పాత సినిమాల రీ రిలీజుల వ్యవహారం తప్పుడు మలుపులు తిరుగుతోంది. అయిదారు నెలల క్రితం కొన్ని మంచి ఉద్దేశాలతో మొదలుపెట్టిన ఈ ట్రెండ్ క్రమంగా బిజినెస్ రంగు పులుముకోవడంతో ఎవరికి వారు దీన్ని క్యాష్ చేసుకుందామనే తాపత్రయం పెరిగిపోయింది. ఈ కారణంగానే కొన్ని డిజాస్టర్లను సైతం థియేటర్లలో వదిలి కలెక్షన్ల కోసం ఫ్యాన్స్ ఎమోషన్స్ ని రెచ్చగొట్టి పని పూర్తి చేసుకున్న వాళ్ళున్నారు. వీటి సంగతేమో కానీ ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ని సరైన ప్లానింగ్ తో సరైన సమయంలో విడుదల చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే అంతే సంగతులు
తాజాగా ఈ ఫిబ్రవరి 11 శనివారం రావాల్సిన గ్యాంగ్ లీడర్ ని క్యాన్సిల్ చేశారు. నాలుగు రోజుల క్రితమే కొన్ని ప్రధాన కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం అడ్వాన్స్ గా ఫుల్ అయితే అదనంగా 35 ఎంఎం జోడించారు. సోషల్ మీడియాలో వివిధ ఊళ్ళ నుంచి అభిమానులు సెల్ఫ్ ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు తాపీగా గ్యాంగ్ లీడర్ లేదంటూ చావు కబురు చల్లగా చెప్పేశారు. ముందుగా టికెట్లు కొన్నవాళ్లకు రీ ఫండ్ ఇస్తారు అది మాములే కానీ ఇప్పుడు చంపేసిన ఆసక్తిని మళ్ళీ ఇకపై పుట్టించగలరా అంటే సందేహమే.
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అసలు ఎంచుకున్న డేటే రాంగ్ టైమింగ్ లో ఉంది. పదిన అమిగోస్ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఆరేడు చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దిగుతున్నాయి. రైటర్ పద్మభూషణ్ విజయవంతంగా ఆడుతోంది. మైఖేల్, బుట్టబొమ్మలు సర్దుకున్నా వాల్తేరు వీరయ్యను కనీసం నెల రోజులు రన్ చేసేందుకు థియేటర్లు ముందే ఫిక్స్ అయ్యాయి. ప్రధాన కేంద్రాల్లో వీరసింహారెడ్డి కొనసాగుతోంది. అలాంటప్పుడు గ్యాంగ్ లీడర్ కి థియేటర్లు దక్కడం గగనమే. ప్లానింగ్ పద్దతి లేకుండా రీరిలీజులు చేస్తే ఇలాగే అభిమానులను నిరాశపరచడం తప్ప ఏమీ జరగదు.
This post was last modified on February 8, 2023 1:12 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…