వెండితెరపై మనం చూసే కల్పిత పాత్రలకు కొన్నిసార్లు నిజ జీవిత వ్యక్తులు కూడా స్ఫూర్తిగా నిలుస్తుంటారు. సంక్రాంతి రిలీజై మంచి హిట్టయిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ప్రధాన పాత్రకు విషయంలోనూ అలాగే జరిగిందట. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వీరసింహారెడ్డి పాత్రను పరిటాల రవి స్ఫూర్తితోనే తీర్చిదిద్దినట్లు స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
పరిటాల రవి గురించి తాను విన్నది, చదివింది దృష్టిలో ఉంచుకుని ఆ పాత్రను డిజైన్ చేసినట్లు అతను వివరించాడు. ‘వీరసింహారెడ్డి’ ఇంటర్వెల్ ఎపిసోడ్ను పూర్తిగా పరిటాల రవిని దృష్టిలో ఉంచుకునే చేసినట్లు గోపీచంద్ చెప్పడం విశేషం.
ఒక సందర్భంలో పోలీసులు తనను తనిఖీ చేస్తుంటే.. పరిటాల రవి తన జీపుకి ఆనుకుని అదేం పట్టనట్లు స్టైల్గా సిగరెట్ తాగుతున్న ఫొటోను తాను పేపర్లో చూశానని.. అది దృష్టిలో ఉంచుకునే ‘వీరసింహారెడ్డి’ ఇంటర్వెల్లో చనిపోతూ కూడా స్టైల్గా బాలయ్య చుట్ట తాగే సన్నివేశం పెట్టానని గోపీచంద్ చెప్పాడు. ఇక వీరసింహారెడ్డిని శత్రువులు విదేశాల్లో చంపడం వెనుక కూడా పరిటాల రవి గురించి తాను తెలుసుకున్న ఒక విషయం స్ఫూర్తిగా నిలిచిందని అతను వెల్లడించాడు.
పరిటాల మీద ఎటాక్ జరిగి చనిపోవడానికి ముందు ఆయన్ని అమెరికా పర్యటనకు ఆహ్వానించారని.. ఆ టూర్కు ఆయన వెళ్లి ఉంటే బతికేవారని అంటారని.. ఒకవేళ పరిటాల విదేశాలకు వెళ్లి అక్కడ ఆయన మీద ఎటాక్ జరిగితే అన్న రకంగా ఆలోచించి తాను ఇంటర్వెల్ ఎపిసోడ్ పెట్టినట్లు గోపీచంద్ వెల్లడించాడు. రాయలసీమలో పరిటాల రవికి ఉన్న ఇమేజ్ను దృష్టిలో ఉంచుకునే వీరసింహారెడ్డి పాత్రను కూడా తీర్చిదిద్దామని.. సినిమాలో చూపించిన సన్నివేశాలు అలాగే పరిటాల జీవితంలో జరిగి ఉండకపోవచ్చని.. కానీ ఆ పాత్ర ఆయన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on February 1, 2023 9:38 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…