వెండితెరపై మనం చూసే కల్పిత పాత్రలకు కొన్నిసార్లు నిజ జీవిత వ్యక్తులు కూడా స్ఫూర్తిగా నిలుస్తుంటారు. సంక్రాంతి రిలీజై మంచి హిట్టయిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ప్రధాన పాత్రకు విషయంలోనూ అలాగే జరిగిందట. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వీరసింహారెడ్డి పాత్రను పరిటాల రవి స్ఫూర్తితోనే తీర్చిదిద్దినట్లు స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
పరిటాల రవి గురించి తాను విన్నది, చదివింది దృష్టిలో ఉంచుకుని ఆ పాత్రను డిజైన్ చేసినట్లు అతను వివరించాడు. ‘వీరసింహారెడ్డి’ ఇంటర్వెల్ ఎపిసోడ్ను పూర్తిగా పరిటాల రవిని దృష్టిలో ఉంచుకునే చేసినట్లు గోపీచంద్ చెప్పడం విశేషం.
ఒక సందర్భంలో పోలీసులు తనను తనిఖీ చేస్తుంటే.. పరిటాల రవి తన జీపుకి ఆనుకుని అదేం పట్టనట్లు స్టైల్గా సిగరెట్ తాగుతున్న ఫొటోను తాను పేపర్లో చూశానని.. అది దృష్టిలో ఉంచుకునే ‘వీరసింహారెడ్డి’ ఇంటర్వెల్లో చనిపోతూ కూడా స్టైల్గా బాలయ్య చుట్ట తాగే సన్నివేశం పెట్టానని గోపీచంద్ చెప్పాడు. ఇక వీరసింహారెడ్డిని శత్రువులు విదేశాల్లో చంపడం వెనుక కూడా పరిటాల రవి గురించి తాను తెలుసుకున్న ఒక విషయం స్ఫూర్తిగా నిలిచిందని అతను వెల్లడించాడు.
పరిటాల మీద ఎటాక్ జరిగి చనిపోవడానికి ముందు ఆయన్ని అమెరికా పర్యటనకు ఆహ్వానించారని.. ఆ టూర్కు ఆయన వెళ్లి ఉంటే బతికేవారని అంటారని.. ఒకవేళ పరిటాల విదేశాలకు వెళ్లి అక్కడ ఆయన మీద ఎటాక్ జరిగితే అన్న రకంగా ఆలోచించి తాను ఇంటర్వెల్ ఎపిసోడ్ పెట్టినట్లు గోపీచంద్ వెల్లడించాడు. రాయలసీమలో పరిటాల రవికి ఉన్న ఇమేజ్ను దృష్టిలో ఉంచుకునే వీరసింహారెడ్డి పాత్రను కూడా తీర్చిదిద్దామని.. సినిమాలో చూపించిన సన్నివేశాలు అలాగే పరిటాల జీవితంలో జరిగి ఉండకపోవచ్చని.. కానీ ఆ పాత్ర ఆయన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on February 1, 2023 9:38 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…