ఒకప్పుడు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నుండి సినిమా వస్తుందంటే చాలు సూపర్ హిట్ ఆన్ ది వే అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు లెక్క మారింది. దిల్ రాజు గారు తన డిసిషన్స్ తో బ్రాండ్ ను దెబ్బతీసుకుంటున్నారు. ఎస్వీసీ నుండి వరుసగా వచ్చిన సినిమాలన్నీ అపజయాలు అందుకున్నాయి. వకీల్ సాబ్ , ఎఫ్ 3 యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నాయి తప్ప బాక్సాఫీస్ దగ్గర నంబర్స్ తో సౌండ్ చేయలేకపోయాయి.
తాజాగా దిల్ రాజు బేనర్ కి ‘థాంక్యూ’ రూపంలో ఓ డిజాస్టర్ దక్కింది. అయితే ఇప్పుడు దిల్ రాజు ఓ చిన్న సినిమాతో మళ్ళీ అందరి మన్ననలు అందుకోవాలని భావిస్తున్నాడు. ఓ కామెడీ కం ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే బలగం. కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణా నేపథ్య కథతో ఓ విలేజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.
సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. మంచి టైమ్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు మార్చ్ లో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే దిల్ రాజు కాంపౌండ్ ఈ సినిమా మరో శతమానం భవతి అంటూ చెప్పుకుంటున్నారు. అవార్డులు కూడా పక్కా అంటున్నారు. మరి బలగం దిల్ రాజు ఈజ్ బ్యాక్ అని చెప్పుకునేలా చేస్తుందా ? చూడాలి.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…