ఓటిటిలు మనుగడ సాధించాడనికి ప్రధాన కారణం ఒకే అకౌంట్ ని ఇద్దరి నుంచి నలుగురు పంచుకునే వెసులుబాటు ఉండటం. అంటే చందా వెయ్యి ఉంటే తలో రెండు వందల యాభై రూపాయలు వేసుకుని షేర్ చేసుకునే వాళ్ళు. దీని వల్లే అమెజాన్ ప్రైమ్ కు ఇండియాలో భారీ కౌంట్ ఉంది.
ప్రపంచ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మాత్రం దీని వల్ల జరుగుతోన్న నష్టాన్ని గుర్తించి ఆ మేరకు కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. అయితే ఇవి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. యుఎస్ లాంటి దేశాల్లో ఈ షేరింగ్ పద్దతి వల్లే 100 మిలియన్ల యుజర్లు అసలైన ఓనర్లు కాదని గుర్తించిందట.
రాబోయే పద్ధతి ప్రకారం అసలైన సబ్స్క్రైబర్ ముందు ఏ వైఫై నెట్ వర్క్ లో లాగిన్ అయ్యుంటాడో దాన్ని వాడే మిగిలిన వాళ్ళు కనీసం నెలరోజులకు ఒకసారి అదే నెట్ వర్క్ లోకి వచ్చి ప్రవేశించాలి. లేదంటే బ్లాక్ అవుతుంది. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. హైదరాబాద్ లో సురేష్ తన అకౌంట్ ని రాజమండ్రిలో ఉన్న కిరణ్ తో పంచుకున్నాడు. అయితే కిరణ్ కు అది పని చేయాలంటే నెలకోసారి సురేష్ ఇంటికి వచ్చి ఆ వైఫై లోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. లేదూ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నామనుకుంటే తాత్కాలికంగా కొంత డబ్బు కట్టి నెట్ ఫ్లిక్స్ ని వాడుకోవచ్చు. లేదంటే రాదు.
మతలబు బాగుంది కదూ. ప్రస్తుతానికి ఇండియాలో కాదు కానీ అమెరికాలో లాంచ్ చేయబోతున్నారు. తర్వాత క్రమంగా మన దేశానికి తీసుకొస్తారు. అసలే నెలవారి రేట్లు అధికంగా ఉన్నాయని ఓటిటి లవర్స్ మొత్తుకుంటున్న టైంలో ఇలాంటి ట్విస్టులు పెడితే పైరసీ లాంటి వాటిని మరింత ప్రోత్సహించినట్టు అవుతుంది. ఆహా, హాట్ స్టార్, ప్రైమ్, సోనీ లివ్ లు ఇలాంటి కండీషన్లు ఏమీ పెట్టే ఆలోచనలో లేవు. ఒకవేళా భవిష్యత్తులో అనుసరిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకపక్క థియేటర్ల టికెట్ రేట్లు బరువై ఇంట్లోనే కాలక్షేపం చేద్దామంటే మరోపక్క ఓటిటిలు ఇలాంటి మెడ మీద కత్తులు పెడితే వినోద ప్రియులకు కష్టమే
This post was last modified on February 2, 2023 6:00 pm
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…