గత ఏడాది బింబిసార బ్లాక్ బస్టర్ అయిన ఆనందం కళ్యాణ్ రామ్ కు అమిగోస్ రూపంలో ఆవిరైపోయింది. మొదటిసారి మూడు పాత్రలు అందులోనూ ఒకటి విలన్ గా చేసినప్పటికీ ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదు. మైత్రి పైకేమో హ్యాట్రిక్ కొట్టామని చెబుతున్నారు వాస్తవికంగా వసూళ్ల కోణంలో చూస్తే మాత్రం ఇది డిజాస్టర్ వైపే పరుగులు పెడుతోంది. సోమవారం నుంచి కలెక్షన్లు మరీ తీసికట్టుగా పడిపోయాయి. వీకెండ్ వరకు అయిదు కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ యాక్షన్ మూవీ ఇంకా ఏడు కోట్లకు పైగానే రాబట్టాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యంలానే కనిపిస్తోంది.
ఒకరకంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ కు ఎంత ప్రయోగాల మీద మక్కువ ఉన్నా తనను చేరువ చేసేది మాస్ ప్రేక్షకులేనని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే అమిగోస్ అనే ఇంగ్లీష్ టైటిల్ జనంలోకి వెళ్లలేకపోయింది. దానికి తోడు కథ మొత్తం విలన్ కోణంలోనే సాగడంతో సాధారణ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఏదో జై లవకుశని ఇంకో వెర్షన్ లో ట్రై చేసినట్టు ఉంది తప్ప నిజానికి ట్రిపుల్ యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకరు విలన్ గా ఉండాలన్న రూల్ ఏమి లేదు. ఆ మాటకొస్తే ముగ్గురు మొనగాళ్లు, అధినాయకుడు లాంటి వాటిలో అన్నీ పాజిటివ్ పాత్రలే ఉంటాయి.
కళ్యాణ్ రామ్ తర్వాతి సినిమా డెవిల్. ఇది కూడా ఇంగ్లీష్ పేరే. స్వతంత్ర పోరాట నేపథ్యంలో గూఢచారిగా పని చేసిన ఓ సాహసవంతుడి కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి కొత్తగా అనిపించే అవకాశం లేకపోలేదు. అయితే ఒక హిట్టు పడటం ఆలస్యం ఒకటి రెండు ఫ్లాపులు పలకరించడం కళ్యాణ్ రామ్ కో సెంటిమెంట్ గా మారిపోయింది. అమిగోస్ అది మళ్ళీ నిరూపించింది. సో డెవిల్ హిట్ కావడం అవసరం. కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ రాబోయే సమ్మర్ లేదా దసరా విడుదల లక్ష్యంగా షూటింగ్ చేస్తున్నారు.
This post was last modified on February 14, 2023 12:17 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…