ఇప్పుడున్న ఓటిటిలకే దేనికి చందా కట్టాలో దేనికి వద్దనుకోవాలో అర్థం కాక హోమ్ ఆడియన్స్ విపరీతమైన కన్ఫ్యూజన్ లో పడిపోయారు. సరసమైన ధర ఉందని అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే ఈ మధ్య నెట్ ఫ్లిక్స్ కొనుకున్న టాలీవుడ్ కొత్త సినిమాల అనౌన్స్ మెంట్లు చూసి మతి పోయినంత పనైంది. సరే లోకల్ తెలుగు యాప్ ఆహాతో సర్దుకుందామంటే ఫోర్ కెలో కావాలంటే ఇంకో మూడు వందలు ఎక్స్ ట్రా కట్టమంటున్నారు. హాట్ స్టార్ ఉంటేనే క్రికెట్ లైవ్ ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ప్రత్యేకమైన సిరీస్ లు ఉండే సోనీ లివ్ కావాలంటే ఇంకో సహస్రం సమర్పించుకోవాల్సిందే.
ఇవన్నీ చాలవన్నట్టు ముఖేష్ అంబానీ త్వరలో కొత్త ఓటిటి తీసుకురాబోతున్నారట. ఆల్రెడీ ఈ సంస్థకు జియో సినిమా పేరుతో యాప్ ఉంది. అందులో సన్ నెక్స్ట్ కంటెంట్ కూడా షేర్ చేసేవాళ్ళు. ఇటీవలే దాన్ని విత్ డ్రా చేసుకున్నారు. ఫుట్ బాల్ వరల్డ్ కప్ జియోలోనే వచ్చింది. ఈ మధ్యే ముఖేష్ వయాకామ్ 18 స్టూడియోస్ ని కొన్నారు. వాళ్లదే వూట్ సెలెక్ట్ ప్లాట్ ఫార్మ్ ఉంది. వీళ్ళ దగ్గర బోలెడు కంటెంట్ ఉంది కానీ జనానికి పెద్దగా రీచ్ కావడం లేదు. ఇప్పుడీ రెండింటిని కలిపి జియో వూట్ పేరుతో అతి త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టు ముంబై మీడియా టాక్. అలా అని ఇదేమి ఆషామాషీగా ఉండదట
ఫోర్ జిలో జియో ఎలాంటి విప్లవం తీసుకొచ్చిందో అదే తరహాలో ఓటిటిలోనూ సమూల మార్పులు తెచ్చే విధంగా రిలయన్స్ పెద్ద ప్లానే వేస్తోంది. అందుకే ఎంత డిమాండ్ ఉన్నా హిందీ విక్రమ్ వేదా, భేడియాలను డిజిటల్ ప్రీమియర్ చేయలేదు. ఇవి థియేటర్లకు వచ్చి నెలలు దాటేసింది. వీటితో పాటు మరికొన్ని సౌత్ నార్త్ సినిమాలను ఒకేసారి గ్రాండ్ ఈవెంట్ ద్వారా జియో వూట్ నుంచి రిలీజ్ చేయబోతున్నట్టు తెలిసింది. ప్రాథమికంగా ప్లాన్లు చాలా చాలా సరసమైన ధరల్లో ఉంటాయట. ముందు ఇలా అలవాటు చేసి తర్వాత వాతలు పెట్టడం చూసిందే. దీనికీ ఆలా చేస్తారేమో వెయిట్ అండ్ సీ
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…