టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. గత ఏడాది నితిన్ పెళ్లి చేసుకోగా.. ఈ మధ్యే శర్వానంద్ నిశ్చితార్థం చేసుకుని వివాహానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడిక మెగా కుర్రాడు వరుణ్ తేజ్ వంతు వచ్చినట్లుంది. ముందుగా కూతురు నిహారికకు పెళ్లి చేసిన నాగబాబు.. కొడుకు పెళ్లి కోసం రెండేళ్ల కిందటే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ప్రస్తుతం ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే.. వరుణ్ పెళ్లి దాదాపు ఖాయం అయిపోయినట్లే కనిపిస్తోంది. ఐతే అమ్మాయి ఎవరన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే పెళ్లి తర్వాత వరుణ్ వేరు కాపురం పెడతాడని కూడా నాగబాబు హింట్ ఇవ్వడం విశేషం. వరుణ్ పెళ్లి గురించి నాగబాబు ఏమన్నాడంటే..
‘‘వరుణ్ పెళ్లి త్వరలోనే ఉంటుంది. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయంపై నేను ఇప్పుడే కామెంట్ చేయను. తనకు కాబోయే భార్య గురించి స్వయంగా వరుణే వెల్లడిస్తాడు. పిల్లల్ని కంట్రోల్ చేయాలని నేనెప్పుడూ అనుకోను. ఎవరి జీవితాలు వాళ్లు చూసుకోవాలన్నది నా సిద్ధాంతం. అందుకే ఇప్పటికే నేను, నా భార్య ఒక చోట.. వరుణ్ మరోచోట ఉంటున్నాం. పెళ్లి తర్వాత కూడా వరుణ్ వేరుగా ఉంటాడు. విడివిడిగా ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటే’’ అని నాగబాబు చెప్పాడు.
ఇక మెగా, అల్లు కుటుంబాల మధ్య వైరం గురించి నాగబాబును అడగ్గా.. ఇదంతా ఉత్త ప్రచారమే అని, తామందరం ఒక్కటే అని నాగబాబు స్పష్టం చేశాడు. 33 ఏళ్ల వరుణ్ తొమ్మిదేళ్ల కిందట ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అతడి కెరీర్లో ఫిదా, ఎఫ్-2 లాంటి పెద్ద హిట్లున్నాయి. ప్రస్తుతం అతను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’తో పాటు ఓ కొత్త దర్శకుడితో ఇంకో థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు.
This post was last modified on February 1, 2023 12:57 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…