ఒకప్పుడు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నుండి సినిమా వస్తుందంటే చాలు సూపర్ హిట్ ఆన్ ది వే అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు లెక్క మారింది. దిల్ రాజు గారు తన డిసిషన్స్ తో బ్రాండ్ ను దెబ్బతీసుకుంటున్నారు. ఎస్వీసీ నుండి వరుసగా వచ్చిన సినిమాలన్నీ అపజయాలు అందుకున్నాయి. వకీల్ సాబ్ , ఎఫ్ 3 యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నాయి తప్ప బాక్సాఫీస్ దగ్గర నంబర్స్ తో సౌండ్ చేయలేకపోయాయి.
తాజాగా దిల్ రాజు బేనర్ కి ‘థాంక్యూ’ రూపంలో ఓ డిజాస్టర్ దక్కింది. అయితే ఇప్పుడు దిల్ రాజు ఓ చిన్న సినిమాతో మళ్ళీ అందరి మన్ననలు అందుకోవాలని భావిస్తున్నాడు. ఓ కామెడీ కం ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే బలగం. కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణా నేపథ్య కథతో ఓ విలేజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.
సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. మంచి టైమ్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు మార్చ్ లో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే దిల్ రాజు కాంపౌండ్ ఈ సినిమా మరో శతమానం భవతి అంటూ చెప్పుకుంటున్నారు. అవార్డులు కూడా పక్కా అంటున్నారు. మరి బలగం దిల్ రాజు ఈజ్ బ్యాక్ అని చెప్పుకునేలా చేస్తుందా ? చూడాలి.
This post was last modified on February 12, 2023 10:39 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…