ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇండస్ట్రీలో అందరికీ అజాత శత్రువుగా ఉంటారు. పెద్ద నుండి చిన్న వరకు అందరితో ఫ్రెండ్లీ గా ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. అలాంటి అల్లు అరవింద్ కి కూడా తాజాగా ఓ ఇన్సిడెంట్ కోపం తెప్పించింది. విజయ్ -పరశురామ్ కాంబోలో దిల్ రాజు సినిమా ప్రకటించడం విషయంలో అరవింద్ బాధ పడ్డారు. దీంతో ఒక్క ఫోన్ కాల్ చేసి ప్రెస్ మీట్ అంటూ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొన్ని గంటల్లోనే మళ్ళీ క్యాన్సిల్ చేసి వెనుక అంతా సెటిల్ చేసుకున్నారు.
అయితే ఈ విషయంలో అల్లు అరవింద్ కోపం దిల్ రాజు మీదే అంటూ కొందరూ, లేదు పరశురామ్ మీద అరవింద్ గుర్రున ఉన్నారంటూ ఇంకొందరు చెప్పుకున్నారు. ఇక హరీష్ శంకర్ వేసిన పంచ్ ఎవరికి అనేది చర్చ జరుగుతుంది. తాజాగా అల్లు అరవింద్ తన బేనర్ నుండి వస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్నారు. ఇదే ఈవెంట్ కి హరీష్ శంకర్ గెస్ట్ గా వచ్చాడు. తన స్పీచ్ లో భాగంగా అల్లు అరవింద్ గారి గురించి అలాగే బన్నీ వాస్ ఫ్రెండ్ షిప్ గురించి కొన్ని విషయలు పంచుకున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ హరీష్ స్పీచ్ లో కొన్ని ద్వందర్థాలు దొర్లాయి.
“డబ్బులు పెట్టేసి ఫైనల్ కాపీ చూసుకునే నిర్మాతలు ఉంటారు. కానీ స్క్రిప్ట్ స్టేజ్ నుండి ఉండే నిర్మాత మాత్రం అల్లు అరవింద్ గారే అంటూ చెప్పాడు హరీష్. అలాంటి నిర్మాతలు ఫ్రెండ్స్ గా ఉండటం మన అదృష్టం, అలాంటి ఫ్రెండ్స్ ను ఎవరైనా దూరం చూసుకుంటే అది వారి దురదృష్టం అనేశాడు. ఇంతకంటే నేను ఇంకా నేనేం చెప్పలేను” అంటూ పంచ్ వేశాడు.
హరీష్ ఈవెంట్ లో అల్లు అరవింద్ గారికి ఫ్రెండ్ గా దూరం అవ్వడం దురదృష్టం అని ఎవరిని ఉద్దేశించి అన్నారో అని అక్కడి వాళ్ళు చెవులు కోరుక్కున్నారు. హరీష్ శంకర్ నిన్న జరిగిన ఇండస్ట్రీ ఇన్ సైడ్ రచ్చ గురించి చెప్తూ ఎవరినైనా ఇలా అనొచ్చా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…