బాలీవుడ్లో చాలా కొద్ది మంది టాప్ స్టార్లు మినహాయిస్తే అందరూ హీరోలూ వెబ్ సిరీస్లు చేస్తున్న వాళ్లే. కానీ దక్షిణాదిన ఇంకా స్టార్ హీరోలు అటు వైపు చూడట్లేదు. తెలుగులో ఈ దిశగా ముందడుగు వేస్తున్నది సీనియర్ హీరో విక్టరీ వెంకటేషే. తన అన్న కొడుకు రానాతో కలిసి వెంకీ రానా నాయుడు అనే సిరీస్తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. గత ఏడాదే అనౌన్స్ అయిన ఈ సిరీస్.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఈ సిరీస్ గురించి సౌండ్ లేదు.
ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రానా నాయుడు రిలీజ్ అప్డేట్ అడుగుతున్నా.. దీన్ని ప్రొడ్యూస్ చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ సైలెంటుగా ఉంది. కాగా ఇప్పుడు స్వయంగా వెంకీనే రానా నాయుడు ప్రమోషన్లను కొంచెం వెరైటీగా మొదలుపెట్టి.. రిలీజ్ గురించి హింట్ ఇచ్చాడు.
తన అరంగేట్ర సిరీస్కు రానా నాయుడు అనే టైటిల్ పెట్టడం పట్ల వెంకీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెట్ ఫ్లిక్స్ వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం విశేషం. రానా నాయుడు కోసం తాను ఎత్తిన కొత్త అవతారంలో గన్ను పట్టుకుని ఉన్న వీడియోను పోస్టు చేస్తూ.. చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ నెట్ ఫ్లిక్స్.. రానా నాయుడులో హీరో ఎవరు? నేను. అందరికంటే పెద్ద స్టార్ ఎవరు? నేను. అందంగా కనిపించేది నేనే. ఫ్యాన్స్ కూడా నావాళ్లే. కాబట్టి షోకి రానా నాయుడు అని కాకుండా నాగా నాయుడు అని టైటిల్ ఉండాలి. నాతో మజాక్ వద్దు అని కామెంట్ జోడించాడు వెంకీ.
ఈ వీడియోను వెంకీ, రానాల సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కూడా రీట్వీట్ చేసింది. ఈ సిరీస్లో వెంకీ వయొలెంట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర లక్షణాల్ని చాటేలా వెరైటీగా వెంకీ ప్రమోషన్ మొదలుపెట్టినట్లున్నాడు. ఇలా ప్రమోషన్లు మొదలయ్యాయంటే త్వరలోనే సిరీస్ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నట్లే.
This post was last modified on February 13, 2023 11:12 pm
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
టాలీవుడ్లో అత్యంత నిరాశాజనకంగా సాగిన వేసవి సీజన్లలో 2025 ఒకటి. ఆ సంవత్సరం ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా…
టాలీవుడ్లో హీరోగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే పెద్ద రేంజికి చేరుకుని.. ఆ తర్వాత సుదీర్ఘమైన ఫ్లాప్…
టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తలపెట్టి రామాయల నిర్మాణానికి సంబంధించిన ఇక్కట్లు దాదాపు తొలిగిపోయాయి. ఆయన సొంత…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అసామాన్యులు విజయం దక్కించుకోవడం.. వారసులు గెలుపు గుర్రాలు ఎక్కడం.. వరుస విజయాలు దక్కించుకున్న హేమాహేమీలు…