Movie News

మహేష్ సినిమా ఆడిషన్ నుంచి ఏడుస్తూ..

హైదరాబాద్ అమ్మాయే అయినా బాలీవుడ్లో ఎక్కువగా అవకాశాలు అందుకుని అక్కడే సెటిలైంది సమీరారెడ్డి. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా.. అవన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలే. ఎన్టీఆర్‌తో తొలిసారి ‘నరసింహుడు’ కోసం జత కట్టిన సమీరా.. ఆ తర్వాత అతడితోనే ‘అశోక్’ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవి’ కూడా చేసింది. కానీ ఈ మూడు సినిమాలూ ఫ్లాప్ కావడంతో ఆమెకు తెలుగులో తర్వాత అవకాశాలు రాలేదు. బాలీవుడ్‌కే పరిమితం అయింది.

ఐతే సమీరా నిజానికి ఎన్టీఆర్, చిరుల కంటే ముందు మరో టాప్ స్టార్ మహేష్ బాబుతో జట్టు కట్టాల్సిందట. తన కెరీర్ ఆరంభంలోనే మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చిందని.. కానీ ఆ చిత్రానికి ఆడిషన్ సరిగా చేయకపోవడంతో తనకు ఛాన్స్ మిస్సయిందని తాజాగా వెల్లడించింది సమీరా.

“నా తొలి సినిమా ఆడిషన్ 1998లో జరిగింది. అది కూడా మహేష్ బాబు సినిమా కోసం. ఆ రోజుకు ఎందుకో నాకు చాలా భయమేసింది. ఆ చిత్ర బృందం ఇచ్చిన టాస్క్ చేయలేక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయాను. అప్పటి వరకు నేనొక జాబ్ చేసేదాన్ని. ఆ ఆడిషన్ అనుభవంతో సినిమాల్లో నటించడం నా వల్ల కాదని.. నా జాబ్‌లోనే కొనసాగాలని అనుకున్నా. కానీ తర్వాత కొంత కాలానికి ధైర్యం కూడగట్టుకుని తొలిసారి ఒక ప్రైవేట్ ఆల్బం కోసం కెమెరా ముందుకు వచ్చా. ఆపై నా కెరీర్ మారిపోయింది” అని సమీరా వెల్లడించింది.

1998లో అంటే.. బహుశా అది హీరోగా మహేష్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’ కోసమే అయ్యుండొచ్చు. అలాంటి సూపర్ హిట్ మూవీతో సమీరా కథానాయికగా పరిచయం అయి ఉంటే టాలీవుడ్లో పెద్ద హీరోయిన్లలో ఒకటయ్యేదేమో.

This post was last modified on February 4, 2023 5:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

9 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

21 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

3 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

4 hours ago