కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ లాగే తెలుగు దర్శకుడైన వెంకీ అట్లూరితో తమిళ, తెలుగు భాషల్లో సినిమా చేశాడు ధనుష్. అదే.. సార్. ఈ సినిమాకు కొన్ని రోజుల ముందు వరకు పెద్దగా బజ్ కనిపించలేదు. అసలు ఈ చిత్రం ఫిబ్రవరి 17న రిలీజవుతుందా లేదా అనే సందేహాలు రేకెత్తించేలా ప్రమోషన్లను అస్సలు పట్టించుకోలేదు చిత్ర బృందం. కానీ రిలీజ్ దగ్గరికొచ్చేసరికి పరిస్థితి మారింది. అగ్రెసివ్ ప్రమోషన్లు సినిమాకు కలిసొచ్చాయి.
సినిమా మీద ధీమాతో ముందు రోజు ప్రిమియర్ షోలు కూడా ప్లాన్ చేశారు. ముందు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో రెండు షోలు ఓపెన్ చేశారు. అవి చకచకా ఫిల్ అయిపోయి సోల్డ్ ఔట్ బోర్డులు పడిపోయాయి. సినిమా మీద జనాలకు మంచి అంచనాలే ఉన్నట్లున్నాయే అని.. సిటీలో మరిన్ని మల్టీప్లెక్సుల్లో షోలు ఒక్కొక్కటిగా మొదలుపెట్టారు. ఇలా పెట్టిన షోలు పెట్టినట్లే ఫిల్ అయిపోయాయి.
ఇంకా వైజాగ్, విజయవాడ లాంటి పలు నగరాల్లో ప్రిమియర్ షోలకు బుకింగ్స్ ఓపెన్ చేయడం.. అవి చకచకా ఫిల్ అయిపోవడం.. ఇదీ వరస. మొత్తంగా తెలుగులో ధనుష్ సినిమాకు పదుల సంఖ్యలో రిలీజ్ ముందు రోజే ప్రిమియర్ షోలు పడుతున్నాయి. అవన్నీ కూడా దాదాపుగా హౌస్ ఫుల్స్తో నడుస్తున్నాయి.
రజినీ, కమల్, సూర్య, కార్తి లాంటి హీరోలతో పోలిస్తే ధనుష్కు తెలుగులో ఫాలోయింగ్ తక్కువే. అతనిక్కడ స్టార్ ఏమీ కాదు. అలాంటి హీరో సినిమాకు ఇన్ని ప్రిమియర్ షోలు పడడం.. అవన్నీ హౌస్ ఫుల్ కావడం విశేషమే. ఈ షోలకు పాజిటివ్ టాక్ వస్తే.. తొలి రోజు కూడా సినిమా మంచి ఆక్యుపెన్సీలతో నడిచే ఛాన్సుంది. ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయి. తెలుగులో డెబ్యూ మూవీతోనే ధనుష్ మంచి హిట్ అందుకునే అవకాశాలున్నాయి. చూద్దాం మరి టాక్ ఎలా ఉంటుందో?
This post was last modified on February 17, 2023 10:12 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…