టాలీవుడ్లో కరోనా టైంలో రిలీజ్ డేట్ల గందరగోళం ఎలా సాగిందో తెలిసిందే. ఒకప్పుడు ఒక డేట్ ఇచ్చి దాన్ని మార్చాలంటే పరిపరి విధాలా ఆలోచించేవారు. దాన్నో నెగెటివ్ సెంటిమెంటుగా ఫీలయ్యేవాళ్లు. కానీ కరోనా పుణ్యమా అని ఆ ఫీలింగ్ అంతా పక్కకు వెళ్లిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమానే ఐదారుసార్లు రిలీజ్ డేట్ మార్చుకునేసరికి.. ఇక మిగతా సినిమాలకు డేట్లు మార్చే విషయంలో ఎవరికీ మొహమాటాలు ఉండట్లేదు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వాయిదా అంటున్నారు. డేట్ మార్చేస్తున్నారు.
ఐతే పదే పదే డేట్లు మార్చడం వల్ల గందరగోళం తప్పట్లేదు. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయం నెలకొంటోంది. ఫిబ్రవరి సినిమాల విషయంలోనూ ప్రస్తుతం ఇదే అయోమయం కనిపిస్తోంది. ఆల్రెడీ ఈ నెలలో రిలీజ్ డేట్లు ఇటు ఇటు అయ్యాయి. చివరికి ఏ వారం ఏ సినిమా అన్నది ఫిక్స్ అయినట్లే కనిపించింది.
కానీ ఇప్పుడు మళ్లీ గందరగోళం తప్పట్లేదు. 17న ‘శాకుంతలం’ వస్తుందన్న అంచనాతో ఆ రోజే రావాల్సిన విశ్వక్సేన్ సినిమా ‘ధమ్కీ’ని కొంచెం వెనక్కి జరిపారు. అలాగే ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’ను కూడా హోల్డ్లో పెట్టారు. తీరా ఇప్పుడు చూస్తే ‘శాకుంతలం’ వాయిదా అంటున్నారు. దీంతో ‘ధమ్కీ’, ‘సార్’ సినిమాల టీంలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తమ చిత్రాలు వాయిదా అన్న అంచనాతో కొంచెం తాపీగా వర్క్ చేసుకుంటుండగా.. ఇప్పుడు ‘శాకుంతలం’ వాయిదాతో హడావుడి పడుతున్నారు. విశ్వక్ సినిమా అయితే ఆ రోజు వచ్చే ఛాన్స్ దాదాపు లేనట్లే. ‘సార్’ను మాత్రం 17నే తేవాలనుకుంటున్నారట. ఈ సినిమా కోసం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ను ఒక రోజు వెనక్కి జరుపుతున్నారన్నది తాజా సమాచారం.
కాగా 17న పోటీ తక్కువ ఉండేట్లయితే శివరాత్రి వీకెండ్ను ఉపయోగించుకోవడం కోసం ఫిబ్రవరి 10న రావాల్సిన ‘అమిగోస్’ను వారం వెనక్కి జరిపే అవకాశం కూడా ఉందంటున్నారు. ఈ సినిమా ఇక్కడ ఖాళీ చేస్తే దాన్ని ఇంకో సినిమా ఏదో ఒకటి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ‘శాకుంతలం’ వాయిదా వార్తల పుణ్యమా అని చాలా గందరగోళమే తలెత్తినట్లు కనిపిస్తోంది.
This post was last modified on February 3, 2023 10:57 am
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…