తెలుగు వాళ్లే కాక దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. డివైడ్ టాక్ను తట్టుకుని సూపర్ హిట్ అయిన ‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ఆ సినిమా ఉత్తరాదిన సెన్సేషన్ క్రియేట్ చేయడం.. ఈ సినిమా పాటలు, బన్నీ మేనరిజమ్స్ అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ కావడంతో సెకండ్ పార్ట్కు హైప్ ఒక రేంజిలో ఉంది. అందుకే పార్ట్-2 స్క్రిప్టు మీద మరింత కసరత్తు చేసి కొంచెం లేటుగానే షూటింగ్ మొదలుపెట్టాడు దర్శకుడు సుకుమార్.
ఇటీవలే వైజాగ్లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ‘పుష్ప-2’ టీం తాజాగా రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టింది. ఈ షెడ్యూల్ నిరవధికంగా మూడు వారాలకు పైగా కొనసాగనుందట. కొన్ని భారీ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట.
కాగా ఈ చిత్రంలో పుష్ప పాత్రకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. బన్నీ ఇందులో జపనీస్ భాష మాట్లాడనున్నాడట. ఎర్రచందనం స్మగ్లింగ్లో అతను అంతర్జాతీయ స్థాయికి ఎదగడం.. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ స్మగ్లర్లను డీల్ చేసేందుకు జపాన్ వెళ్లడం.. అక్కడికి వెళ్లే ముందు కాస్త జపనీస్ నేర్చుకుని.. అక్కడి వాళ్లతో ఆ భాషలోనే సంభాషించడం జరుగుతుందట. ఈ సన్నివేశాలు హిలేరియస్గా ఉంటాయని.. జపాన్ ఎపిసోడ్ సినిమాలో మేజర్ హైలైట్లలో ఒకటిగా ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇప్పటిదాకా జరిగిన షూటింగ్లో హీరోయిన్ రష్మిక పాల్గొనలేదు. కొత్త షెడ్యూల్లో ఆమెతో సహా ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. పుష్ప-2లో ప్రధాన విలన్గా ఫాహద్ ఫాజిల్ కనిపించనుండగా.. జగపతిబాబు కూడా కొత్త విలన్గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది.
This post was last modified on February 13, 2023 10:58 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…