కొన్ని కాంబినేషన్లలో సినిమాలను ఘనంగా ప్రకటిస్తారు. కానీ అవి అవి ఉన్నట్లుండి బ్రేక్ అయిపోతుంటాయి. టాలీవుడ్లో అలాంటి ఉదంతాలు బోలెడుతున్నాయి. ఇప్పుడు తమిళంలో ఒక క్రేజీ కాంబినేషన్ క్యాన్సిల్ అయిపోవడం చర్చనీయాంశంగా మారింది. తమిళంలో గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే టాప్ స్టార్లలో ఒకడు అజిత్. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకోటి అతను ఓకే చేసేస్తుంటాడు.
తన చివరి సినిమా ‘తునివు’ షూటింగ్ చివరి దశలో ఉండగా అతను నయనతార భర్త, యువ దర్శకుడు విఘ్నేష్ సినిమాతో సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపాడు. ఈ సినిమాను ఘనంగా ప్రకటించారు. కానీ ‘తునివు’ రిలీజై ఇక ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అనుకున్న దశలో కథ మలుపు తిరిగింది. విఘ్నేష్తో సినిమాను అజిత్ క్యాన్సిల్ చేసేసినట్లు తెలుస్తోంది.
విఘ్నేష్ ఫుల్ స్క్రిప్టుతో అజిత్ను మెప్పించలేకపోయాడని.. వీరి కలయికలో సినిమా రావడం కష్టమే అని కొన్ని రోజుల కిందటే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమని తేలిపోయింది. తన ట్విట్టర్ బయోలో ఇంతకుముందు పేర్కొన్న తన సినిమాల జాబితాలో #AK62 అని కూడా పెట్టుకున్నాడు విఘ్నేష్. తాజాగా ఆ పేరును తొలగించాడు. కాబట్టి అజిత్ కొత్త సినిమా నుంచి అతను వైదొలిగాడన్నది స్పష్టం.
అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి షూట్ మొదలు కావాల్సింది. కానీ కొంచెం లేటుగా విఘ్నేష్ సినిమా క్యాన్సిల్ కావడంతో అజిత్ హడావుడిగా వేరే ఆప్షన్లు చూస్తున్నాడు. తెలుగులోకి ‘రెడ్’ పేరుతో రీమేక్ అయిన ‘తడం’ సినిమా తీసిన మగిల్ తిరుమనితో అజిత్ జట్టు కట్టే అవకాశాలున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వేరే కొందరు స్టార్ డైరెక్టర్లు కూడా అజిత్తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు.
This post was last modified on February 4, 2023 5:45 pm
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…