Adipurush
అసలే గొడవ లేకుండా సంక్రాంతికి వచ్చేసి ఉంటే ఆది పురుష్ ఈపాటికి ఫైనల్ రన్ పూర్తి చేసుకుని ఓటిటి రిలీజ్ కు దగ్గరగా ఉండేది. ట్రయిలర్ కు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ దెబ్బకు యూనిట్ మొత్తం రిపేర్లు చేసే పనిలో పడింది. అందుకే తప్పని పరిస్థితిలో కొత్త డేట్ గా జూన్ 16 చాలా రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది అనౌన్స్ అయ్యాకే ఇతర ప్యాన్ ఇండియాలు పోటీ ఎందుకు లెమ్మని దానికి అనుగుణంగా షెడ్యూల్ చేసుకుంటున్నాయి. అవతార్ తరహాలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న ఆది పురుష్ అదనంగా చేస్తున్న వర్క్ కోసం వంద కోట్లవుతోందట.
ఇదిలా ఉండగా జూన్ 16న ఒక్కళ్ళే వస్తున్నామని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడటానికి లేదు. ఎందుకంటే అదే రోజు హాలీవుడ్ మూవీ ది ఫ్లాష్ ని షెడ్యూల్ చేసి ఆ మేరకు అధికారికంగా ప్రకటించారు. దీని వల్ల ఇండియాలో తీవ్ర ప్రభావం ఉండదు కానీ ఓవర్సీస్ లో ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. ఎందుకంటే యుఎస్ యుకె లాంటి దేశాల్లో ఫ్లాష్ సినిమాకున్న క్రేజ్, నిర్మాణ సంస్థకున్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దాన్ని భారీ ఎత్తున స్క్రీన్లను దక్కించుకునేలా చేస్తుంది. అదే జరిగితే ఆది పురుష్ ఓపెనింగ్స్ కి పెద్ద గండి పడుతుంది. టాక్ పాజిటివ్ గా వస్తే ఇబ్బంది లేదు కానీ లేదంటేనే చిక్కు.
ఇప్పుడీ కారణంగా మరో డేట్ కు వెళ్తారా లేక రిస్క్ చేసి ఏం పర్లేదనుకుంటారానేది వేచి చూడాలి. మరోవైపు ఇది ఎలాగూ పోస్ట్ పోన్ అవుతుందన్న నమ్మాకమో లేక తక్కువ గ్యాప్ ఉన్న పర్లేదు ఆడుతుందన్న ధైర్యమో కానీ సలార్ మాత్రం సెప్టెంబర్ 28కే పక్కాగా ఫిక్స్ అయిపోయింది. కంటెంట్ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ఏ కోణంలో చూసుకున్నా ది ఫ్లాష్ తో ఆది పురుష్ అంత సులభంగా పోటీ పడలేదు. మనది మహా అయితే ఓ అయిదు వందల కోట్లు ఉంటుంది. కానీ అవతల వాళ్ళది దీనికి పదింతలు ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి ఏం జరగనుందో
This post was last modified on February 13, 2023 4:39 pm
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
టాలీవుడ్లో అత్యంత నిరాశాజనకంగా సాగిన వేసవి సీజన్లలో 2025 ఒకటి. ఆ సంవత్సరం ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా…
టాలీవుడ్లో హీరోగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే పెద్ద రేంజికి చేరుకుని.. ఆ తర్వాత సుదీర్ఘమైన ఫ్లాప్…
టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తలపెట్టి రామాయల నిర్మాణానికి సంబంధించిన ఇక్కట్లు దాదాపు తొలిగిపోయాయి. ఆయన సొంత…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అసామాన్యులు విజయం దక్కించుకోవడం.. వారసులు గెలుపు గుర్రాలు ఎక్కడం.. వరుస విజయాలు దక్కించుకున్న హేమాహేమీలు…