నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరంభంలో కొంత ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ‘భలే భలే మగాడివోయ్’తో అతడి రేంజ్ మారిపోయింది. ఆ సినిమా నాని స్థాయికి మించి చాలా పెద్ద హిట్ అయింది. అక్కడ మొదలైన ఊపు అరడజను సినిమాల వరకు కొనసాగింది. వరుస హిట్లతో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఎదిగిపోయాడు. కానీ అక్కడి నుంచి తర్వాతి దశకు మాత్రం వెళ్లలేకపోయాడు. ఇందుకు ఒక రకంగా మాస్ సినిమాలు చేయకపోవడం కూడా ఒక కారణం. అలాగే నిలకడగా సక్సెస్లు రాకపోవడం కూడా మైనస్ అయింది. ‘వి’ సహా కొన్ని మాస్ సినిమాలు చేసినా నాని రేంజ్ .పెరగలేదు.
ఐతే ఇప్పుడు నాని ‘దసరా’తో బాక్సాఫీస్ దగ్గర తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ సినిమా క్లిక్ అయితే మామూలు హిట్ కాదని, నాని రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయి పాన్ ఇండియా స్టార్ అయినా ఆశ్చర్యం లేదన్నది ట్రేడ్ వర్గాలు, విశ్లేషకుల మాట.
‘దసరా’ సినిమా టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పాన్ ఇండియా స్థాయిలో అది ట్రెండ్ అయింది. వేరే భాషల వాళ్లు కూడా ఈ టీజర్లో కంటెంట్ ఉందని గుర్తించారు. నాని కెరీర్లో ఇంత మాస్గా, రఫ్గా ఒక సినిమా చేయడం ఇప్పటిదాకా జరగలేదు. నానికి ఉన్న సాఫ్ట్ ఇమేజ్ను బట్టి చూస్తే ఇలాంటి పాత్రను ఎంచుకోవడం ఆశ్చర్యం. ఐతే ఇలాంటి పాత్రలతోనే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతుంటాయి. అందుకు ‘పుష్ఫ’ ఒక ఉదాహరణ. ఆ సినిమా జాతీయ స్థాయిలో ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ‘దసరా’ కూడా అలా క్లిక్ అయినా ఆశ్చర్యం లేదు.
నాని సైతం ఈ సినిమా గురించి చెబుతూ కేజీఎఫ్-2, కాంతార, ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద రేంజి సినిమాల ప్రస్తావన తెచ్చాడు. టీజర్ వరకు మంచి విషయం ఉన్నట్లు కనిపించిన ‘దసరా’ సినిమా పరంగా కూడా అంతే మెప్పిస్తే తెలుగులోనే కాక వేరే భాషల్లోనూ గట్టిగానే ప్రభావం చూపొచ్చు. సినిమా ఊహించని స్థాయికి వెళ్లిపోయి నాని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న నెక్స్ట్ లెవెల్ స్టార్ ఇమేజ్, మార్కెట్ అతడి సొంతం కావచ్చు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…