బాలీవుడ్ నవతరం నటుల్లో చాలా తక్కువ సమయంలో లెజెండరీ స్టేటస్ అందుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గానే కాక కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్తోనూ అతను అద్భుతమైన పెర్ఫామెన్స్లు ఇచ్చాడు.
ఐతే ఈ మధ్య వ్యక్తిగత జీవితంలో వివాదాల కారణంగా అతడి ఫిలిం కెరీర్ కూడా కొంచెం డౌన్ అయింది. ఇంతకముందులా తరచుగా సినిమాలు చేయట్లేదు నవాజ్. భార్య ఆలియాతో గొడవ రోజు రోజుకు శ్రుతిమించుతుండడంతో ఇప్పుడతను తన ఇంటికి కూడా వెళ్లకుండా హోటల్లో ఉంటుండడం గమనార్హం. ఆలియా చాన్నాళ్ల నుంచి నవాజ్కు దూరంగా ఉంటోంది.
ఐతే ఆమె ఇటీవల దుబాయికి వెళ్లడానికి ప్రయత్నించగా.. పాస్ పోర్ట్ సమస్య కారణంగా వెళ్లలేకపోయింది. దీంతో తిరిగి ఆమె నవాజ్ ఇంటికి వచ్చింది. ఐతే ఆలియాకు తమ ఇంట్లో ఉండే అర్హత లేదంటూ నవాజ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ నవాజ్ నుంచి తనకు ఇంకా విడాకులు రాలేదని, అలాంటపుడు తాను అతడి ఇంట్లో ఎందుకు ఉండకూడదని ఆమె వాదించింది. నవాజ్ తల్లి వేధిస్తోందని పోలీసులకు రివర్సులో ఫిర్యాదు చేసింది. నవాజ్ ఇంట్లో తనకు సరిగా తిండి పెట్టట్లేదని.. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది.
ఇలా గొడవ పెద్దది కావడంతో నవాజ్ తన ఇంటి నుంచి బయటికి వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవ తేలి, ఆలియా నుంచి తాను విడాకులు పొందే వరకు ఇంటికి వెళ్లకూడదని నవాజ్ నిర్ణయించుకున్నాడు. అప్పటిదాకా అతను హోటల్లోనే ఉండబోతున్నాడట. నవాజ్ ఇటీవలే విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను రూపొందించనున్న తెలుగు సినిమాలో విలన్ పాత్రకు అంగీకరించిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 6, 2023 6:28 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…