ఎన్నిసార్లు మొత్తుకున్నా రిలీజుల విషయంలో టాలీవుడ్ నిర్మాతల పోటీ ధోరణి మాత్రం మారడం లేదు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. ఈ ఫ్రైడే సార్, వినరో భాగ్యము విష్ణు కథలతో మూవీ లవర్స్ కి మంచి ఆప్షన్లు ఉండగా రాబోయే మూడు వారాల్లో మాత్రం చెప్పుకోదగ్గ విడుదల ఏదీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫిబ్రవరి 24 నోటెడ్ రిలీజులంటూ పెద్దగా లేవు. ప్రమోషన్ల పరంగా మిస్టర్ కింగ్ ఒక్కటే కొంత ఆసక్తిని రేపుతోంది కానీ క్యాస్టింగ్ వల్ల దాని మీద ఆడియన్స్ దృష్టి ఎంతమేరకు ఉంటుందో చెప్పలేం.
మార్చి 3న దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన బలగం కంటెంట్ ని నమ్ముకుని వస్తోంది. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమవుతున్న సీరియస్ మూవీ ఉంది. ఎస్వి కృష్ణారెడ్డి చాలా కాలం తర్వాత దర్శకత్వం వహించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు కూడా అదే రోజే. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించగా బిగ్ బాస్ సోహైల్ హీరో. మార్చి 10న ఆది సాయికుమార్ సిఎస్ఐ సనాతన్ అనే క్రైమ్ థ్రిల్లర్ ని దింపుతున్నారు. మెన్ టూ అనే మరో కామెడీ మూవీ కూడా ఉంది. అంతో ఇంతో బజ్ ఉన్నవాటి గురించే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.
మళ్ళీ మార్చి 17న ఉపేంద్ర కిచ్చ సుదీప్ ల కబ్జా, నాగ శౌర్యల ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిలో సందడి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇలా షెడ్యూల్ అయ్యాయి కానీ పైన చెప్పినవాటిలో చివరి నిమిషం వరకు ఏమైనా అనూహ్య మార్పులు ఉన్నా ఆశ్చర్యం లేదు. వినరో భాగ్యము లాంటివి ఒక వారం ఆగి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కాని శివరాత్రి పండగతో పాటు వీకెండ్ ని లక్ష్యంగా పెట్టుకోవడంతో దీనికన్నా బెటర్ ఆప్షన్ కనిపించి ఉండకపోవచ్చు. మొత్తానికి మూడు శుక్రవారాలు బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేసేలా లేవు. ఏవైనా అనూహ్యంగా విజయం సాధించి జోష్ తేవాల్సిందే.
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…