బాలీవుడ్ నవతరం నటుల్లో చాలా తక్కువ సమయంలో లెజెండరీ స్టేటస్ అందుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గానే కాక కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్తోనూ అతను అద్భుతమైన పెర్ఫామెన్స్లు ఇచ్చాడు.
ఐతే ఈ మధ్య వ్యక్తిగత జీవితంలో వివాదాల కారణంగా అతడి ఫిలిం కెరీర్ కూడా కొంచెం డౌన్ అయింది. ఇంతకముందులా తరచుగా సినిమాలు చేయట్లేదు నవాజ్. భార్య ఆలియాతో గొడవ రోజు రోజుకు శ్రుతిమించుతుండడంతో ఇప్పుడతను తన ఇంటికి కూడా వెళ్లకుండా హోటల్లో ఉంటుండడం గమనార్హం. ఆలియా చాన్నాళ్ల నుంచి నవాజ్కు దూరంగా ఉంటోంది.
ఐతే ఆమె ఇటీవల దుబాయికి వెళ్లడానికి ప్రయత్నించగా.. పాస్ పోర్ట్ సమస్య కారణంగా వెళ్లలేకపోయింది. దీంతో తిరిగి ఆమె నవాజ్ ఇంటికి వచ్చింది. ఐతే ఆలియాకు తమ ఇంట్లో ఉండే అర్హత లేదంటూ నవాజ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ నవాజ్ నుంచి తనకు ఇంకా విడాకులు రాలేదని, అలాంటపుడు తాను అతడి ఇంట్లో ఎందుకు ఉండకూడదని ఆమె వాదించింది. నవాజ్ తల్లి వేధిస్తోందని పోలీసులకు రివర్సులో ఫిర్యాదు చేసింది. నవాజ్ ఇంట్లో తనకు సరిగా తిండి పెట్టట్లేదని.. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది.
ఇలా గొడవ పెద్దది కావడంతో నవాజ్ తన ఇంటి నుంచి బయటికి వచ్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవ తేలి, ఆలియా నుంచి తాను విడాకులు పొందే వరకు ఇంటికి వెళ్లకూడదని నవాజ్ నిర్ణయించుకున్నాడు. అప్పటిదాకా అతను హోటల్లోనే ఉండబోతున్నాడట. నవాజ్ ఇటీవలే విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను రూపొందించనున్న తెలుగు సినిమాలో విలన్ పాత్రకు అంగీకరించిన సంగతి తెలిసిందే.
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…