‌రిమిత ఆనందాన్ని ఇచ్చే విష‌య‌మే. మ‌రి నిజంగా ప్ర‌భాస్ మాట నిల‌బెట్టుకుని ఏడు నెల‌ల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తాడేమో చూడాలి.

This post was last modified on February 18, 2023 11:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago