ఆస్కార్ వేడుక కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేస్తోంది. మార్చిలో గ్రాండ్ గా జరగబోయే అకాడమీ ఈవెంట్ కోసం ఆర్ఆర్ఆర్ బృందమే కాదు సగటు సినీ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీ పడుతున్న సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు ఊపందుకున్నాయి. వాటిలో హాలీవుడ్ దిగ్గజం స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం వహించిన ది ఫాబెల్ మ్యాన్స్ ఉంది. దీని కోసం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా ఈయన మన రాజమౌళితో వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ములాఖత్ అయ్యారు. అవతలి వ్యక్తికో స్థాయి ఉంటే ఉంటే తప్ప స్పీల్బర్డ్ లాంటివాళ్లు ఒప్పుకోరు.
ఈ సందర్భంగా అంతటి దిగ్గజం మన జక్కన్నను ప్రశంసలతో ముంచెత్తారు. పోయిన వారం ఆర్ఆర్ఆర్ చూశానని అద్భుతంగా ఉందని, నా కళ్ళతో చూసినా నమ్మశక్యంగా కానంత గొప్పగా తీశావని, రామ్, రామా, అలియాలతో పాటు తన లాస్ట్ క్రూసేడ్ లో నటించిన అలిసన్ కూడా అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. అంతే కాదు ఆస్కార్ లాంటి పురస్కారాలు గెలవాలంటే ఒరిజినాలిటీకి కట్టుబడి ఉండాలని, లక్ష్యంగా పెట్టుకున్న ఆడియన్స్ ని మెప్పించడమే ధ్యేయంగా స్క్రిప్ట్ రాసుకోవాలి పలు సూచలను ఇచ్చారు. ఫాబెల్ మ్యాన్స్ మేకింగ్ లోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పారు.
ఇంత ఇంటరాక్షన్ జరిగితే రాజమౌళి ఆనందం వర్ణించేలా ఉంటుందా. లేచి డాన్సు చేయాలని ఉందని చెప్పి ఒక రైటర్ గా స్పీల్బర్గ్ ఆలోచన శైలి ఎలా ఉంటుందనే దాని మీద పలు టిప్స్ తీసుకున్నారు. ఇప్పుడీ ఇంటర్వ్యూ వీడియో మంచి ట్రెండింగ్ లో ఉంది. గతంలో ఎప్పుడూ ఒక ఇండియన్ ఫిలిం మేకర్ తో స్పీల్బర్గ్ లాంటి మహామహులు ఇంత ఓపెన్ గా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇది గొప్ప ఘనత. అవతార్ ని సృష్టించిన క్యామరూన్ లాంటి వాళ్ళు సైతం ఆర్ఆర్ఆర్ ని ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. చూస్తుంటే ఆస్కార్ కు రాజమౌళి కొన్ని అడుగుల దూరంలో ఉన్నట్టే.
This post was last modified on February 11, 2023 2:04 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…