కొన్ని కాంబినేషన్లలో సినిమాలను ఘనంగా ప్రకటిస్తారు. కానీ అవి అవి ఉన్నట్లుండి బ్రేక్ అయిపోతుంటాయి. టాలీవుడ్లో అలాంటి ఉదంతాలు బోలెడుతున్నాయి. ఇప్పుడు తమిళంలో ఒక క్రేజీ కాంబినేషన్ క్యాన్సిల్ అయిపోవడం చర్చనీయాంశంగా మారింది. తమిళంలో గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే టాప్ స్టార్లలో ఒకడు అజిత్. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకోటి అతను ఓకే చేసేస్తుంటాడు.
తన చివరి సినిమా ‘తునివు’ షూటింగ్ చివరి దశలో ఉండగా అతను నయనతార భర్త, యువ దర్శకుడు విఘ్నేష్ సినిమాతో సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపాడు. ఈ సినిమాను ఘనంగా ప్రకటించారు. కానీ ‘తునివు’ రిలీజై ఇక ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అనుకున్న దశలో కథ మలుపు తిరిగింది. విఘ్నేష్తో సినిమాను అజిత్ క్యాన్సిల్ చేసేసినట్లు తెలుస్తోంది.
విఘ్నేష్ ఫుల్ స్క్రిప్టుతో అజిత్ను మెప్పించలేకపోయాడని.. వీరి కలయికలో సినిమా రావడం కష్టమే అని కొన్ని రోజుల కిందటే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమని తేలిపోయింది. తన ట్విట్టర్ బయోలో ఇంతకుముందు పేర్కొన్న తన సినిమాల జాబితాలో #AK62 అని కూడా పెట్టుకున్నాడు విఘ్నేష్. తాజాగా ఆ పేరును తొలగించాడు. కాబట్టి అజిత్ కొత్త సినిమా నుంచి అతను వైదొలిగాడన్నది స్పష్టం.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి షూట్ మొదలు కావాల్సింది. కానీ కొంచెం లేటుగా విఘ్నేష్ సినిమా క్యాన్సిల్ కావడంతో అజిత్ హడావుడిగా వేరే ఆప్షన్లు చూస్తున్నాడు. తెలుగులోకి ‘రెడ్’ పేరుతో రీమేక్ అయిన ‘తడం’ సినిమా తీసిన మగిల్ తిరుమనితో అజిత్ జట్టు కట్టే అవకాశాలున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వేరే కొందరు స్టార్ డైరెక్టర్లు కూడా అజిత్తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు.
This post was last modified on February 4, 2023 5:45 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…