ఒకప్పుడు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నుండి సినిమా వస్తుందంటే చాలు సూపర్ హిట్ ఆన్ ది వే అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు లెక్క మారింది. దిల్ రాజు గారు తన డిసిషన్స్ తో బ్రాండ్ ను దెబ్బతీసుకుంటున్నారు. ఎస్వీసీ నుండి వరుసగా వచ్చిన సినిమాలన్నీ అపజయాలు అందుకున్నాయి. వకీల్ సాబ్ , ఎఫ్ 3 యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నాయి తప్ప బాక్సాఫీస్ దగ్గర నంబర్స్ తో సౌండ్ చేయలేకపోయాయి.
తాజాగా దిల్ రాజు బేనర్ కి ‘థాంక్యూ’ రూపంలో ఓ డిజాస్టర్ దక్కింది. అయితే ఇప్పుడు దిల్ రాజు ఓ చిన్న సినిమాతో మళ్ళీ అందరి మన్ననలు అందుకోవాలని భావిస్తున్నాడు. ఓ కామెడీ కం ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే బలగం. కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణా నేపథ్య కథతో ఓ విలేజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.
సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. మంచి టైమ్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు మార్చ్ లో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే దిల్ రాజు కాంపౌండ్ ఈ సినిమా మరో శతమానం భవతి అంటూ చెప్పుకుంటున్నారు. అవార్డులు కూడా పక్కా అంటున్నారు. మరి బలగం దిల్ రాజు ఈజ్ బ్యాక్ అని చెప్పుకునేలా చేస్తుందా ? చూడాలి.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…