హైదరాబాద్ అమ్మాయే అయినా బాలీవుడ్లో ఎక్కువగా అవకాశాలు అందుకుని అక్కడే సెటిలైంది సమీరారెడ్డి. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా.. అవన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలే. ఎన్టీఆర్తో తొలిసారి ‘నరసింహుడు’ కోసం జత కట్టిన సమీరా.. ఆ తర్వాత అతడితోనే ‘అశోక్’ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవి’ కూడా చేసింది. కానీ ఈ మూడు సినిమాలూ ఫ్లాప్ కావడంతో ఆమెకు తెలుగులో తర్వాత అవకాశాలు రాలేదు. బాలీవుడ్కే పరిమితం అయింది.
ఐతే సమీరా నిజానికి ఎన్టీఆర్, చిరుల కంటే ముందు మరో టాప్ స్టార్ మహేష్ బాబుతో జట్టు కట్టాల్సిందట. తన కెరీర్ ఆరంభంలోనే మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చిందని.. కానీ ఆ చిత్రానికి ఆడిషన్ సరిగా చేయకపోవడంతో తనకు ఛాన్స్ మిస్సయిందని తాజాగా వెల్లడించింది సమీరా.
“నా తొలి సినిమా ఆడిషన్ 1998లో జరిగింది. అది కూడా మహేష్ బాబు సినిమా కోసం. ఆ రోజుకు ఎందుకో నాకు చాలా భయమేసింది. ఆ చిత్ర బృందం ఇచ్చిన టాస్క్ చేయలేక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయాను. అప్పటి వరకు నేనొక జాబ్ చేసేదాన్ని. ఆ ఆడిషన్ అనుభవంతో సినిమాల్లో నటించడం నా వల్ల కాదని.. నా జాబ్లోనే కొనసాగాలని అనుకున్నా. కానీ తర్వాత కొంత కాలానికి ధైర్యం కూడగట్టుకుని తొలిసారి ఒక ప్రైవేట్ ఆల్బం కోసం కెమెరా ముందుకు వచ్చా. ఆపై నా కెరీర్ మారిపోయింది” అని సమీరా వెల్లడించింది.
1998లో అంటే.. బహుశా అది హీరోగా మహేష్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’ కోసమే అయ్యుండొచ్చు. అలాంటి సూపర్ హిట్ మూవీతో సమీరా కథానాయికగా పరిచయం అయి ఉంటే టాలీవుడ్లో పెద్ద హీరోయిన్లలో ఒకటయ్యేదేమో.
This post was last modified on February 4, 2023 5:00 pm
శబరిమలలోకి అన్యమతస్థులను అనుమతించే విషయంలో షరతులపై ఎప్పట్నుంచో వివాదాలున్నాయి. క్రిస్టియన్ అయిన ఏసుదాసు శబరిమలకు రావాలనుకున్నపుడు ఆయన్ని అడ్డుకోవడం మీద…
వైసీపీలో అందగాళ్లంతా కూటమి సర్కారుకు టార్గెట్ గా మారుతున్నారంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్న…
ఏపీలో విపక్షం వైసీపీకి హార్డ్ కోర్ అభిమానిగానే కాకుండా ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా కొనసాగుతున్న ఇప్పాల రవీంద్రా…
ఏ సినిమా గురించైనా వాటి నిర్మాతలు బాగుంటుంది అదిరిపోతుంది చూడమని చెప్పడం సహజం. కానీ మైత్రి రవిశంకర్ ఒక అడుగు…
హైదరాబాద్ క్రికెట్ అభిమానుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఓ మంచి వార్త అందించింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో…
ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ భూతంగా మారుతున్న ఈ రోజుల్లో, కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆన్లైన్…