బాలీవుడ్ నవతరం నటుల్లో చాలా తక్కువ సమయంలో లెజెండరీ స్టేటస్ అందుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గానే కాక కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్తోనూ అతను అద్భుతమైన పెర్ఫామెన్స్లు ఇచ్చాడు.
ఐతే ఈ మధ్య వ్యక్తిగత జీవితంలో వివాదాల కారణంగా అతడి ఫిలిం కెరీర్ కూడా కొంచెం డౌన్ అయింది. ఇంతకముందులా తరచుగా సినిమాలు చేయట్లేదు నవాజ్. భార్య ఆలియాతో గొడవ రోజు రోజుకు శ్రుతిమించుతుండడంతో ఇప్పుడతను తన ఇంటికి కూడా వెళ్లకుండా హోటల్లో ఉంటుండడం గమనార్హం. ఆలియా చాన్నాళ్ల నుంచి నవాజ్కు దూరంగా ఉంటోంది.
ఐతే ఆమె ఇటీవల దుబాయికి వెళ్లడానికి ప్రయత్నించగా.. పాస్ పోర్ట్ సమస్య కారణంగా వెళ్లలేకపోయింది. దీంతో తిరిగి ఆమె నవాజ్ ఇంటికి వచ్చింది. ఐతే ఆలియాకు తమ ఇంట్లో ఉండే అర్హత లేదంటూ నవాజ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ నవాజ్ నుంచి తనకు ఇంకా విడాకులు రాలేదని, అలాంటపుడు తాను అతడి ఇంట్లో ఎందుకు ఉండకూడదని ఆమె వాదించింది. నవాజ్ తల్లి వేధిస్తోందని పోలీసులకు రివర్సులో ఫిర్యాదు చేసింది. నవాజ్ ఇంట్లో తనకు సరిగా తిండి పెట్టట్లేదని.. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది.
ఇలా గొడవ పెద్దది కావడంతో నవాజ్ తన ఇంటి నుంచి బయటికి వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవ తేలి, ఆలియా నుంచి తాను విడాకులు పొందే వరకు ఇంటికి వెళ్లకూడదని నవాజ్ నిర్ణయించుకున్నాడు. అప్పటిదాకా అతను హోటల్లోనే ఉండబోతున్నాడట. నవాజ్ ఇటీవలే విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను రూపొందించనున్న తెలుగు సినిమాలో విలన్ పాత్రకు అంగీకరించిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 6, 2023 6:28 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…