కంగనా రనౌత్ ట్విట్టర్లో ఉన్నన్ని రోజులు ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఓవైపు బాలీవుడ్ సెలబ్రెటీలు, మరోవైపు కొన్ని రాజకీయ పార్టీలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి.
ఐతే ఒక దశ దాటాక తన పోస్టులు మరీ వివాదాస్పదం కావడంతో ట్విట్టర్ ఆమె అకౌంట్ని సస్పెండ్ చేసింది. కానీ ఇటీవలే ఆమె అకౌంట్ను పునరుద్ధరించారు. ఇక అప్పట్నుంచి వివాదాలకు దూరంగా.. ఎక్కువగా పాజిటివ్ ట్వీట్లే వేస్తూ వచ్చింది కంగనా.
షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాను పొగడ్డం.. పెళ్ళికి సిద్ధమైన సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ జోడీని కొనియాడడం లాంటి తనకు సూట్ కాని పనులతో ఆశ్చర్యపరిచింది కంగనా. ఐతే ఇప్పుడు తన పాత స్టయిల్లోకి వెళ్లి ఇన్స్టాగ్రామ్లో ఆమె పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది.
తన వెనుక కుట్ర జరుగుతోందని, తనపై గూఢచర్యం చేస్తున్నారని కంగనా ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ మేరకు ఆమె ఒక లెంగ్తీ ఇన్స్టా పోస్టు పెట్టింది. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా నన్ను ఫాలో అవుతున్నారు. నాపై గూఢచర్యం చేస్తున్నారు. వీధుల్లోనే కాక బిల్డింగ్ పార్కింగ్, నా ఇంటి టెర్రస్లో కూడా వాళ్లు నా కోసం జూమ్ లెన్స్ ఏర్పాటు చేశారు. ఉదయం ఆరున్నరకి నా ఫొటోలు తీశారు. వాళ్లకు నా షెడ్యూల్ ఎలా తెలుస్తోంది? ఆ ఫొటోలను వాళ్లేం చేస్తారు? నా వాట్సాప్ డేలా, ప్రొఫెషనల్ కాంట్రాక్టులు, వ్యక్తిగత వివరాలు అన్నీ లీక్ అవుతున్నాయని నమ్ముతున్నా’’ అని కంగనా ఆరోపించింది.
ఆమె పరోక్షంగా రణబీర్ కపూర్, ఆలియా భట్లను ఉద్దేశించి ఆరోపణలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. పేరు పెట్టకుండా వారి గురించి పరోక్షంగా ఆమె వ్యాఖ్యలు చేసింది. ‘‘ఒకప్పుడు నా ఆహ్వానం లేకుండా నా ఇంటి వద్దకు వచ్చి నన్ను బలవంతం చేశాడు. ఇప్పుడు అతడి భార్యను నిర్మాతగా మార్చాలని చూస్తున్నాడు. నాలాగా మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని, నాలాగా దుస్తులు ధరిస్తూ అనుకరించమని అంటున్నాడు. వాళ్లు నా స్టైలిస్ట్, హోం స్టైలిస్ట్లను కూడా హైర్ చేసుకున్నారు. నా ఫైనాన్షియర్లు, బిజినెస్ పార్టనర్స్ ఎలాంటి కారణం లేకుండా చివరి నిమిషంలో కాంట్రాక్టులు రద్దు చేసుకున్నారు. అతను నన్ను ఒంటరిని చేసి, మానసికంగా ఒత్తిడికి గురి చేయాలని చూస్తున్నాడు’’ అని కంగనా పేర్కొంది.
This post was last modified on February 6, 2023 6:17 am
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…