సోషల్ మీడియా విస్తృతి పెరిగాక ఫ్యాన్ వార్స్ ఎంత శ్రుతి మించిపోయాయో తెలిసిందే. చిన్న చిన్న కారణాలు పట్టుకుని స్టార్ హీరోల అభిమానులు పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడం.. హీరోలను కించపరచడం చేస్తున్నారు.
ఇంతకుముందు రెండు వేర్వేరు ఫ్యామిలీ హీరోల అభిమానుల మధ్యే గొడవలు ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. పరస్పరం దారుణాతి దారుణమైన మాటలు అనుకుంటున్నారు. నెగెటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు.
ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు ఇంకా హీరోలు కాని తర్వాతి తరం కుర్రాళ్ల విషయంలోనూ ఫ్యాన్ వార్స్ జరుగుతుండడం విడ్డూరం. మామూలుగానే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య తరచుగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు వారి కొడుకుల విషయంలోనూ గొడవలు మొదలయ్యాయి.
మహేష్ బాబు కొడుకు గౌతమ్.. పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ప్రస్తుతం టీనేజీలో ఉన్నారు. వీళ్ల దృష్టి ప్రస్తుతానికి చదువు మీదే ఉంది. మీడియాకు దూరంగా వాళ్లను పెంచుతున్నారు. ఎప్పుడో అనుకోకుండా బయటికి వచ్చినపుడు ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతుంటాయి.
కాగా.. మొన్న హైదరాబాద్ ఫార్ములా-ఈ రేసింగ్ ప్రాక్టీస్ చూడడం కోసం గౌతమ్ బయటికి వచ్చాడు. ఒక్కసారిగా మీడియా అతడి మీద పడిపోయింది. మహా సిగ్గరి అయిన గౌతమ్ను మీడియా వాళ్లు రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. మరోవైపు అకీరా ఎక్కడికి, ఎందుకు వచ్చాడో తెలియదు కానీ.. తన ఫొటో అయితే సోషల్ మీడియాలోకి చేరిపోయింది.
ఇక అంతే.. ఇటు పవన్ ఫ్యాన్సేమో అకీరా ఏమున్నాడో చూశారా, డెబ్యూ హీరో రికార్డులన్నీ బద్దలైపోతాయి అంటూ ఎలివేషన్ ఇవ్వడం మొదలుపెడితే.. అవతల మహేష్ ఫ్యాన్స్ గౌతమ్ భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడు అవుతాడని, రికార్డుల మోత మోగించేస్తాడని కొనియాడడం మొదలుపెట్టారు. అంతటితో ఆగితే సరే.. ఈ ఫ్యాన్స్ ఆ ఇద్దరు కుర్రాళ్లతో పాటు వారి తండ్రులను కించపరచడం మొదలుపెట్టారు.
ఇక్కడ కూడా రికార్డులు.. వారి ఆహార్యాల గురించిన ప్రస్తావన వచ్చి.. దారుణమైన మాటలతో దిగజారి ప్రవర్తిస్తున్నారు. అసలు ఎప్పుడు సినిమాల్లోకి వస్తారో.. అసలు వస్తారో రారో తెలియని కుర్రాళ్ల గురించి ఇప్పుడే గొడవలు పడడం ఫ్యాన్ వార్స్లో నెక్స్ట్ లెవెల్ అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on February 13, 2023 8:24 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…