ఎన్నిసార్లు మొత్తుకున్నా రిలీజుల విషయంలో టాలీవుడ్ నిర్మాతల పోటీ ధోరణి మాత్రం మారడం లేదు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. ఈ ఫ్రైడే సార్, వినరో భాగ్యము విష్ణు కథలతో మూవీ లవర్స్ కి మంచి ఆప్షన్లు ఉండగా రాబోయే మూడు వారాల్లో మాత్రం చెప్పుకోదగ్గ విడుదల ఏదీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫిబ్రవరి 24 నోటెడ్ రిలీజులంటూ పెద్దగా లేవు. ప్రమోషన్ల పరంగా మిస్టర్ కింగ్ ఒక్కటే కొంత ఆసక్తిని రేపుతోంది కానీ క్యాస్టింగ్ వల్ల దాని మీద ఆడియన్స్ దృష్టి ఎంతమేరకు ఉంటుందో చెప్పలేం.
మార్చి 3న దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన బలగం కంటెంట్ ని నమ్ముకుని వస్తోంది. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమవుతున్న సీరియస్ మూవీ ఉంది. ఎస్వి కృష్ణారెడ్డి చాలా కాలం తర్వాత దర్శకత్వం వహించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు కూడా అదే రోజే. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించగా బిగ్ బాస్ సోహైల్ హీరో. మార్చి 10న ఆది సాయికుమార్ సిఎస్ఐ సనాతన్ అనే క్రైమ్ థ్రిల్లర్ ని దింపుతున్నారు. మెన్ టూ అనే మరో కామెడీ మూవీ కూడా ఉంది. అంతో ఇంతో బజ్ ఉన్నవాటి గురించే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.
మళ్ళీ మార్చి 17న ఉపేంద్ర కిచ్చ సుదీప్ ల కబ్జా, నాగ శౌర్యల ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిలో సందడి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇలా షెడ్యూల్ అయ్యాయి కానీ పైన చెప్పినవాటిలో చివరి నిమిషం వరకు ఏమైనా అనూహ్య మార్పులు ఉన్నా ఆశ్చర్యం లేదు. వినరో భాగ్యము లాంటివి ఒక వారం ఆగి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కాని శివరాత్రి పండగతో పాటు వీకెండ్ ని లక్ష్యంగా పెట్టుకోవడంతో దీనికన్నా బెటర్ ఆప్షన్ కనిపించి ఉండకపోవచ్చు. మొత్తానికి మూడు శుక్రవారాలు బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేసేలా లేవు. ఏవైనా అనూహ్యంగా విజయం సాధించి జోష్ తేవాల్సిందే.
This post was last modified on February 17, 2023 11:39 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…