మాములుగా బాలకృష్ణ పిలిచిన అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్లరనే సంగతి తెలిసిందే. తనకు ఆత్మీయులు లేదా పిలవడంలో ఏదైనా ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటే తప్ప ఎస్ చెప్పరు. శాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో బాలయ్యకు ఎప్పటి నుంచో బాండింగ్ ఉంది.
ఇటీవలే తారకరత్న బెంగళూరు హాస్పిటల్ లో చేరినప్పుడు అదే పనిగా వచ్చి మరీ శివన్న సంఘీభావం తెలిపారు. కేవలం ఈ కారణంగానే ఎన్నడూ లేనిది ఒక డబ్బింగ్ మూవీ శివ వేద ఈవెంట్ కి బాలకృష్ణ హాజరయ్యారు. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుక గ్రాండ్ గా నిర్వహించి జనం దృష్టిలో పడేలా చేశారు.
కన్నడలో మంచి విజయం సాధించిన వేదని అమిగోస్ ఉన్న కారణంగా ఒక రోజు ముందు 9న థియేటర్లలో విడుదల చేశారు. కట్ చేస్తే ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు అంతగా ఆసక్తి కనబరచలేదు.
ఎందుకంటే 10న జీ5లో తెలుగు ఆడియోతో పాటు వేద ఓటిటి వెర్షన్ ముందే ప్రకటించారు కాబట్టి. అన్నట్టుగానే నిన్న అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలైపోయింది. అంటే ఏపీ తెలంగాణలో నాలుగు షోలు పూర్తి చేసుకుని మరుసటి రోజు అయిదో ఆట పడేలోపు డిజిటల్ ప్రీమియర్ జరిగిన మొదటి సినిమాగా వేదను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
ఒకరకంగా చెప్పాలంటే ఆలస్యం అలసత్వం వల్ల బాలయ్య రాక, అంతో ఇంతో విషయమున్న డీసెంట్ కంటెంట్ ను చేతులారా వృథా చేసుకుంది ప్రొడక్షన్ టీమ్. ఇదే థియేట్రికల్ రిలీజ్ ఓ రెండు మూడు వారాల ముందు చేసి ఉంటే కనీస ఫలితం దక్కేది. ఇప్పుడది జరగదు.
రివ్యూలు, పబ్లిక్ టాక్ సంగతేమో కానీ శివరాజ్ కుమార్ అంతకష్టపడి సిటీలో ఉండి ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆఖరికి ఓటిటికి ఉపయోగపడేలా ఉన్నాయి. బహుశా ఈయనకు బాలయ్యకు కూడా ఇది ఒక్క రోజు గ్యాప్ లో ఓటిటి వస్తోందన్న సంగతి తెలిసి ఉండదు కాబోలు. ప్లానింగ్ లేకపోతే అంతే మరి
This post was last modified on February 10, 2023 6:29 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…