రేపు విడుదల కాబోతున్న సార్ మీద నిన్నా మొన్నటి దాకా అంచనాలు పెద్దగా లేవు కానీ టీమ్ చేస్తున్న తెలివైన ప్లానింగ్ వల్ల మెల్లగా బజ్ పెరుగుతోంది. రిలీజ్ కు ముందు రోజు సాయంత్రం స్పెషల్ ప్రీమియర్లను కేవలం మీడియాకి కాకుండా కామన్ పబ్లిక్ కు వేయాలని నిర్ణయం తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తోంది. ముందు హైదరాబాద్ ఒకటే చాలనుకున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఇవాళ సాయంత్రం మూడు షోలు పెడితే ఇంకో రోజు మిగిలి ఉండగానే ఫుల్ అయిపోయాయి. టైం చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఇంకొన్ని జోడించే ప్రయత్నాలు ఆఘమేఘాల మీద జరుగుతున్నాయి.
దీంతో స్ట్రాటజీ మార్చేసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్లో సార్ స్పెషల్ షోలను వేయబోతున్నారు. విజయవాడ, వైజాగ్, నెల్లూరు, కాకినాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఆన్ లైన్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. రిలీజ్ కు ముందే అందరికంటే ఫస్ట్ సినిమా చూడాలన్న ఎగ్ జైట్మెంట్ ఈ రెస్పాన్స్ కు కారణమవుతోంది. విచిత్రంగా తమిళంలో వాతి టైటిల్ తో వస్తున్న సార్ కి అక్కడ ఈ స్థాయిలో హైప్ పెరగడం లేదు. ధనుష్ స్వతహాగా స్టార్ హీరోనే అయినప్పటికీ దర్శకుడు తెలుగు వాడు కావడంతో కోలీవుడ్ ట్రేడ్ కొంత అనుమానంగానే ఉంది.
అనుదీప్ ప్రిన్స్, వంశీ పైడిపల్లి వారసుడు ఆశించిన స్థాయిలో కంటెంట్ లేకపోవడంతో వాతి మీద డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా స్టార్ గెస్టులు లేకుండా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయ్యింది. జనానికి ఇదో సినిమా వస్తోందన్న సంగతి ప్రమోషన్ల ద్వారా రిజిస్టర్ అయిపోయింది. పోటీలో ఉన్న వినరో భాగ్యము విష్ణు కథ ఇప్పుడు కొంత వెనుకబడినట్టు కనిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా ఫైనల్ గా కంటెంటే మాట్లాడాలి కాబట్టి ఇంకో నలభై ఎనిమిది గంటల్లో మొత్తం ఎవరు విజేతో తేలిపోతుంది. ధనుష్ మొదటిసారి చేసిన టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ ఇది.
This post was last modified on February 16, 2023 10:05 pm
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…