Movie News

జక్కన్నతో చేయడానికి ముందు జక్కన్నే టార్గెట్


టాలీవుడ్లో స్టార్ హీరోలను మించిన ఇమేజ్ రాజమౌళిది. ఇప్పుడు టాలీవుడ్లోనే కాక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రాజమౌళి రికార్డులంటూ ప్రత్యేకమైన కేటగిరీ ఏర్పాటైంది. దాని గురించి స్టార్ హీరోలు కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. రాజమౌళి సినిమాల కలెక్షన్లను అందుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. ‘బాహుబలి’ సినిమా వరకు ‘నాన్ బాహుబలి’ అనే రికార్డులుండేవి కానీ.. జక్కన్న తర్వాతి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ‘నాన్-ఎస్ఎస్ఆర్’ అనే కొత్త కేటగిరీ వచ్చింది. ఇప్పుడు ఇదే లక్ష్యంగా స్టార్ హీరోలు అడుగులు వేస్తున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న కొత్త సినిమాకు కూడా ఇదే లక్ష్యం అంటున్నాడు దాని నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాగవంశీ.

“త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో మహేష్ గారు చేస్తున్న సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గదు. ఈ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నామంటే.. విడుదలైన ప్రతి చోటా ఇది సూపర్ హిట్ అవుతుంది. రాజమౌళి గారి సినిమాల నంబర్లకు దగ్గరగా వెళ్తుంది. మేం ‘అల వైకుంఠపురములో’ సినిమా టైంలోనూ రాజమౌళి గారి సినిమాల నంబర్లకు దగ్గరగా వెళ్లాం. మహేష్-త్రివిక్రమ్ సినిమా కూడా మా అంచనాలను అందుకుంటుందని ఆశిస్తున్నాం” అని నాగవంశీ తెలిపాడు.

మహేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అతడు’ టాలీవుడ్ ఆల్ టైం గ్రేట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రెండో చిత్రం ‘ఖలేజా’ ఫ్లాప్ అయినా.. ఇప్పటికీ టీవీల్లో, యూట్యూబ్‌లో ప్రేక్షకులను అలరిస్తోంది. వీళ్లిద్దరూ సుదీర్ఘ విరామం తర్వాత కలిసి సినిమా చేస్తుండడంతో దానిపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజమౌళి సినిమా చేయడానికి ముందే మహేష్ సినిమా ఆయన చిత్రాల నంబర్ల దగ్గరగా వెళ్లే.. ఇక జక్కన్నతోనే జట్టు కడితే దానికి ఆకాశమే హద్దు అన్నమాట.

This post was last modified on February 15, 2023 11:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

24 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

1 hour ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago