Movie News

బాలయ్య రాకను వృథా చేసుకున్నారు

మాములుగా బాలకృష్ణ పిలిచిన అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్లరనే సంగతి తెలిసిందే. తనకు ఆత్మీయులు లేదా పిలవడంలో ఏదైనా ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటే తప్ప ఎస్ చెప్పరు. శాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో బాలయ్యకు ఎప్పటి నుంచో బాండింగ్ ఉంది.

ఇటీవలే తారకరత్న బెంగళూరు హాస్పిటల్ లో చేరినప్పుడు అదే పనిగా వచ్చి మరీ శివన్న సంఘీభావం తెలిపారు. కేవలం ఈ కారణంగానే ఎన్నడూ లేనిది ఒక డబ్బింగ్ మూవీ శివ వేద ఈవెంట్ కి బాలకృష్ణ హాజరయ్యారు. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుక గ్రాండ్ గా నిర్వహించి జనం దృష్టిలో పడేలా చేశారు.

కన్నడలో మంచి విజయం సాధించిన వేదని అమిగోస్ ఉన్న కారణంగా ఒక రోజు ముందు 9న థియేటర్లలో విడుదల చేశారు. కట్ చేస్తే ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు అంతగా ఆసక్తి కనబరచలేదు.

ఎందుకంటే 10న జీ5లో తెలుగు ఆడియోతో పాటు వేద ఓటిటి వెర్షన్ ముందే ప్రకటించారు కాబట్టి. అన్నట్టుగానే నిన్న అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలైపోయింది. అంటే ఏపీ తెలంగాణలో నాలుగు షోలు పూర్తి చేసుకుని మరుసటి రోజు అయిదో ఆట పడేలోపు డిజిటల్ ప్రీమియర్ జరిగిన మొదటి సినిమాగా వేదను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

ఒకరకంగా చెప్పాలంటే ఆలస్యం అలసత్వం వల్ల బాలయ్య రాక, అంతో ఇంతో విషయమున్న డీసెంట్ కంటెంట్ ను చేతులారా వృథా చేసుకుంది ప్రొడక్షన్ టీమ్. ఇదే థియేట్రికల్ రిలీజ్ ఓ రెండు మూడు వారాల ముందు చేసి ఉంటే కనీస ఫలితం దక్కేది. ఇప్పుడది జరగదు.

రివ్యూలు, పబ్లిక్ టాక్ సంగతేమో కానీ శివరాజ్ కుమార్ అంతకష్టపడి సిటీలో ఉండి ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆఖరికి ఓటిటికి ఉపయోగపడేలా ఉన్నాయి. బహుశా ఈయనకు బాలయ్యకు కూడా ఇది ఒక్క రోజు గ్యాప్ లో ఓటిటి వస్తోందన్న సంగతి తెలిసి ఉండదు కాబోలు. ప్లానింగ్ లేకపోతే అంతే మరి

This post was last modified on February 10, 2023 6:29 pm

Share
Show comments
Published by
Satya
Tags: Vedha

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

4 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

5 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

5 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

6 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago