Movie News

బాంబు పేల్చిన అల్లు అరవింద్

కరోనా మహమ్మారి ధాటికి కుదేలవుతున్న రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. దీని కారణంగా ఎన్ని వందలు, వేల కోట్ల నష్టం ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. లాక్ డౌన్ మొదలైన కొత్తలో నెలా రెండు నెలల్లో అంతా మామూలైపోతుందని అనుకున్నారు సినీ జనాలు.

ఏప్రిల్ లేదా మే నెలలో సినిమాలు రిలీజ్ చేసుకుందామని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఇంకో మూడు నెలలకు కూడా థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే రాజమౌళి కరోనా ప్రభావం ఎలా ఉంటుందనే విషయమై భయం గొలిపేలా హెచ్చరికలు జారీ చేశాడు.

ఇప్పుడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ లైన్లోకి వచ్చారు. ఆయన రాజమౌళిని మించి ప్రమాద హెచ్చరికలు జారీ చేశాడు. దసరాకు మామూలు పరిస్థితులు వచ్చేస్తాయి.. పెద్ద సినిమాల సందడి మొదలవుతుంది అనుకుంటే.. అలాంటి ఆశలేం పెట్టుకోవాల్సిన పని లేదని అరవింద్ తేల్చేశారు.

డిసెంబరు-జనవరి నాటికి కానీ థియేటర్లు తెరుచుకోకపోవచ్చని అరవింద్ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ ఎత్తేసినా, కరోనాకు మందు వచ్చినా కూడా.. అందరూ ధైర్యం చేసి గుంపులుగా కలవడానికి ఆర్నెల్ల పైనే పడుతుందని అరవింద్ అన్నారు.

థియేటర్లు, షాపింగ్ మాల్స్ లాంటి ప్రదేశాలు ప్రమాదకరం అనే అభిప్రాయం జనాల్లో మనసుల్లో ఉండిపోతుందని.. అన్నింటికంటే చివరగా థియేటర్లు ప్రారంభం అవుతాయని.. సాధారణ పరిస్థితులు రావడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుందని అరవింద్ అంచనా వేశారు.

చిన్న సినిమాలకు గడ్డు కాలం తప్పదని.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సినిమాలకు అయినంత ఖర్చును ఇచ్చి కొనుగోలు చేయవని.. అలాగని థియేటర్లలో రిలీజ్ చేసే సమయం వరకు ఎదురు చూస్తే వడ్డీలు సినిమాను తినేస్తాయని.. ఈ వడ్డీల్ని తట్టుకుని నిలబడే సినిమాలు మాత్రమే నెట్టుకొస్తాయని చెెప్పడం ద్వారా చిన్న, మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి దయనీయంగా ఉండబోతోందని అరవింద్ చెప్పకనే చెప్పారు.

This post was last modified on April 23, 2020 9:32 am

Share

Recent Posts

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

28 minutes ago

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…

48 minutes ago

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

1 hour ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

3 hours ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

3 hours ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

4 hours ago