దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి ఇప్పుడు అనూహ్యంగా సోషల్ మీడియాలో ఒక వర్గం నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండేలా సినిమాలు తీస్తున్నాడని.. ఆ పార్టీ భావజాలాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని ఒక వర్గం ఆయనపై ఆరోపణలు గుప్పిస్తోంది. రాజమౌళి సినిమాల్లోని సన్నివేశాలను.. ఆయన వేషధారణను చూపిస్తూ విమర్శలు గుప్పిస్తోంది.
ఈ విమర్శలపై రాజమౌళి కూడా తాజాగా స్పందించాడు. తన సినిమాలకు, భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబందం లేదని.. తనకు అనిపించింది తాను తీశానని వివరిస్తూ.. నిజంగా తనకు ఆ పార్టీతో సంబందం ఉందో లేదో జనాలు నిర్ణయించుకుంటారని వ్యాఖ్యానించాడు. అలా ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు జక్కన్న.
ఐతే ఇప్పుడు ఈ టాపిక్లోకి వివాదాస్పద నటి కంగనా రనౌత్ వచ్చింది. రాజమౌళి చేసిన తప్పేంటి.. ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక మూవీ తీసి ప్రపంచ స్థాయిలో భారతీయ జెండా ఎగరేయడమా.. మన సంప్రదాయ వస్త్రధారణతో ప్రపంచ వేదికలపై మాట్లాడడమా అంటూ కంగనా దీర్ఘాలు తీస్తూ ఆయన్ని ట్రోల్ చేస్తున్న వారి మీద విరుకుపడింది. కంగనా కొన్నేళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ జపం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఒక దశ దాటాక మరీ శ్రుతి మించి భాజపా జపం చేయడం.. ఆ పార్టీ వ్యతిరేకులను టార్గెట్ చేయడం కంగనాకే కాదు.. బీజేపీకి కూడా చేటు చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాజమౌళి విషయంలో ఆమెది అనవసర జోక్యం లాగే కనిపిస్తోంది. ఆమె బీజేపీని అతిగా ఓన్ చేసుకుని చేసిన అతి వల్ల తమకు చేటే జరుగుతోందని బీజేపీ నెమ్మదిగా తనకు దూరం జరుగుతోంది. ఇలాంటి టైంలో రాజమౌళిని వెనకేసుకురావడం వల్ల ఆయనకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. భాజపాతో ఆయనకు మరింతగా సంబంధం అంటగట్టి ఇబ్బందుల పాలు చేయడం తప్ప కంగనా ఇచ్చే మద్దతు వల్ల ఏం ప్రయోజనం లేదన్నది స్పష్టం.
This post was last modified on February 18, 2023 11:04 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…