దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి ఇప్పుడు అనూహ్యంగా సోషల్ మీడియాలో ఒక వర్గం నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండేలా సినిమాలు తీస్తున్నాడని.. ఆ పార్టీ భావజాలాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని ఒక వర్గం ఆయనపై ఆరోపణలు గుప్పిస్తోంది. రాజమౌళి సినిమాల్లోని సన్నివేశాలను.. ఆయన వేషధారణను చూపిస్తూ విమర్శలు గుప్పిస్తోంది.
ఈ విమర్శలపై రాజమౌళి కూడా తాజాగా స్పందించాడు. తన సినిమాలకు, భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబందం లేదని.. తనకు అనిపించింది తాను తీశానని వివరిస్తూ.. నిజంగా తనకు ఆ పార్టీతో సంబందం ఉందో లేదో జనాలు నిర్ణయించుకుంటారని వ్యాఖ్యానించాడు. అలా ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు జక్కన్న.
ఐతే ఇప్పుడు ఈ టాపిక్లోకి వివాదాస్పద నటి కంగనా రనౌత్ వచ్చింది. రాజమౌళి చేసిన తప్పేంటి.. ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక మూవీ తీసి ప్రపంచ స్థాయిలో భారతీయ జెండా ఎగరేయడమా.. మన సంప్రదాయ వస్త్రధారణతో ప్రపంచ వేదికలపై మాట్లాడడమా అంటూ కంగనా దీర్ఘాలు తీస్తూ ఆయన్ని ట్రోల్ చేస్తున్న వారి మీద విరుకుపడింది. కంగనా కొన్నేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ జపం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఒక దశ దాటాక మరీ శ్రుతి మించి భాజపా జపం చేయడం.. ఆ పార్టీ వ్యతిరేకులను టార్గెట్ చేయడం కంగనాకే కాదు.. బీజేపీకి కూడా చేటు చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాజమౌళి విషయంలో ఆమెది అనవసర జోక్యం లాగే కనిపిస్తోంది. ఆమె బీజేపీని అతిగా ఓన్ చేసుకుని చేసిన అతి వల్ల తమకు చేటే జరుగుతోందని బీజేపీ నెమ్మదిగా తనకు దూరం జరుగుతోంది. ఇలాంటి టైంలో రాజమౌళిని వెనకేసుకురావడం వల్ల ఆయనకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. భాజపాతో ఆయనకు మరింతగా సంబంధం అంటగట్టి ఇబ్బందుల పాలు చేయడం తప్ప కంగనా ఇచ్చే మద్దతు వల్ల ఏం ప్రయోజనం లేదన్నది స్పష్టం.
This post was last modified on February 18, 2023 11:04 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…