సోషల్ మీడియా విస్తృతి పెరిగాక ఫ్యాన్ వార్స్ ఎంత శ్రుతి మించిపోయాయో తెలిసిందే. చిన్న చిన్న కారణాలు పట్టుకుని స్టార్ హీరోల అభిమానులు పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడం.. హీరోలను కించపరచడం చేస్తున్నారు.
ఇంతకుముందు రెండు వేర్వేరు ఫ్యామిలీ హీరోల అభిమానుల మధ్యే గొడవలు ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. పరస్పరం దారుణాతి దారుణమైన మాటలు అనుకుంటున్నారు. నెగెటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు.
ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు ఇంకా హీరోలు కాని తర్వాతి తరం కుర్రాళ్ల విషయంలోనూ ఫ్యాన్ వార్స్ జరుగుతుండడం విడ్డూరం. మామూలుగానే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య తరచుగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు వారి కొడుకుల విషయంలోనూ గొడవలు మొదలయ్యాయి.
మహేష్ బాబు కొడుకు గౌతమ్.. పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ప్రస్తుతం టీనేజీలో ఉన్నారు. వీళ్ల దృష్టి ప్రస్తుతానికి చదువు మీదే ఉంది. మీడియాకు దూరంగా వాళ్లను పెంచుతున్నారు. ఎప్పుడో అనుకోకుండా బయటికి వచ్చినపుడు ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతుంటాయి.
కాగా.. మొన్న హైదరాబాద్ ఫార్ములా-ఈ రేసింగ్ ప్రాక్టీస్ చూడడం కోసం గౌతమ్ బయటికి వచ్చాడు. ఒక్కసారిగా మీడియా అతడి మీద పడిపోయింది. మహా సిగ్గరి అయిన గౌతమ్ను మీడియా వాళ్లు రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. మరోవైపు అకీరా ఎక్కడికి, ఎందుకు వచ్చాడో తెలియదు కానీ.. తన ఫొటో అయితే సోషల్ మీడియాలోకి చేరిపోయింది.
ఇక అంతే.. ఇటు పవన్ ఫ్యాన్సేమో అకీరా ఏమున్నాడో చూశారా, డెబ్యూ హీరో రికార్డులన్నీ బద్దలైపోతాయి అంటూ ఎలివేషన్ ఇవ్వడం మొదలుపెడితే.. అవతల మహేష్ ఫ్యాన్స్ గౌతమ్ భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడు అవుతాడని, రికార్డుల మోత మోగించేస్తాడని కొనియాడడం మొదలుపెట్టారు. అంతటితో ఆగితే సరే.. ఈ ఫ్యాన్స్ ఆ ఇద్దరు కుర్రాళ్లతో పాటు వారి తండ్రులను కించపరచడం మొదలుపెట్టారు.
ఇక్కడ కూడా రికార్డులు.. వారి ఆహార్యాల గురించిన ప్రస్తావన వచ్చి.. దారుణమైన మాటలతో దిగజారి ప్రవర్తిస్తున్నారు. అసలు ఎప్పుడు సినిమాల్లోకి వస్తారో.. అసలు వస్తారో రారో తెలియని కుర్రాళ్ల గురించి ఇప్పుడే గొడవలు పడడం ఫ్యాన్ వార్స్లో నెక్స్ట్ లెవెల్ అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…