ఒకప్పుడు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నుండి సినిమా వస్తుందంటే చాలు సూపర్ హిట్ ఆన్ ది వే అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు లెక్క మారింది. దిల్ రాజు గారు తన డిసిషన్స్ తో బ్రాండ్ ను దెబ్బతీసుకుంటున్నారు. ఎస్వీసీ నుండి వరుసగా వచ్చిన సినిమాలన్నీ అపజయాలు అందుకున్నాయి. వకీల్ సాబ్ , ఎఫ్ 3 యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నాయి తప్ప బాక్సాఫీస్ దగ్గర నంబర్స్ తో సౌండ్ చేయలేకపోయాయి.
తాజాగా దిల్ రాజు బేనర్ కి ‘థాంక్యూ’ రూపంలో ఓ డిజాస్టర్ దక్కింది. అయితే ఇప్పుడు దిల్ రాజు ఓ చిన్న సినిమాతో మళ్ళీ అందరి మన్ననలు అందుకోవాలని భావిస్తున్నాడు. ఓ కామెడీ కం ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే బలగం. కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణా నేపథ్య కథతో ఓ విలేజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.
సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. మంచి టైమ్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు మార్చ్ లో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే దిల్ రాజు కాంపౌండ్ ఈ సినిమా మరో శతమానం భవతి అంటూ చెప్పుకుంటున్నారు. అవార్డులు కూడా పక్కా అంటున్నారు. మరి బలగం దిల్ రాజు ఈజ్ బ్యాక్ అని చెప్పుకునేలా చేస్తుందా ? చూడాలి.
This post was last modified on February 12, 2023 10:39 am
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…