పాత సినిమాల రీ రిలీజుల వ్యవహారం తప్పుడు మలుపులు తిరుగుతోంది. అయిదారు నెలల క్రితం కొన్ని మంచి ఉద్దేశాలతో మొదలుపెట్టిన ఈ ట్రెండ్ క్రమంగా బిజినెస్ రంగు పులుముకోవడంతో ఎవరికి వారు దీన్ని క్యాష్ చేసుకుందామనే తాపత్రయం పెరిగిపోయింది. ఈ కారణంగానే కొన్ని డిజాస్టర్లను సైతం థియేటర్లలో వదిలి కలెక్షన్ల కోసం ఫ్యాన్స్ ఎమోషన్స్ ని రెచ్చగొట్టి పని పూర్తి చేసుకున్న వాళ్ళున్నారు. వీటి సంగతేమో కానీ ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ని సరైన ప్లానింగ్ తో సరైన సమయంలో విడుదల చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే అంతే సంగతులు
తాజాగా ఈ ఫిబ్రవరి 11 శనివారం రావాల్సిన గ్యాంగ్ లీడర్ ని క్యాన్సిల్ చేశారు. నాలుగు రోజుల క్రితమే కొన్ని ప్రధాన కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం అడ్వాన్స్ గా ఫుల్ అయితే అదనంగా 35 ఎంఎం జోడించారు. సోషల్ మీడియాలో వివిధ ఊళ్ళ నుంచి అభిమానులు సెల్ఫ్ ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు తాపీగా గ్యాంగ్ లీడర్ లేదంటూ చావు కబురు చల్లగా చెప్పేశారు. ముందుగా టికెట్లు కొన్నవాళ్లకు రీ ఫండ్ ఇస్తారు అది మాములే కానీ ఇప్పుడు చంపేసిన ఆసక్తిని మళ్ళీ ఇకపై పుట్టించగలరా అంటే సందేహమే.
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అసలు ఎంచుకున్న డేటే రాంగ్ టైమింగ్ లో ఉంది. పదిన అమిగోస్ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఆరేడు చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దిగుతున్నాయి. రైటర్ పద్మభూషణ్ విజయవంతంగా ఆడుతోంది. మైఖేల్, బుట్టబొమ్మలు సర్దుకున్నా వాల్తేరు వీరయ్యను కనీసం నెల రోజులు రన్ చేసేందుకు థియేటర్లు ముందే ఫిక్స్ అయ్యాయి. ప్రధాన కేంద్రాల్లో వీరసింహారెడ్డి కొనసాగుతోంది. అలాంటప్పుడు గ్యాంగ్ లీడర్ కి థియేటర్లు దక్కడం గగనమే. ప్లానింగ్ పద్దతి లేకుండా రీరిలీజులు చేస్తే ఇలాగే అభిమానులను నిరాశపరచడం తప్ప ఏమీ జరగదు.
This post was last modified on February 8, 2023 1:12 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…