స్టార్ హీరోలకు సంబంధించినది ఏదైనా సరే క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని వీలైనంత త్వరగా క్యాష్ చేసుకోవాలి. అది సినిమా కావొచ్చు. మరొకటి అవ్వొచ్చు. టైమింగ్ కీలకం. అంతే తప్ప తాపీగా ఉండి తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందామనుకుంటే అసలుకే మోసం వస్తుంది. ఇది సినిమాలకే కాదు వెబ్ సిరీస్ లకూ వర్తిస్తుంది. వెంకటేష్ రానా కాంబోలో రూపొందిన రానా నాయుడు షూటింగ్ ని నెట్ ఫ్లిక్స్ ఎప్పుడో పూర్తి చేసింది. ఆ మధ్య ఫస్ట్ లుక్కులు, టీజర్ లు కూడా వచ్చాయి. అంతే ఆ తర్వాత మొత్తం సైలెంట్. 2024 షెడ్యూల్ ని డేట్లతో సహా ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ అందులో రానా నాయుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేదు.
అల్లుడు నాగ చైతన్యదీ ఇదే పరిస్థితి. అమెజాన్ ప్రైమ్ కోసం చేసిన వెబ్ సిరీస్ దూత గత కొంత కాలంగా ఏ సౌండూ చేయడం లేదు. విక్రమ్ కె కుమార్ లాంటి అగ్ర దర్శకుడు తీసినా హైప్ ని పెంచడంలో ప్రైమ్ ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. ఈ కాంబోలో వచ్చిన థాంక్ యు డిజాస్టర్ ఫలితం వల్ల కొంత వెనుకడుగు వేసిందేమోననే టాక్ ఉంది కానీ కేవలం ఆ కారణంగా ఇంత ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. చైతు ఫస్ట్ టైం హారర్ జానర్ ట్రై చేసింది దూతతోనే. దీంతో రానా నాయుడు, దూతలు దసరా నుంచి ఏదో ఒక పండక్కు వస్తాయని ఫ్యాన్స్ ఎదురు చూడటం తీరా ఏ అప్డేట్ లేక ఉసూరుమనడం జరుగుతూ వస్తోంది.
ఫైనల్ గా ఇవి ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయనే క్లారిటీ మిస్సవుతోంది. వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చైతు కస్టడీతో బిజీగా ఉన్నాడు. రెండు సీరియస్ జానర్లే. పైన చెప్పిన వెబ్ సిరీస్ లు అంతే. మరి ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మనసులో ఏముందో కానీ ఈ డిలే మాత్రం ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతూ క్రమంగా ఆసక్తి పోయేలా చేస్తోంది. అసలే థియేటర్లకు జనాలు మునుపటిలా బాగా వెళ్తున్న ట్రెండ్ లో వెబ్ సిరీస్ ల తాకిడి తగ్గిపోయింది. హిందీలో ఏమో కానీ తెలుగులో పెద్దగా తీయడం లేదు. ఇవి మళ్ళీ పుంజుకోవాలంటే ఇలాంటి స్టార్ హీరోల కంటెంట్ వీలైనంత త్వరగా తీసుకురావాలి.
This post was last modified on February 2, 2023 1:57 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…