Movie News

వినోద ప్రియులకు నెట్ ఫ్లిక్స్ షాక్

ఓటిటిలు మనుగడ సాధించాడనికి ప్రధాన కారణం ఒకే అకౌంట్ ని ఇద్దరి నుంచి నలుగురు పంచుకునే వెసులుబాటు ఉండటం. అంటే చందా వెయ్యి ఉంటే తలో రెండు వందల యాభై రూపాయలు వేసుకుని షేర్ చేసుకునే వాళ్ళు. దీని వల్లే అమెజాన్ ప్రైమ్ కు ఇండియాలో భారీ కౌంట్ ఉంది.

ప్రపంచ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మాత్రం దీని వల్ల జరుగుతోన్న నష్టాన్ని గుర్తించి ఆ మేరకు కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. అయితే ఇవి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. యుఎస్ లాంటి దేశాల్లో ఈ షేరింగ్ పద్దతి వల్లే 100 మిలియన్ల యుజర్లు అసలైన ఓనర్లు కాదని గుర్తించిందట.

రాబోయే పద్ధతి ప్రకారం అసలైన సబ్స్క్రైబర్ ముందు ఏ వైఫై నెట్ వర్క్ లో లాగిన్ అయ్యుంటాడో దాన్ని వాడే మిగిలిన వాళ్ళు కనీసం నెలరోజులకు ఒకసారి అదే నెట్ వర్క్ లోకి వచ్చి ప్రవేశించాలి. లేదంటే బ్లాక్ అవుతుంది. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. హైదరాబాద్ లో సురేష్ తన అకౌంట్ ని రాజమండ్రిలో ఉన్న కిరణ్ తో పంచుకున్నాడు. అయితే కిరణ్ కు అది పని చేయాలంటే నెలకోసారి సురేష్ ఇంటికి వచ్చి ఆ వైఫై లోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. లేదూ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నామనుకుంటే తాత్కాలికంగా కొంత డబ్బు కట్టి నెట్ ఫ్లిక్స్ ని వాడుకోవచ్చు. లేదంటే రాదు.

మతలబు బాగుంది కదూ. ప్రస్తుతానికి ఇండియాలో కాదు కానీ అమెరికాలో లాంచ్ చేయబోతున్నారు. తర్వాత క్రమంగా మన దేశానికి తీసుకొస్తారు. అసలే నెలవారి రేట్లు అధికంగా ఉన్నాయని ఓటిటి లవర్స్ మొత్తుకుంటున్న టైంలో ఇలాంటి ట్విస్టులు పెడితే పైరసీ లాంటి వాటిని మరింత ప్రోత్సహించినట్టు అవుతుంది. ఆహా, హాట్ స్టార్, ప్రైమ్, సోనీ లివ్ లు ఇలాంటి కండీషన్లు ఏమీ పెట్టే ఆలోచనలో లేవు. ఒకవేళా భవిష్యత్తులో అనుసరిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకపక్క థియేటర్ల టికెట్ రేట్లు బరువై ఇంట్లోనే కాలక్షేపం చేద్దామంటే మరోపక్క ఓటిటిలు ఇలాంటి మెడ మీద కత్తులు పెడితే వినోద ప్రియులకు కష్టమే

This post was last modified on February 2, 2023 6:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

29 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

1 hour ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago