వేరే భాషల హీరోలు తమ చిత్రాల ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చినపుడల్లా.. తెలుగు ప్రేక్షకులను కొనియాడుతుంటారు. వాళ్లకు భాషా భేదం ఉండదని.. సినిమా బాగుంటే ఎవరిదైనా చూస్తారని.. గొప్పగా ఆదరిస్తారని అంటుంటారు. వాళ్లు మాట వరసుకు అంటారో, మనస్ఫూర్తిగా అంటారో తెలియదు కానీ.. ఆ మాటలు మాత్రం అక్షరాలా నిజం. దేశంలో తెలుగు ప్రేక్షకులకు ఉన్నంత విశాల హృదయం ఇంకెవరికీ ఉండదంటే అతిశయోక్తి కాదు. సినిమాను అమితంగా ప్రేమించే మన ప్రేక్షకులు ఏ భాష నుంచి మంచి సినిమా వచ్చినా నెత్తిన పెట్టుకుంటారు.
‘కాంతార’ సినిమా ఇతర భాషల్లోనూ బాగా ఆడింది కానీ.. తెలుగులో ఆ చిత్రం ఏకంగా 50 కోట్ల వసూళ్లు సాధించడం అనూహ్యం. మనవాళ్లకు నచ్చితే ఏ భాషా చిత్రాన్నయినా ఎలా ఆదరిస్తారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
తాజాగా ధనుష్ ‘సార్’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టాడు. ధనుష్ స్థాయిలో ఉన్న టాలీవుడ్ హీరో సినిమా ఏదైనా తమిళంలో రిలీజైతే ఏమాత్రం పట్టించుకుంటారు అన్నది సందేహమే. కానీ మన వాళ్లకు అలాంటి భేదం ఏమీ ఉండదు. ధనుష్కు ఇక్కడ పెద్ద ఫాలోయింగ్ ఏమీ లేకపోయినా.. మన దర్శకుడితో, మన నిర్మాత తీసిన సినిమా కావడంతో ‘సార్’ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.
ధనుష్ చిత్రానికి తెలుగులో ముందు రోజే ప్రిమియర్స్ పడడం.. అవన్నీ హౌస్ ఫుల్స్ కావడం అనూహ్యం. ఇక రిలీజ్ రోజు కూడా సినిమాకు మంచి టాక్ వచ్చింది తెలుగులో. తమిళ హీరో సినిమా అని ఎవ్వరూ దాన్ని తక్కువ చేయడానికి చూడలేదు. సోషల్ మీడియాలో కూడా అందరూ పాజిటివ్గానే మాట్లాడారు. తొలి రోజు ‘సార్’కు తెలుగులో 5 కోట్ల దాకా వసూళ్లు రావడం విశేషం. పాజిటివ్ టాక్తో సినిమా మంచి రేంజికే వెళ్లేలా కనిపిస్తోంది. ఈ స్పందన చూసి తెలుగు ప్రేక్షకులు సూపర్ అని ధనుష్ సహా కోలీవుడ్ జనాలందరూ అనుకుంటారనడంలో సందేహం లేదు.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…