భారతీయ సినిమా పాటను అత్యున్నత శిఖరాలకు చేర్చిన గాయనుల్లో ఒకరు వాణీ జయరాం. అమృతం గొంతులో నింపుకున్నట్లుగా తన గానంతో ఆమె సంగీత ప్రియుల్ని ఎంతగా అలరించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 19 భాషల్లో 11 వేల పాటలు పాడిన అరుదైన గాయని ఆమె. ఇటీవలే ఆమెను భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మభూషణ్’ కూడా వరించింది. ఆమె అభిమానులకు అమితానందాన్ని అందించిన విషయమిది.
ఐతే ఆ పురస్కారం అందుకున్న సమయంలో ఆరోగ్యంగానే కనిపించిన వాణీ జయరాం.. కొన్ని రోజులకే ఇలా కన్నుమూయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆది సహజ మరణం కాదని స్పష్టమవుతోంది. ఆమె ఏ స్థితిలో మరణించిందో తెలుసుకుని అభిమానులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అంతటి దిగ్గజ గాయనికి ఈ దుస్థితి ఏంటా అని మథన పడుతున్నారు.
వాణీ జయరాంకు పిల్లలు లేరు. ఆమె భర్త ఐదేళ్ల కిందట మరణించారు. ఒకప్పుడు వెలుగు జిలుగుల జీవితం చూసిన ఆమె కొన్నేళ్ల నుంచి ఆదరించేవారు లేక చెన్నైలోని తన ఇంటిలో ఒంటరి జీవితం గడుపుతున్న విషయం మరణించాకే చాలామందికి తెలిసింది. ఒక పనిమనిషి మినహా ఆమెను చూసుకోవడానికి సొంత వాళ్లంటూ ఎవరూ లేరట.
78 వయసులో ఒంటరి జీవనం గడుపుతూ అనుకోకుండా ఇంట్లో కింద పడడం.. గ్లాస్ టేబుల్ తగిలి గాయం కావడం ఆమె మరణానికి దారి తీసింది. గాయపడ్డపుడు సమయానికి ఇంట్లో పని మనిషి కూడా లేకపోవడంతో సాయం కోసం ఆమె చేసిన ప్రయత్నం అరణ్య రోదనే అయింది. చివరికి అలాగే ఆమె కన్ను మూసింది. రక్తసిక్తమైన ఆమె పార్థివ దేహాన్ని పోలీసులు బెడ్ షీట్లో చుట్టి తీసుకురావాల్సిన పరిస్థితి తెలిసింది. ఇదంతా తెలుసుకున్న అభిమానులు ఈ మధుర గాయనికి చివరికి ఇలాంటి పరిస్థితి తలెత్తిందేంటని వేదనకు గురవుతున్నారు.
This post was last modified on February 5, 2023 7:48 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…