Movie News

మెగా ప్రిన్స్ పెళ్లి ఫిక్సయిపోయిందా?

టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. గత ఏడాది నితిన్ పెళ్లి చేసుకోగా.. ఈ మధ్యే శర్వానంద్ నిశ్చితార్థం చేసుకుని వివాహానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడిక మెగా కుర్రాడు వరుణ్ తేజ్ వంతు వచ్చినట్లుంది. ముందుగా కూతురు నిహారికకు పెళ్లి చేసిన నాగబాబు.. కొడుకు పెళ్లి కోసం రెండేళ్ల కిందటే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ప్రస్తుతం ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే.. వరుణ్ పెళ్లి దాదాపు ఖాయం అయిపోయినట్లే కనిపిస్తోంది. ఐతే అమ్మాయి ఎవరన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే పెళ్లి తర్వాత వరుణ్ వేరు కాపురం పెడతాడని కూడా నాగబాబు హింట్ ఇవ్వడం విశేషం. వరుణ్ పెళ్లి గురించి నాగబాబు ఏమన్నాడంటే..

‘‘వరుణ్ పెళ్లి త్వరలోనే ఉంటుంది. ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయంపై నేను ఇప్పుడే కామెంట్ చేయను. తనకు కాబోయే భార్య గురించి స్వయంగా వరుణే వెల్లడిస్తాడు. పిల్లల్ని కంట్రోల్ చేయాలని నేనెప్పుడూ అనుకోను. ఎవరి జీవితాలు వాళ్లు చూసుకోవాలన్నది నా సిద్ధాంతం. అందుకే ఇప్పటికే నేను, నా భార్య ఒక చోట.. వరుణ్ మరోచోట ఉంటున్నాం. పెళ్లి తర్వాత కూడా వరుణ్ వేరుగా ఉంటాడు. విడివిడిగా ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటే’’ అని నాగబాబు చెప్పాడు.

ఇక మెగా, అల్లు కుటుంబాల మధ్య వైరం గురించి నాగబాబును అడగ్గా.. ఇదంతా ఉత్త ప్రచారమే అని, తామందరం ఒక్కటే అని నాగబాబు స్పష్టం చేశాడు. 33 ఏళ్ల వరుణ్ తొమ్మిదేళ్ల కిందట ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అతడి కెరీర్లో ఫిదా, ఎఫ్-2 లాంటి పెద్ద హిట్లున్నాయి. ప్రస్తుతం అతను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’తో పాటు ఓ కొత్త దర్శకుడితో ఇంకో థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు.

This post was last modified on February 1, 2023 12:57 pm

Share

Recent Posts

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో…

4 hours ago

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

5 hours ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

5 hours ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

5 hours ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

5 hours ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

5 hours ago