పాత సినిమాల రీ రిలీజుల వ్యవహారం తప్పుడు మలుపులు తిరుగుతోంది. అయిదారు నెలల క్రితం కొన్ని మంచి ఉద్దేశాలతో మొదలుపెట్టిన ఈ ట్రెండ్ క్రమంగా బిజినెస్ రంగు పులుముకోవడంతో ఎవరికి వారు దీన్ని క్యాష్ చేసుకుందామనే తాపత్రయం పెరిగిపోయింది. ఈ కారణంగానే కొన్ని డిజాస్టర్లను సైతం థియేటర్లలో వదిలి కలెక్షన్ల కోసం ఫ్యాన్స్ ఎమోషన్స్ ని రెచ్చగొట్టి పని పూర్తి చేసుకున్న వాళ్ళున్నారు. వీటి సంగతేమో కానీ ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ని సరైన ప్లానింగ్ తో సరైన సమయంలో విడుదల చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే అంతే సంగతులు
తాజాగా ఈ ఫిబ్రవరి 11 శనివారం రావాల్సిన గ్యాంగ్ లీడర్ ని క్యాన్సిల్ చేశారు. నాలుగు రోజుల క్రితమే కొన్ని ప్రధాన కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం అడ్వాన్స్ గా ఫుల్ అయితే అదనంగా 35 ఎంఎం జోడించారు. సోషల్ మీడియాలో వివిధ ఊళ్ళ నుంచి అభిమానులు సెల్ఫ్ ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు తాపీగా గ్యాంగ్ లీడర్ లేదంటూ చావు కబురు చల్లగా చెప్పేశారు. ముందుగా టికెట్లు కొన్నవాళ్లకు రీ ఫండ్ ఇస్తారు అది మాములే కానీ ఇప్పుడు చంపేసిన ఆసక్తిని మళ్ళీ ఇకపై పుట్టించగలరా అంటే సందేహమే.
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అసలు ఎంచుకున్న డేటే రాంగ్ టైమింగ్ లో ఉంది. పదిన అమిగోస్ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఆరేడు చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దిగుతున్నాయి. రైటర్ పద్మభూషణ్ విజయవంతంగా ఆడుతోంది. మైఖేల్, బుట్టబొమ్మలు సర్దుకున్నా వాల్తేరు వీరయ్యను కనీసం నెల రోజులు రన్ చేసేందుకు థియేటర్లు ముందే ఫిక్స్ అయ్యాయి. ప్రధాన కేంద్రాల్లో వీరసింహారెడ్డి కొనసాగుతోంది. అలాంటప్పుడు గ్యాంగ్ లీడర్ కి థియేటర్లు దక్కడం గగనమే. ప్లానింగ్ పద్దతి లేకుండా రీరిలీజులు చేస్తే ఇలాగే అభిమానులను నిరాశపరచడం తప్ప ఏమీ జరగదు.
This post was last modified on February 8, 2023 1:12 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…