ఈ మధ్య ఉన్నట్లుండి కోలీవుడ్ హీరోల దృష్టి టాలీవుడ్ దర్శకుల మీద పడింది. తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడం దశాబ్దాల నుంచి చూస్తున్నాం కానీ.. మన డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి కోలీవుడ్ స్టార్లు ఆసక్తిని ప్రదర్శించడం మాత్రం అరుదు.
ఆల్రెడీ కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్.. మన వంశీ పైడిపల్లితో ‘వారిసు’ సినిమా చేశాడు. ఈ సినిమా రకరకాల కారణాల వల్ల విడుదలకు ముందు విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కొంది. రిలీజ్ తర్వాత టాక్ కూడా ఏమంత బాగా లేదు.
కానీ ఈ నెగెటివిటీని తట్టుకుని సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది. విజయ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొత్తానికి సినిమా అంతిమంగా బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది. రిలీజ్కు ముందు, రిలీజ్ తర్వాత వంశీ పైడిపల్లి బాగా ట్రోలింగ్ ఎదుర్కొన్నప్పటికీ.. చివరికి ఒక సక్సెస్ ఫుల్ సినిమాను అందించిన దర్శకుడిగా అతడికి పేరొచ్చింది.
కట్ చేస్తే ఇప్పుడు ఇంకో టాలీవుడ్ దర్శకుడు కోలీవుడ్ బాక్సాఫీస్లో పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. అతనే.. వెంకీ అట్లూరి. ఈ యువ దర్శకుడితో కోలీవుడ్ విలక్షణ నటుడు ధనుష్ ‘సార్’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ధనుష్ మిగతా స్టార్ల మాదిరి రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీసే టైపు కాదు. అతడి సినిమాల్లో వైవిధ్యం ఉంటుంది. కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తుంటాడు.
ఇలాంటి హీరోతో హిట్ కొట్టడం అంత తేలిక కాదు. ధనుష్ లాంటి నటుడు వెంకీని నమ్మి సినిమా చేశాడంటే అది విశేషమే. ఇటీవలే రిలీజైన ‘సార్’ ట్రైలర్లో ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి మెసేజ్ కూడా కనిపించింది. కానీ ఇలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పించడం అంత తేలిక కాదు.
సినిమాకు ఇటు తెలుగులో, అటు తమిళం మరీ బజ్ ఏమీ లేదు. రిలీజ్ ఆలస్యం కావడం, సరిగ్గా సినిమాను ప్రమోట్ చేయకపోవడం కొంత మైనస్ అయింది. ఐతే రిలీజ్ టైంకి ఆటోమేటిగ్గా హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఈ నెల 17న మహాశివరాత్రి కానుకగా విడుదల కానున్న ‘సార్’ రెండు భాషల్లో మంచి విజయం సాధించిన ధనుష్ నమ్మకాన్ని నిలబెడుతుందేమో చూడాలి.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…