ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ లకు భారీ బడ్జెట్ సినిమాల రేంజ్ లో అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు రంగప్రవేశం చేశాక వీటి హైప్ వల్ల రాత్రి పూట ఎంత ఆలస్యమైనా సరే ఏకధాటిగా చూసే ఆడియన్స్ పెరిగిపోతున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్ తో వెబ్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన దర్శక ద్వయం రాజ్ అండ్ డికెలు తాజాగా ఫర్జీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఏదో ప్యాన్ ఇండియా మూవీలాగా అమెజాన్ ప్రైమ్ దీనికి చేసిన ప్రమోషన్ అంతా ఇంతా కాదు. స్టార్ క్యాస్టింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ సెమీ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందోనన్న ఆసక్తి కలగడం సహజం.
ఇది దొంగనోట్ల చుట్టూ తిరిగే కథ. అందరూ సన్నీ అని పిలుచుకునే సందీప్(షాహిద్ కపూర్)గొప్ప ఆర్టిస్టు. దేన్నైనా అచ్చుగుద్దినట్టు బొమ్మ వేయడం అతని ప్రత్యేకత. తాత నడిపే క్రాంతి పత్రిక వల్ల అప్పులు నెత్తిమీదకు రావడంతో ఫేక్ కరెన్సీని బొమ్మగా వేసి అదే ప్రెస్ లో ప్రింట్లు తీసి చెలామణి చేసి సక్సెస్ అవుతాడు. ఇదే దందా చేసే మన్సూర్(కెకె మీనన్)సన్నీని తనతో కలుపుకుంటాడు. ఈ స్కామ్ ని ఛేదించడానికి రంగంలోకి దిగుతాడు మైఖేల్(విజయ్ సేతుపతి). దొంగ పోలీస్ ఆట మొదలవుతుంది. మధ్యలో మేఘ(రాశి ఖన్నా) చేసిందేంటి, ఎవరు గెలిచారు లాంటి ప్రశ్నలకు సమాధానం ఫర్జీ
ఒక్కోటి గంటకు దగ్గరగా మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఫర్జీ తీశారు. నకిలీ భాగోతాలు ఎలా జరుగుతాయి, ప్రభుత్వాలు పోలీసుల కళ్లుగప్పి మాఫియా వీటిని ఎలా మేనేజ్ చేస్తుందనేది రాజ్ అండ్ డికెలు బాగా చూపించారు. విపరీతమైన అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఫర్జీ ఓకే వాచ్.
మొదట్లో కనిపించే సాగతీతను మినహాయిస్తే మిగిలినదంతా మంచి టెంపోతో నడిపించారు. ద్వందార్థాలు కొంత ఇబ్బంది పెట్టేలా ఉన్నా పాత్రల మధ్య వన్ లైనర్స్ బాగా పేలాయి. సెకండ్ సీజన్ బజ్ కోసం క్లైమాక్స్ ని అసంపూర్ణంగా వదిలేయడం కొంత ఇబ్బంది. ఫైనల్ గా చెప్పాలంటే ఫర్జీ ఖర్చుపెట్టిన సమయానికి ఓ మోస్తరు న్యాయమైతే చేసింది.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…