హైదరాబాద్ అమ్మాయే అయినా బాలీవుడ్లో ఎక్కువగా అవకాశాలు అందుకుని అక్కడే సెటిలైంది సమీరారెడ్డి. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా.. అవన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలే. ఎన్టీఆర్తో తొలిసారి ‘నరసింహుడు’ కోసం జత కట్టిన సమీరా.. ఆ తర్వాత అతడితోనే ‘అశోక్’ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవి’ కూడా చేసింది. కానీ ఈ మూడు సినిమాలూ ఫ్లాప్ కావడంతో ఆమెకు తెలుగులో తర్వాత అవకాశాలు రాలేదు. బాలీవుడ్కే పరిమితం అయింది.
ఐతే సమీరా నిజానికి ఎన్టీఆర్, చిరుల కంటే ముందు మరో టాప్ స్టార్ మహేష్ బాబుతో జట్టు కట్టాల్సిందట. తన కెరీర్ ఆరంభంలోనే మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చిందని.. కానీ ఆ చిత్రానికి ఆడిషన్ సరిగా చేయకపోవడంతో తనకు ఛాన్స్ మిస్సయిందని తాజాగా వెల్లడించింది సమీరా.
“నా తొలి సినిమా ఆడిషన్ 1998లో జరిగింది. అది కూడా మహేష్ బాబు సినిమా కోసం. ఆ రోజుకు ఎందుకో నాకు చాలా భయమేసింది. ఆ చిత్ర బృందం ఇచ్చిన టాస్క్ చేయలేక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయాను. అప్పటి వరకు నేనొక జాబ్ చేసేదాన్ని. ఆ ఆడిషన్ అనుభవంతో సినిమాల్లో నటించడం నా వల్ల కాదని.. నా జాబ్లోనే కొనసాగాలని అనుకున్నా. కానీ తర్వాత కొంత కాలానికి ధైర్యం కూడగట్టుకుని తొలిసారి ఒక ప్రైవేట్ ఆల్బం కోసం కెమెరా ముందుకు వచ్చా. ఆపై నా కెరీర్ మారిపోయింది” అని సమీరా వెల్లడించింది.
1998లో అంటే.. బహుశా అది హీరోగా మహేష్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’ కోసమే అయ్యుండొచ్చు. అలాంటి సూపర్ హిట్ మూవీతో సమీరా కథానాయికగా పరిచయం అయి ఉంటే టాలీవుడ్లో పెద్ద హీరోయిన్లలో ఒకటయ్యేదేమో.
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…