బాలీవుడ్ నవతరం నటుల్లో చాలా తక్కువ సమయంలో లెజెండరీ స్టేటస్ అందుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గానే కాక కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్తోనూ అతను అద్భుతమైన పెర్ఫామెన్స్లు ఇచ్చాడు.
ఐతే ఈ మధ్య వ్యక్తిగత జీవితంలో వివాదాల కారణంగా అతడి ఫిలిం కెరీర్ కూడా కొంచెం డౌన్ అయింది. ఇంతకముందులా తరచుగా సినిమాలు చేయట్లేదు నవాజ్. భార్య ఆలియాతో గొడవ రోజు రోజుకు శ్రుతిమించుతుండడంతో ఇప్పుడతను తన ఇంటికి కూడా వెళ్లకుండా హోటల్లో ఉంటుండడం గమనార్హం. ఆలియా చాన్నాళ్ల నుంచి నవాజ్కు దూరంగా ఉంటోంది.
ఐతే ఆమె ఇటీవల దుబాయికి వెళ్లడానికి ప్రయత్నించగా.. పాస్ పోర్ట్ సమస్య కారణంగా వెళ్లలేకపోయింది. దీంతో తిరిగి ఆమె నవాజ్ ఇంటికి వచ్చింది. ఐతే ఆలియాకు తమ ఇంట్లో ఉండే అర్హత లేదంటూ నవాజ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ నవాజ్ నుంచి తనకు ఇంకా విడాకులు రాలేదని, అలాంటపుడు తాను అతడి ఇంట్లో ఎందుకు ఉండకూడదని ఆమె వాదించింది. నవాజ్ తల్లి వేధిస్తోందని పోలీసులకు రివర్సులో ఫిర్యాదు చేసింది. నవాజ్ ఇంట్లో తనకు సరిగా తిండి పెట్టట్లేదని.. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది.
ఇలా గొడవ పెద్దది కావడంతో నవాజ్ తన ఇంటి నుంచి బయటికి వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవ తేలి, ఆలియా నుంచి తాను విడాకులు పొందే వరకు ఇంటికి వెళ్లకూడదని నవాజ్ నిర్ణయించుకున్నాడు. అప్పటిదాకా అతను హోటల్లోనే ఉండబోతున్నాడట. నవాజ్ ఇటీవలే విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను రూపొందించనున్న తెలుగు సినిమాలో విలన్ పాత్రకు అంగీకరించిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 6, 2023 6:28 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…