మెగాస్టార్ చిరంజీవి తరపున వారసుడిగా రామ్ చరణ్ స్టార్ హీరోగా సెటిలైపోయాడు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ చక్కగా కుదురుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ ఆ లెగసిని తీసుకెళ్లే హీరోగా అభిమానులు అకీరానందన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అతని తల్లి రేణు దేశాయ్ తో ఎప్పుడో విడాకులు జరిగినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం అకీరా ఎలాగూ పవర్ స్టార్ బ్లడ్డే కాబట్టి తన లాంచ్ కోసం ఎదురుచూపులు మొదలెట్టారు. ఈ విషయంలో ఆవిడ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని తరచుగా ఇచ్చే ఇంటర్వ్యూలలో గమనించవచ్చు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.
దానికి తగ్గట్టే అకీరా ఈ మధ్య ఎక్కువగా హైదరాబాద్ లో కనిపిస్తున్నాడు. గత నెల ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో వాల్తేరు వీరయ్య ప్రీమియర్ షోకు మాస్క్ వేసుకుని వచ్చినా ఫొటోల్లో దొరికిపోయాడు. తాజాగా తన పూర్తి లుక్ బయట పెట్టే పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కుర్రాడు దిట్టంగా ఉండటంతో డెబ్యూ చేయించమని, అన్నయ్య చరణ్ చిరుత రికార్డులు డెబ్యూతో అకీరానే బద్దలు కొట్టాలని రకరకాలుగా ట్వీట్లు వేస్తున్నారు. ఆ ఫోటోలు కాస్తా వైరల్ కావడంతో ఇంకో రెండు మూడేళ్ళలో తెరగేంట్రం జరిగినా ఆశ్చర్యం లేదంటున్నాయి మెగా కాంపౌండ్ వర్గాలు.
పవన్ ఎలాగూ జనసేనతో బిజీ అవుతున్నారు. ఎన్నికలు ఇంకో ఏడాదికి అటుఇటు వచ్చేస్తాయి. ఒకవేళ అప్పుడు భవిషత్తు కనక ఆశాజనకంగా ఉంటే సినిమాలు మానేయాల్సి వస్తుంది. అప్పుడు అకీరాకు స్పేస్ దొరుకుతుంది. తండ్రి రిటైర్ అయ్యాకే కొడుకు రావాలని లేదు కాబట్టి ఒకవేళ పవన్ మేనియా కొనసాగుతున్న టైంలోనే దించినా ఖచ్చితంగా ఓపెనింగ్స్ భీభత్సంగా ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఈ అంచనాలు ఎప్పుడు నిజమవుతాయో చెప్పలేం కానీ ఇంతకీ అకీరా స్క్రీన్ మీదకు వచ్చేందుకు సరిపడా యాక్టింగ్, ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడో లేదో.
This post was last modified on February 12, 2023 3:16 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…