సంక్రాంతికి సందడి చేసిన బ్లాక్ బస్టర్లు నేరుగా ఓటిటి ద్వారా ఇళ్లకు వచ్చేస్తున్నాయి. భారీ అంచనాలతో వందల కోట్లు కొల్లగొట్టి కదలకుండా కూర్చున్న చోటే కాలక్షేపం చేయించడానికి ప్రీమియర్లు రెడీ అవుతున్నాయి.
ఇప్పటికే తెగింపు, కళ్యాణం కమనీయం స్ట్రీమింగ్ జరిగిపోగా అసలైనవి మాత్రం ఫిబ్రవరి చివరి వారంలో కనువిందు చేయబోతున్నాయి. విజయ్ వారసుడు అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. తెలుగు వెర్షన్ పెద్దగా జనానికి రీచ్ కాలేకపోవడంతో మన దగ్గర వ్యూస్ భారీగా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.
కేవలం ఒక్క రోజు గ్యాప్ తో 23 సాయంత్రం నుంచి వీరసింహారెడ్డి డిస్నీ హాట్ స్టార్ లో వచ్చేస్తుంది. బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ ఫ్యాక్షన్ డ్రామా కొన్ని సెంటర్లు మినహా ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది.
అఖండకు వచ్చిన రెస్పాన్స్ దెబ్బకు ఎంత పోటీ ఉన్నా సరే రిలీజ్ కు ముందే క్రేజీ ఆఫర్ తో దీని హక్కులు సొంతం చేసుకున్నారు. పండగ విన్నర్ గా నిలిచిన వాల్తేరు వీరయ్య 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఉంటుంది. చిరంజీవి సినిమాలను వరసబెట్టి కొంటున్న ఈ ఓటిటి దీంతో పాటు అంతకు ముందు గాడ్ ఫాదర్, తర్వాత భోళా శంకర్ హక్కులను కూడా కొనేసుకుంది.
ఇవి కాకుండా సుడిగాలి సుధీర్ గాలోడు, బిగ్ బాస్ సోహైల్ లక్కీ లక్ష్మణ్ లాంటివి ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. అటుఇటుగా యాభై రోజులు పూర్తి కాకముందే పెద్ద సినిమాలన్నీ ఓటిటిల వచ్చేస్తున్నాయి. ఆ మధ్య ఎనిమిది వారాల కండీషన్ ని తమకు తాము విధించుకున్న నిర్మాతల మండలి క్షేత్ర స్థాయిలో దాన్ని ఎంత మాత్రం పాటించడం లేదు. ఇండస్ట్రీ రికార్డులు సాధించినవి సైతం 45 రోజులకే పరిమితమైతే ఇక మీడియం ప్రొడ్యూసర్లు ఎక్కడ మాట వింటారు. వీటికి తోడు టైటిల్ కార్డుకు ముందే స్ట్రీమింగ్ పార్ట్ నర్ లోగో వేయకూడదన్న నిబంధనకు సైతం మంగళం పాడేశారు.
This post was last modified on February 18, 2023 10:49 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…